Pages

Thursday, April 13, 2017

జ్యోతిరావ్ పూలే



జ్యోతిరావ్ పూలేజ్యోతిరావ్ పూలే

జననం : ఏప్రిల్ 11, 1827
కాట్గూన్సతారాబ్రిటిష్ ఇండియా (ప్రస్తుతంమహారాష్ట్రభారతదేశం)
మరణం : 1890 (వయసు 63)
పూనే
నివాస ప్రాంతం : సతారామహారాష్ట్ర
ఇతర పేర్లు : మహాత్మాపూలే
వృత్తి : సంఘ సంస్కర్త నీతిమతముమానవతావాదం
భార్య : సావిత్రీబాయి ఫులే
తండ్రి : గోవిందరావు

జ్యోతీరావ్ ఫులే లేదా జ్యోతీబా గోవిందరావ్ ఫులే (ఆంగ్లం : Jotiba Govindrao Phule) (మరాఠీ: जोतीबा गोविंदराव फुले ) (జననం ఏప్రిల్ 11, 1827 - మరణం నవంబరు 28, 1890), మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త. థామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మాన్ ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఇతడు స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనుస్మృతిని తిరస్కరించాడు. మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. ప్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్పోస్జ్ అనే గ్రంథాన్ని సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు. 1872లో గులాంగిరి అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఈయన స్థాపించిన సంస్థ - సత్య శోధక్ సమాజ్.

పులే బాల్యము

జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారాజిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి గోవిందరావు ఒక కూరగాయల వ్యాపారి. తల్లి ఇతనికి 9 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే ఫులే చదువు మానేసి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. 12 సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు. ఇతని భార్య సావిత్రి ఫులే.

జ్యోతిరావ్ ఫూలేపై వచ్చిన వ్యాసాలు

గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే దంపతులు నివసించిన భవనం నేటికీ పుణేలో నిలిచి ఉంది. ఆ భవనంలోని హాలులో ఫూలేసావిత్రిబాయి ఫూలే, సాహు మహరాజ్‌ల సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. ఆయన ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న తెలుగుబిడ్డ. నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదనుకొని తండ్రిలా భవన నిర్మాణవృత్తిని చేపట్టారు.పుణే, ముం బైలలో సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ల ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కారాడీ లింగువంటి సహచరుడు దొరకడం ఫూలే అదృష్టమని చరిత్రకారులు అంటారు. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు.ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది. వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింపజేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి. వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. వారిని గొప్పవిద్యావంతులుగా, సత్యశోధకులుగా చేసిన ఘనత వెంకయ్యదే. ఆయన రచిం చిన ఈశ్వరునికి ప్రార్థనను మరాఠీలోని తొలి వ్యంగ్యరచన గా గుర్తించాలని సాహిత్య చరిత్రకారులు కోరుతున్నారు. ఫూలే ప్రసిద్ధ గ్రంథం గులాంగిరిని ఆయనే ప్రచురించారు.

వెంకయ్య కుటుంబ సభ్యులు సావిత్రీబాయి జీవిత చరిత్రను కూర్చి, మూడుమార్లు ప్రచురించారు. సాహు మహారాజ్‌కు ఆంతరంగిక సలహాదారుగా పనిచేసిన భాస్కర్‌రావ్ జాదవ్, రామయ్య తీర్చిదిద్దిన ఆణిముత్యాలలో ఒకరు మాత్రమే. జాదవ్ సత్యశోధక ఉద్యమ నాయకునిగా అన్ని వర్గాల గుర్తింపును పొందారు. ఫూలే ఆలోచనల వ్యాప్తికి, కార్మిక సమస్యలను వెలుగులోకి తేవడానికి కృషిచేసిన దీనబంధుపత్రికకు ఆయనే వెన్నెముకై నిలిచారు. ఫూలేకు అడుగడుగుడునా అండదండగా నిలిచి, ఆయన తర్వాత కూడా సత్యశోధక సమాజ ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో తెలుగువారి పాత్ర అద్వితీయమైనది.(సాక్షి 28-11-12).

భారత ప్రప్రథమ సామాజికతత్వవేత్త

కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు మహాత్మ జోతిరావ్‌ గోవిందరావు ఫూలే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన ఫూలే మహారాష్టక్రు చెందినవా డు. ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసంపోరాడా డు. మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్‌ 11న జోతిరావ్‌ ఫూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది.7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.

అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జోతిరావ్‌కు చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనేఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపెై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే .జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన మానవ హక్కులుపుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.

అమెరికా స్వాతంత్య్రపోరాటం ఆయనను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు.13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయినతర్వాత ఆయన తన కుటుంబవ్యాపారమైన పూలవ్యాపారం ప్రారంభించాడు.1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి మాలికులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపెై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మ ణులనువిమర్శించ డమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వ పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు.

బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.సమాజంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1948 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అస్పృస్యులకు కూడా బోధించవలసిరావడంతోఉపాధ్యాయులె వరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్‌, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు.క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు.

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్ర్తీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు.1873 సెప్టెంబర్‌ 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటిసంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు.

కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు.1891లో ప్రచురించిన సార్వజనిక్‌ ధర్మపుస్తక్‌ మత, సాంఘిక విషాయలపెై ఫూలే అభిప్రాయాలను తెలియచేస్తుంది. స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈతరహలో ఒక భారతీయ హిందువు ఒకసంస్థను ప్రారంభిం చడం అదే మొదటిసారి. 1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు. 1869లో పౌరోహిత్యం యొక్క బండారంపుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున దీనబంధువార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు.

దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపెై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883 కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సయంలో ప్రచురితమైన తన హెచ్చరిక (వార్నింగ్‌) బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు.1891లో ఫూలే రచించిన సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకంఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు.మద్యపానాన్ని వ్యతిరేకించి,1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు.

ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివర్లో దీనబంధువారపత్రికను ముంబయిలో స్థాపించాడు. దీనిలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. శెత్కర్యాచ అస్సోడ్‌ పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది.భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయంగా రూపొందించిన తొలి దార్శ నికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలరి, విశ్లేషణకి గులాంగిరిఅద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు.

దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాలవారి బానిసలుగా బతుకుతున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించు కొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం గులాంగిరి’. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు మహాత్మబిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు. (సూర్యలో 28-11-12)

సమన్యాయ సత్యశోధకుడు

భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు, అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.

బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు (బడి) మాన్పిస్తారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లింక్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభావంతుడవుతాడు.

తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన ఫూలేను బ్రాహ్మణులు, మాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతో పెళ్ళిలో సమానంగా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అలా అవమానించిన బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్ని బహిర్గతపర్చాలని కంకణం కట్టుకొని 1848లో ఫూణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేస్తారు. అయినా కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోతాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మిస్తారు ఫూలే.

ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో 'గులంగిరి' 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 'దీనబంధు' అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై భావజాల ప్రచారాన్ని మరింత ప్రచారం చేశారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో 'సార్వజనిక్ సభ', 1873 సెప్టెంబర్ 24'సత్యశోధక సమాజం సంస్థ'ను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలస వాదులకు '1882లో హంటర్ కమిషన్‌కు' శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారితో పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక కులం కోణంలో అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జున్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.

బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ) ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉంది.

Saturday, April 8, 2017

డిప్రెషన్‌కు గురైతే..

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గా జరుపుకుంటారు.

■ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఐక్య రాజ్య సమితి సహకారంతో నడిచే ఈ సంస్థ ముఖ్య కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. కాలానుగుణంగా వస్తున్న కొత్త  వ్యాధులకు మానవుడికి సరికొత్త వైద్య సదుపాయాలు అందజేయడం దీని లక్ష్యం. ఈ సంస్థ అధికారికంగా 26 దేశాల ఆమోదంతో, మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.

■ మొదటిసారిగా 1948 ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని WHO వారు నిర్వహించారు. అయితే 1950 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ రోజున వరల్డ్ హెల్త్ సమావేశాన్ని జరుపుతున్నారు. ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, రక్షిత మంచినీటి సరఫరా, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారి తీసే ప్రధాన అంశం మీద పరిశోధించి అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలలో నిర్ణీత ప్రాంతాలలో అవగాహన కల్పిస్తుంది..

■ ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి థీమ్ (నినాదం) ఏమనగా..
'డిప్రెషన్‌పై మౌనం వీడండి..మాట్లాడండి’

■ మనం అనుకున్నది నెరవేరకుంటే ఏదోలా ఉంటుంది. అది సహజం. అయితే దాని వల్ల జీవితం నిస్సారమైందని భావించకూడదం టున్నారు మానసిక వైద్య నిపుణులు. సరైన దృక్పథంతో ఆలోచించగలిగితే భవిష్యత్‌పై నమ్మకం పెరుగుతుందని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని అంటున్నారు. జీవితం ఆశాజనకంగా కన్పించాలంటే ముందుగా మౌనం వీడాలని.. హాయిగా మాట్లాడుకోవాలని చెబుతున్నారు.

■ డిప్రెషన్‌ అనేది సర్వసాధారణమైన మానసిక సమస్య. 14 రోజులకు మించి రోజూ దిగులుగా ఉండడం, రోజువారీ దైనందిన కార్యక్రమా లపై ఆసక్తి తగ్గిపోవడం, శారీరక జబ్బు లేకపోయినా చిన్నచిన్న పనులకు త్వరగా అలసిపోవ డం, నిద్రపట్టకపోవడం, ఆకలి మందగించడం, ధ్యాస లోపిం చడం, సెక్స్‌ పట్ల ఉత్సాహం తగ్గడం, చిన్న విషయాలను సైతం విసుగు, కోపగించుకోవ డం, జరిగిపోయిన ఘటనలకు సంబంధించి అతిగా పశ్చాత్తా పం చెందడం, తనకు తాను శిక్షించుకోవడం, ఆత్మహత్యకు ప్రయత్నించ డం... ఈ లక్షణాలు ఉంటే మనం డిప్రెషన్‌కు గురవుతున్నట్లే.

డిప్రెషన్‌కు గురైతే..


◆మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలవుతారు.
◆చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బులకు గురవుతారు.
◆మందులకు లొంగని తలనొప్పి, వెన్నునొప్పి, వ్యాధి నిరోధక శక్తి తగ్గి చర్మవ్యాధులు, ఇతర శారీరక జబ్బులు ఎక్కువ అవుతాయి.
◆వృత్తిపరంగా ధ్యాస లోపించి పని సామర్థ్యం తగ్గుతుంది. కుటుంబ కలహాలకు దారి తీస్తుంది.
◆కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో పాటు సమాజంలో ఉన్న వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.

డిప్రెషన్‌ ఎందుకొస్తుంది?..


■ కోరికలు నశించడం, పని చేసే సామర్థ్యం కొరవడడం, నెగిటివ్‌ ఆలోచనలు, జీవితంలో పొందలేకపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం, బాగా కావాల్సిన వారి ఆకస్మిక మరణం ఇతరత్రా కారణాల వల్ల డిప్రెషన్‌ ఏర్పడవచ్చు. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తికి తమ చుట్టూ ఉన్న వాతావరణం చాలా నిరాశాజనకంగా కనిపిస్తూ ఉంటుంది.

'మాటలే’ పరిష్కారం..

■ డిప్రెషన్‌ను నివారించే ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. కేవలం డాక్టర్లు ఇచ్చే మందుల వల్ల ఇది నయంకాదు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం, సైకాలజిస్ట్‌ కౌన్సెలింగ్‌ వల్ల డిప్రెషన్‌ను అదుపు చేయవచ్చు. మానసిక వైద్య శాస్త్రం అందుబాటులో లేని రోజుల్లో మానసిక జబ్బులకు కారణం ‘పాపం చేశారని, శాపం వంటిదని, తప్పులు చేసే వారికి సంక్రమిస్తాయని, చేతబడి, పీడ, దెయ్యం వంటికి పట్టాయన్న మూఢనమ్మకాలతో భూత వైద్యులు, మంత్ర వైద్యులకు చూయించుకునేవారు. ఈ క్రమంలో జబ్బు తీవ్రత పెంచుకుని ఏళ్ల తరబడి ఆలనాపాలనకు నోచుకోక గృహ నిర్బంధంలో మగ్గేవారు. కానీ ఇవన్నీ తప్పని, మానసిక సమస్యలకు మెదడులో కలిగే రసాయనాల ఒడిదుడుకులే కారణమని వైద్యశాస్త్రం నిరూపించింది. శారీరక జబ్బుల్లానే మానసిక జబ్బులు వస్తాయని తేల్చింది. మనసును బాగా చూసుకుంటే చాలా రకాల శారీరక జబ్బులను జయించవచ్చు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించి ‘మాట్లాడుకోవాలి’ అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలిలా...

★డిప్రెషన్‌కు లోనైన వ్యక్తిని ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు. ఆ వ్యక్తికి సన్నిహింతంగా ఉంటూ విషయం ఏమిటో కనుక్కోవాలి. ఎప్పటి నుంచి అలా విచారంగా అనిపిస్తుందో అడగాలి.
★వారి తలకు నూనె పట్టించి మసాజ్‌ చేయాలి
★గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలని చెప్పాలి
★‘ఇంత చిన్న విషయానికి బాధపడతావెందుకు’ వంటి మాటలు చెప్పి వారిలో మానసిక స్థైర్యం పెంపొందించాలి.
★చాలా సార్లు చెప్పినా భోజనం చేయకపోతే పక్కనే కూర్చుని మీ చేత్తో కలిపి తినిపించాలి.
★బయట అలా తిరిగొద్దామనో, సినిమాకు వెళ్దామనో చెప్పి వెంట తీసుకెళ్లాలి

■ డిప్రెషన్‌ అనేది పూర్తిగా నివారించదగిన సాధారణ మానసిక జబ్బు. మొదటి దశలోనే లక్షణాలను గుర్తించి ఆప్తులతో సమస్యను పంచుకోవాలి. లోలోపల కుమిలిపోకుండా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ తీసుకోవాలి
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

Sunday, April 2, 2017

SUNSTROKE - PRECAUTIONS వడదెబ్బ - నివారణా యోగాలు

SUNSTROKE - PRECAUTIONS

వడదెబ్బ  -  నివారణా యోగాలు

*ఉల్లిపాయరసం ని వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అవుతుంది.

 *వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపిలో గాని , రుమాలులో గాని నడినెత్తిన ఉండునట్లు కట్టి నడిచిన వడదెబ్బ తగలదు. జేబులో నైనా ఉంచుకోవచ్చు.

*నీరుల్లిపాయ రసం రెండు కనతలకు , గుండెకి పూసిన వడ దెబ్బవలన కలిగిన బాధ హరించును.

*వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరం పైన నీళ్లు చల్లుతూ , తలపైన మంచు గడ్డలను వుంచి త్రాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.

*కుమ్మున ఉడికించిన మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు త్రాగుచుండిన వదబెబ్బ తగలదు.

*విశ్రాంతిగా పడుకోపెట్టి కాఫీ తాగుటకు ఇచ్చిన వడదెబ్బ నుండి తట్టుకొందురు.

*నాలుగు తులాల చల్లటి నీటిలో ఒక తులం తేనెని వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారించును.

*వడగండ్లు పడినప్పుడు ఏరి విబూతిలో వేసి దాచి వడదెబ్బ తగిలినపుడు వారికి మూడువేల్లకు వచ్చినంత మంచినీటిలో వేసి ఇచ్చిన ఎండదెబ్బ నివారణ అగును.

*నువ్వులనూనేలో చనుబాలు రంగరించి చెవులలో వేసి కొంచం వెచ్చటి నీళ్లలో నెయ్యివేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును .

*తరవాణి తేటలో ఉప్పుని చేర్చి ఇవ్వవలెను.

*తాటి ముంజలు పంచదారతో ఇవ్వవలెను.

*నాలుకకు పాత ఉసిరి పచ్చడి రాసి , పుల్లని ఆవు మజ్జిగలో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసం ని త్రాగించ వలెను.

*చన్నీటితో స్నానం చేయవలెను .

*వేడివేడి పల్చని గంజిలొ ఉప్పు వేసి త్రాగవలెను.

*నిమ్మ ఉప్పుని నోటిలో వేసుకోనిన నాలుకకు ఉట ఊరి వడదెబ్బ నివృత్తి అగును.

తగు జగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి తప్పించుకోగలరు.

ప్రమాదవశాత్తు వడదెబ్బ తగిలితే పైన చెప్పిన నివారణా ఉపాయాలు ఉపయొగించుకొని బయటపడగలరు.

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

మీ ఆధార్‌ కార్డు ఎవ్వరు వాడకుండా తాళం....బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసుకోవచ్చు

మీ ఆధార్‌ కార్డు ఎవ్వరు వాడకుండా తాళం....బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసుకోవచ్చు


అవసరమైనప్పుడుఅన్‌లాకింగ్‌సదుపాయమూసమాచార భద్రత కోసం తప్పనిసరి కొత్తగా సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్‌లో ఖాతా తెరవాలన్నా.. అన్నింటికీ ఆధార్‌ కార్డే ఆధారం అయిపోయింది. కొన్ని రకాల డిజిటల్‌ చెల్లింపులకు కూడా ఆధార్‌ కార్డు ఉపయోగిస్తున్నాం. అలాంటప్పుడు పీఓఎస్‌ మిషన్ల వద్ద మన వేలి ముద్ర ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని సులభంగా హ్యాక్‌ చేసేందుకు వీలుంటుంది. అంతేకాదు, వేలిముద్రల వివరాల ను కూడా సులభంగా భద్రపరుచుకోవచ్చు. కానీ ఆధార్‌తోనే వెరిఫికేషన్‌ ఉంటుందని చెబుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి. అలా మన వివరాలు వాళ్లకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు.. సింపుల్‌గా యూఐడీఐఏ డేటాబే్‌స లో మన వివరాలకు తాళం వేసుకోవడమే. ఇలా ఆధార్‌ వివరాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్‌ చేసుకోడానికి, ఆ తర్వాత మనం కావాలనుకున్నప్పుడు అన్‌లాక్‌ చేయడానికి వీలుంది. ఇదంతా కూడా ఆన్‌లైన్‌లోనే చేసేసుకునే అవకాశాన్ని మనకు యూఐడీఏఐ కల్పిస్తోంది. ఎప్పుడైనా చెల్లింపులు చేయాలన్నా కూడా దా న్ని అన్‌లాక్‌ చేయనవసరం లేకుండా ఫోన్‌కు ఓటీపీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అది కూడా వద్దంటే మాత్రం ట్రాన్సాక్షన్‌ ఫెయిల్డ్‌ అనే సందేశం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల లాక్‌ చేసుకున్నప్పుడు మాత్రం ఆ విషయాన్ని తెలియజేసి, ఓటీపీ పంపమని అడగచ్చు. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే చెల్లింపులు పూర్తవుతాయి.
 లాక్‌ చేయడం ఎలా?

ఆధార్‌కార్డును లాక్‌ చేయడానికి ఈ దిగువ సూచనలు పాటిస్తే చాలు..
1. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి.


2. అందులో ఆధార్‌ సర్వీసెస్‌ అనే విభాగంలో.. ‘లాక్‌/అన్‌లాక్‌ బయోమెట్రిక్స్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.


3. తర్వాత వచ్చే విండోలో మీ 12 అంకెల ఆధార్‌ కార్డు నంబరు ఎంటర్‌ చేయాలి.


4. తర్వాతి బాక్స్‌లో సెక్యూరిటీ కోడ్‌ (కాప్చా) ఎంటర్‌ చేయాలి.


5. జనరేట్‌ ఓటీపీ బటన్‌పై క్లిక్‌ చేయాలి.


6. అప్పుడు.. ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉన్న మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ ఎస్సెమ్మెస్‌ వస్తుంది. ఆ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ను సంబంధిత బాక్స్‌లో ఎంటర్‌ చేసి వెరిఫై బటన్‌ క్లిక్‌ చేయాలి. తర్వాత వచ్చే విండోలో ‘ఎనేబుల్‌’ బటన్‌ క్లిక్‌ చేస్తే చాలు. మీ ఆధార్‌ సమాచారం లాక్‌ అయినట్టే.


7. అన్‌లాక్‌ చేయాలనుకుంటే.. మళ్లీ ఇదే పద్ధతిలోలో వెళ్లి డిజేబుల్‌ లేదా అన్‌లాక్‌ చేస్తే సరిపోతుంది.

షేర్‌ చేయొద్దు..

మీ ఆధార్‌ వివరాలు వేరెవరికీ షేర్‌ చేయవద్దని చెప్పే హక్కు కూడా మీకుంది. అయితే అందుకు ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సిందే. అక్కడ బయోమెట్రిక్‌ ఆధారంగా లాగిన్‌ అయి మీ వివరాలను ఇతరులతో షేర్‌ చేసుకోవడానికి గతంలో ఆమో దం తెలిపి ఉంటే.. ఆ బాక్స్‌ను అన్‌ టిక్‌ చేయించవచ్చు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends
.