Pages

Showing posts with label జీవితం. Show all posts
Showing posts with label జీవితం. Show all posts

Sunday, June 11, 2017

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ..

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ..


నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి
1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.
2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.
3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని.

ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో..

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.
నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞత కలిగ ఉండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది.  నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త,  గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!

2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది.
ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక విచిత్రమైన భావన. కాలాన్ని, మూడ్ ని బట్టి మారగలిగే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాధలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.
ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. అవి పెద్ద విషయాలే అయినా, మలుపులు జీవితంలో సహజమని గుర్తించు. ఇంకా పెద్ద సమస్యలు ఉంటాయని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో  ( Damn crazy movies! )

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో, ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే  నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!
... నాన్న

Wednesday, June 7, 2017

నివేదన

నివేదన

అంతరంగంలోకి తొంగిచూడడమే మార్గం!

మీరు ఇంతవరకు జీవితంలో పడిన శ్రమ అంతా ఒక్కదాని గురించే. మీరు మంచి ఉద్యోగం కోసం వెతికినా, వ్యాపారం ప్రారంభించినా, డబ్బు సంపాదించినా, పెళ్లి చేసుకున్నా, వీటన్నిటి వెనకా ఉన్న ఒకే ఒక్క కోరిక: ‘ఆనందం’. కానీ, ఈ ప్రయత్నంలో ఎక్కడో ఒకచోట జీవితం సంక్లిష్టమైపోయింది. ఈ భూమి మీద మీరు, మరే ఇతర ప్రాణిగా పుట్టినా, జీవితం ఎంతో సరళంగా ఉండేది. మీ అవసరాలన్నీ శారీరకమై ఉండేవి. కడుపు నిండితే ఆ రోజు గొప్పరోజు అని లెక్క. మీరు మీ పెంపుడు కుక్కనుగాని, పిల్లిని గాని గమనించండి. ఆ పూటకు వాటి కడుపు నిండితే చాలు, అవి ప్రశాంతంగా ఉంటాయి. కానీ, మీరు మనిషిగా ఈ భూమ్మీద పడిన తర్వాత, అన్ని విషయాలూ మారిపోతాయి. కడుపు ఖాళీగా ఉంటే ఒకే సమస్య: ఆకలి. కడుపు నిండితే? వంద సమస్యలు. మన మనుగడే ప్రశ్నార్థకమైనపుడు మన జీవితాల్లో అదే పెద్ద సమస్య. ఒకసారి ఆ అవసరం తీరితే, అది పెద్ద విషయమేమీ కానట్టనిపిస్తుంది. మనిషికి అతని మనుగడకు అవసరమైనవి సమకూరడంతో జీవితం ముగిసిపోదు, జీవితం అక్కడి నుండే మొదలవుతుంది. అసలు దానితోనే ప్రారంభమవుతుంది.

ఈ రోజుల్లో, అంటే మన తరంలో, మన ముందర తరాల వారికంటే, మన మనుగడకు అవసరమైనవన్నీ ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతున్నాయి. మీరిప్పుడు సూపర్‌ మార్కెట్‌కు వెళ్ళి ఒక సంవత్సరానికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కోగలరు. అది మీరు గడప దాటి బయటకి కాలు పెట్టకుండా కూడా చేసుకోగలరు. మానవ జీవిత చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా సాధ్యపడలేదు. ఒక వంద సంవత్సరాల క్రిందట రాజులకీ మహరాజులకీ కూడా దొరకని వస్తువులు ఇపుడు సామాన్యునికి అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రహం మీద జీవించిన మనుషులందరిలోకీ మన తరమే ఎంతో సుఖమైన జీవితం గడపగలుగుతున్నది. కానీ, మనం ఇప్పటివరకు జీవించిన వాళ్ళలో, ఎక్కువ ఆనందంగా ఉన్నవాళ్ళమూ, జీవితాన్ని ఎక్కువగా జీవించిన వాళ్ళమూ, ఎక్కువ ప్రశాంతతగలిగిన వాళ్ళము మాత్రం కాదు.

ఇలా ఎందుకు జరుగుతోంది? మన చుట్టూరా ఉన్న వాటిల్లో లోపాలనన్నిటినీ సరిదిద్దగలిగాం. ఇక ఏ మాత్రం చక్కదిద్దినా ఈ భూమి మిగలదు అన్నంతగా. కానీ వెయ్యి సంవత్సరాల క్రిందటి మన పూర్వీకులకన్నా మనం ఏమంత ఎక్కువ ఆనందంగా లేము. ఇవేవీ జరగటం లేదంటే, ఎక్కడ పొరపాటు ఉందో అని వెనుతిరిగి చూసుకోవలసిన సమయం కదా? మనం వేసుకున్న ప్రణాళికలు మనల్ని గమ్యానికి చేర్చకపోయినా, వాటినే అంటి పెట్టుకుని ఎన్నాళ్ళు వేళ్లాడతాం? ఇది మనలో సమూలమైన మార్పులను తీసుకురావలసిన సమయం.

-ప్రేమాశీస్సులతో, సద్గురుCourtesy: Andhrajyothi
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Wednesday, March 22, 2017

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. 1899 మార్చి 13న జన్మించిన ఇతను హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. పడకల్ లో మాతామహుల ఇంట జన్మించిన ఇతని స్వగ్రామం బూర్గుల. అసలు ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ స్వగ్రామాన్నే ఇంటిపేరుగా చేసుకొని ప్రసిద్ధి చెందారు. 1967 సెప్టెంబర్ 14న బూర్గుల మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం
బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చి 13న మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో జన్మించారు. ఇంటిపేరు పుల్లంరాజు. అయితే తన స్వగ్రామమైన బూర్గుల పేరుమీదుగా ప్రసిద్ధులై ఇదే ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. హైదరాబాదు లోని ధర్మవంత్ పాఠశాలలోను, నిజాం కాలేజీలోను ఆయన విద్యాభ్యాసం సాగింది. నిజాం కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో ప్రథముడిగా వచ్చి వాకర్ మెడల్ను గెలుచుకున్నారు. తరువాత పూనా (పుణె) ఫెర్గుసన్ కాలేజీలో బి.ఏ. చదివారు. అక్కడే మరాఠీ కూడా నేర్చుకున్నారు. తరువాత బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. చదివారు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు.

బూర్గుల రామకృష్ణారావు రాజకీయ జీవితం:-
న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసారు. కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసారు.హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అద్యక్షత వహించారు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించారు. 1948 లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటై వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడాయన షాద్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకోసం తన ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత బూర్గుల కేరళ రాష్ట్రానికి గవర్నరుగా పనిచేశారు. 1967 సెప్టెంబర్ 14న బూర్గుల మరణించారు.          

Wednesday, January 4, 2017

"శ్రీ భగవాన్ రమణ మహర్షి"

"శ్రీ భగవాన్ రమణ మహర్షి"


🌻🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి🌹🌻

🍀రమణ మహర్షి తత్వం :    అద్వైత వేదాంతము

🍀ఉల్లేఖన :    మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేను అనునది.

🍀శ్రీ రమణ మహర్షి (తమిళం : ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు.బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.

🍀రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.

🌷కుటుంబ నేపథ్యం🌷

🍀శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.

🌷బాల్యం🌷

🍀పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.

🌷బోధనలు🌷

🍀స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

🍀"The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
"In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."

🌷శ్రీ రమణ మహర్షి శిష్యులు    🌷

🍀కావ్యకంఠ గణపతిముని

🍀యోగి రామయ్య

🌷భగవాన్ గురించి చలం🌷   

🍀భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.

🍀చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, ఒక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! when you were in Thiruvannamalai go for a walk around the hill. The Arunachala hill will gives the power to all the hill itself called (Tejolingam). Shankara charya we sat in the hill and done the mediatation around the hill. if you can for a while into the hill you can catch the power.         

సబీర్ భాటియా (పంజాబీ: ਸਬੀਰ ਭਾਟਿਯਾ, హిందీ: सबीर भाटिया)

సబీర్ భాటియా (పంజాబీ: ਸਬੀਰ ਭਾਟਿਯਾ, హిందీ: सबीर भाटिया) (జననం డిసెంబర్ 30, 1968) ఒక భారతీయ అమెరికన్ . ఇతను హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు యొక్క సహ-వ్యవస్థాపకుడు. భాటియా ఆస్తుల విలువ 200 మిలియన్ల USD.


🌷జీవిత చరిత్ర🌷

🍀సబీర్ భాటియా భారతదేశంలోని చండీఘర్ లో ఒక హిందూ పంజాబీ కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి, బలదేవ్ భాటియా భారత సైన్యంలో అధికారిగా పనిచేసారు, తరువాత ఆయన భారత రక్షణ మంత్రిత్వశాఖలో చేరారు, అతని తల్లి దమన్ భాటియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక సీనియర్ అధికారిణి. భాటియా బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్స్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్య నభ్యసించాడు. 1986లో అతను పిలాని లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) లో తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను ప్రారంభించి BITS లో రెండు సంవత్సరములు గడిచిన తర్వాత కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్ టెక్) కు బదిలీ చేయబడ్డాడు. కాల్ టెక్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న తర్వాత సబీర్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో M.S. చేయటానికి 1989లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయమునకు వెళ్ళాడు. స్టాన్ఫోర్డ్ లో, అతను అల్ట్రాలో పవర్ VLSI డిజైన్ పై పనిచేసాడు.

🍀స్టాన్ఫోర్డ్ లో, అతను స్టీవ్ జాబ్స్ మరియు స్కాట్ మాక్ నీలీ వంటి వ్యవస్థాపకులను చూసి ప్రభావితుడయ్యాడు మరియు చిట్టచివరకు తను కూడా అలా అవాలని నిశ్చయించుకున్నాడు. మాస్టర్స్ తరువాత Ph.D. చేయటానికి బదులు, అతను ఆపిల్ లో చేరాలని నిర్ణయించుకున్నాడు.

🌷హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు🌷

🍀సబీర్ భాటియా ఫైర్ పవర్ సిస్టమ్స్ ఇన్కార్పోరేషన్ అనే కొత్తగా ప్రారంభించిన ఒక సంస్థలో చేరి అక్కడ రెండు సంవత్సరములు పనిచేసాడు. 1994లో, సబీర్ ఇంటర్నెట్ కు సంబంధించిన నూతన ఆలోచనల పై పని చేయటం ప్రారంభించాడు మరియు ఆపిల్ కంప్యూటర్, ఇన్కార్పోరేషన్ లో తన సహోద్యోగి అయిన జాక్ స్మిత్ తో జతకట్టాడు.

🍀ఆ ఇద్దరికీ జావా సాఫ్ట్ అనే పేరుతో ఒక వెబ్ - ఆధారిత డేటా బేస్ గురించిన ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను అమలులో పెడుతూ ఉండగా, తత్ఫలితంగా వారు వెబ్-ఆధారిత ఈ-మెయిల్ వ్యవస్థ యొక్క శక్తిని గ్రహించారు. ఆ విధంగా HoTMaiL (మొదటి బడి అక్షరములు HTML లోని వర్ణక్రమాన్ని సూచిస్తాయి— HTML అనేది వెబ్ పేజి యొక్క మూలాన్ని రాయటానికి ఉపయోగించే భాషను రూపొందించాలని నిర్ణయించారు. అందరి దృష్టిని ఆకర్షించటానికి, ఆ ఈ-మెయిల్ సర్వీసు ఉచితంగా అందజేయబడింది మరియు ఆ వెబ్ సైట్ లో ఉన్న ప్రకటనల ద్వారా దానికి రాబడి వచ్చింది. డ్రేపర్ ఫిషర్ వెంచర్స్ ఆ ప్రాజెక్ట్ లో $300,000 పెట్టుబడి పెట్టింది మరియు జూలై 4, 1996న ఆ సర్వీసు ప్రారంభమైంది.

🍀ఆరు నెలల లోపే, ఆ వెబ్ సైట్ ఒక మిలియన్ పైగా చందాదారులను ఆకర్షించింది. వెబ్-ఆధారిత ఈమెయిల్ సౌకర్యము పై ఆసక్తి పెరగటంతో, మైక్రోసాఫ్ట్ చిట్టచివరకు దానిని పరిగణలోకి తీసుకుంది. డిసెంబర్ 30, 1997 (భాటియా యొక్క 29వ పుట్టినరోజు) న $400 మిలియన్లకు హాట్ మెయిల్ మైక్రోసాఫ్ట్ సంస్థకు అమ్మబడింది. ప్రోత్సాహ పారిశ్రామికత్వానికి యునైటెడ్ స్టేట్స్ లో అనుకూలంగా ఉన్న పరిస్థితులకు అతను ఈ ఘనతను ఆపాదించాడు. ఒక ముఖాముఖీలో, అతను "తను భారతదేశంలో ఇప్పటికీ హాట్ మెయిల్ ను సృష్టించలేనని" పేర్కొంటూ భారత ప్రభుత్వాన్ని ఆక్షేపించాడు.

🌷ఇతర కార్యక్రమాలు🌷

🍀హాట్ మెయిల్ ను అమ్మివేసిన తర్వాత, భాటియా ఒక సంవత్సరం పాటు మైక్రోసాఫ్ట్ లో పనిచేసాడు మరియు ఏప్రిల్ 1999లో వేరొక వెబ్ సైట్, ఆర్జూ ఇంక్, ను ప్రారంభించటానికి సంస్థను విడిచిపెట్టాడు. డాట్-కామ్ పొంగు చల్లారినప్పుడు ఆ సంస్థ మూతపడింది. 2010లో, అతను ఆర్జూను ఒక రవాణా పోర్టల్ (ప్రవేశము) గా పునః ప్రారంభించాడు.

🍀అతను (సహ-వ్యవస్థాపకులు షిరాజ్ కంగా మరియు విరాఫ్ జాక్ లతో పాటు) బ్లాగ్ ఎవ్రీవేర్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించాడు. ఈ వెబ్ సైట్ వృద్ది చెందుతున్న బ్లాగోస్పియర్ నుండి లాభాలు ఆర్జించాలని ప్రయత్నిస్తోంది.

🍀2006లో, అతను ఒక నెట్వర్క్ సెక్యూరిటీ విక్రేత మరియు SSL VPN-ప్లస్ యొక్క సృష్టికర్త అయిన నియోయాక్సెల్ కు ప్రధాన ముదుపుదారుడు అయ్యాడు.

🍀నవంబర్ 2007లో, అతను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కు ప్రత్యామ్నాయంగా లైవ్ డాక్యుమెంట్స్ అనే ఆన్లైన్ ఆఫీస్ ను విడుదల చేసాడు. ఈ అప్లికేషను వాడుకదారులు వారి డాక్యుమెంట్లను ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ రెండిటిలోనూ ఉపయోగించుకోవటానికి, రియల్-టైం (ఒక పని జరగటానికి పట్టే వాస్తవ సమయం) లో ఆ డాక్యుమెంట్లను దిద్దుబాటు చేయటానికి, ఇతరులతో కలిసి పనిచేయటానికి, పంచుకోవటానికి మరియు డాక్యుమెంట్లను వివిధ కంప్యూటర్లు మరియు వాడుకదారుల మధ్య సంతులనం చేయటానికి వీలు కల్పిస్తుంది. వాడుకదారులు వారి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్లగ్-ఇన్ కు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫీసు డాక్యుమెంట్ నమూనాలు అన్నింటికి పూర్తి పొందికతో పాటు, ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ సమూహములలో ఉత్తమమైన దానిని పొందటానికి వీలు కల్పిస్తుంది.

🍀భారతదేశ గృహములలోని కేబుల్ టెలివిజన్ ద్వారా అంతర్జాలంలోకి ప్రవేశించే అవకాశం కూడా అతను ప్రయత్నించాడు.

🍀జనవరి 2008లో, సబీర్ తన సరికొత్త వ్యాపార సంస్థ SabSeBolo.com ప్రారంభాన్ని గురించి ప్రకటించాడు, ఇది ఒక ఉచిత వెబ్-ఆధారిత టెలీ కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ ("సబ్ సే బోలో" అనగా హిందీలో " ప్రతి ఒక్కరితో మాట్లాడదాం" అని అర్ధం). 14 జూన్ 2009న, సబీర్ భాటియా యొక్క సబ్సేబోలో, బయట పెట్టబడని మొత్తానికి ఇంటర్నెట్ టెలీఫోన్ సర్వీసు స్టార్ట్అప్ Jaxtr ను సొంతం చేసుకుంది. Jaxtr అదే వ్యాపార సంస్థ పేరుతో పనిచేస్తుంది మరియు తన అతిపెద్ద వాడుకదారుల జాబితాతో సబ్సేబోలోకి సహాయం చేస్తుంది.

🍀అతని భవిష్యత్తు ఆలోచనలలో భారతదేశంలో నానోసిటీ అనే పేరుతో ఒక కొత్త నగరాన్ని వృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. నానో సిటీ యొక్క లక్ష్యం సిలికాన్ వ్యాలీలో కనిపించే స్పందన మరియు నవకల్పనల ఆవరణ-వ్యవస్థను ప్రతిబింబించటం.

🌷వ్యక్తిగత జీవితం🌷

🍀అతను 2008లో బైద్యనాథ్ సంస్థ వారసురాలైన నాగపూరుకు చెందిన, తానియా శర్మను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒకరితో ఒకరికి ఎనిమిది సంవత్సరముల స్నేహం ఉంది. వారు మలేషియాలోని లాంగ్ కావిలో ఒక వ్యక్తిగత వేడుకలో వివాహం చేసుకున్నారు.

🌷పురస్కారాలు🌷

🍀వెంచర్ కాపిటల్ సంస్థ (సాహస మూలధన సంస్థ) డ్రేపర్ ఫిషర్ జుర్వెట్సన్ నుండి "ఆ సంవత్సరపు అవస్థాపకుడు," పురస్కారం అందుకున్నాడు (1998)

🍀నూతన ఆర్థిక వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టించిన ఉత్తమమైన పదిమంది వ్యక్తుల యొక్క అప్ సైడ్ పత్రిక జాబితా "ఎలైట్ 100, "లో చేరాడు

🍀రాబోయే కొద్ది సంవత్సరములలో సాంకేతికత పై గొప్ప ప్రభావం చూపుతారని భావిస్తున్న 100 మంది యువ ఆవిష్కర్తలకు MIT ఇచ్చే TR100 పురస్కార గ్రహీత

🍀శాన్ జోస్ మెర్క్యురీ న్యూస్ మరియు POV పత్రికలచే అత్యంత విజయవంతమైన పదిమందిలో ఒకడుగా ఎన్నికయ్యాడు (1998)

🍀TIME చేత అంతర్జాతీయ వ్యాపారములో "గమనించదగిన వ్యక్తు"లలో ఒకడుగా పేరుపొందాడు (2002)                       
[8:12 AM, 12/30/2016] +91 94415 65994: 🌻🌹డిసెంబర్ 30 "రుడ్యార్డ్ కిప్లింగ్" జయంతి సందర్భంగా..... 🌹🌻

🍀రుడ్యార్డ్ కిప్లింగ్ (డిసెంబర్ 30, 1865 – జనవరి 18, 1936) ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి. బొంబాయిలో జన్మించాడు. ఈయన రాసిన చాలా కథలను ఆంగ్ల చందమామ పుస్తకంలో ప్రచురితమైనాయి.

🍀 1894 లో ఆయన రాసిన ది జంగిల్ బుక్ అనే కథా సంకలనంతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యాడు. కథా సాహిత్యంలో ఆయన ఒక దార్శనికుడుగా కొనియాడబడ్దాడు. పిల్లల సాహిత్యంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది.

🍀సాహిత్యంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1907 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆంగ్ల రచయిత ఆయనే కావడం విశేషం. అంతే కాకుండా నోబెల్ బహుమతి నందుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు.                      

Thursday, December 29, 2016

జోహాన్స్ కెప్లర్ (Johannes Kepler),

"జోహాన్స్ కెప్లర్"(Johannes Kepler) 

(డిసెంబరు 27, 1571 – నవంబరు 15, 1630) ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. ఇతడు గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. 17వ శతాబ్దం జరిగిన ఖగోళశాస్త్ర ప్రభంజనంలో కీలక పాత్ర పోషించాడు. ఇతన్ని కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం ద్వారా అందరూ గుర్తిస్తారు. ఇతన్ని గ్రహాల పరిభ్రమణంతోపాటు, ఈయన ప్రతిపాదించిన వివిధ సిద్ధాంతాలు 17 శతాబ్దంలో విప్లవాన్ని సృష్టించాయనే చెప్పవచ్చు.

🌷కనుక్కోనదాన్ని గురించీ🌷🍀గ్రహాల పరిభ్రమణానికి సంబంధించి ఈయన మూడు సూత్రాలు ప్రతిపాదించాడు. టుబెజిన్ యూనివర్సిటీలో ఆయన తత్వశాస్త్రం, గణితం, అంతరిక్షశాస్త్రానికి చెందిన నైపుణ్యాలను బాగా వృద్ధి చేసుకున్నాడు. ఈయన అప్పటి కాలానికే చెందిన గెలిలియోకు సమకాలీనుడు. గ్రహాల కదలికలపై కెప్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు, తర్వాతి కాలంలో న్యూటన్ సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి ఎంతగానో ఉపయోగపడింది. . ఆస్ట్రియా గ్రాజ్‌లోని ప్రొటెస్టెంట్ పాఠశాలలో గణితం, ఖగోళశాస్త్రాల ఉపాధ్యాయుడిగా చేరారు. తర్వాత టుబిన్‌జెన్ విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేశారు. ఖగోళ, జ్యోతిష, గణిత, తత్వ శాస్త్రాలపై అధ్యయనం చేశారు. గ్రహాల కొత్త కక్ష్యల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త టైకో బ్రాహి కెప్లర్‌ని తన సహాయకుడిగా నియమించుకున్నాడు. టైకో బ్రాహి మరణాంతరం ఇంపీరియల్ గణిత శాస్త్రవేత్తగా కెప్లర్ పదవిని పొందారు. గణన చేయడానికి వర్గమానాలను ఏవిధంగా ఉపయోగించవచ్చో వివరించారు. గ్రహగతులకు సంబంధించి మూడు నియమాలు ప్రతిపాదించారు. కోపర్నికస్ తెలియజేసిన విషయాలను మెరుగుపరిచి వాటిని అభివృద్ధి చేశారు. కెప్లర్ గతి నియమాలు, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడ్డాయి.

🌷1630లో నవంబరు 15న తన 58వ ఏట జర్మనీలోని రెజెన్స్‌బెర్గ్‌లో మరణించారు.🌷

🍁స్మృతి చిహ్నాలు

🍀చెక్ రిపబ్లిక్ ప్రేగ్‌లో టైకోబ్రా, కెప్లర్ శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు.

🌸2002లో కెప్లర్ చిత్రం ఉన్న 10 యూరోల వెండి నాణెం విడుదల చేసారు.

🌸జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆయన చిత్రాన్ని కలిగి ఉన్న తపాలా బిళ్ల విడుదలజేసింది.🌸
🍁కెప్లర్ గౌరవార్థం, నామకరణాలు

🍀నాసా కెప్లర్ గౌరవార్థం 2009 మార్చి6న ఒక మిషన్‌ను ఏర్పాటు చేసింది
కెప్లర్ అంతరిక్ష వేధశాల, అమెరికా  



"లూయీ పాశ్చర్"

లూయీ పాశ్చర్

🍀 ఫ్రెంచి సూక్ష్మజీవశాస్త్రజ్ఞుడు మరియు రసాయనవేత్త.

🍀  జననం    డిసెంబరు 27, 1822
డోలె, ఫ్రాంచే కోమ్టే, ఫ్రాన్స్.

🍀  మరణం    1895 (వయసు 72)
మార్నెస్ లా కోకెట్, హాట్స్ దే సీన్, ఫ్రాన్స్.

🍀 లూయీ పాశ్చర్ (ఆంగ్లం Louis Pasteur) (డిసెంబరు 27, 1822 – సెప్టెంబరు 28, 1895) ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. *వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఈతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.

🍀 చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఈ పద్ధతిని నేడు పాశ్చరైజేషన్ అంటారు.

🍀 ఇతన్ని సూక్షజీవశాస్త్రం వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరుగా పేర్కొంటారు; మిగిలిన ఇద్దరు రాబర్ట్ కోచ్ మరియు ఫెర్డినాండ్ కాన్
ఈతని మరణం తరువాత పారిస్ లోని పాశ్చర్ సంస్థ భూగర్భంలో పాతిపెట్టారు. ఈ ఘనత దక్కిన 300 మంది ఫాన్స్ దేశస్తులలో ఇతడొకడు.

🍁జీవితచరిత్ర    🍁
  పాశ్చర్ 1822 @సంవత్సరం డిసెంబరు 27న ఫ్రాన్స్ లోని డోల్ గ్రామంలో @జన్మించాడు. నెపోలియన్ సైన్యంలో పనిచేసిన తండ్రి జీన్ పాశ్చర్ తోలు వ్యాపారం చేసి జీవించేవారు. పాశ్చర్ పాఠశాలకు వెళ్ళకుండా కొంతవరకు విద్యావంతుడయ్యాడు. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవాడు. తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారివి, స్నేహితులవి బొమ్మలు పెయింట్ చేశాడు. చాలా చిత్రాలు ఇప్పటికీ పాశ్చర్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాశ్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలనుకొనేవాడు. పదహారేళ్ల వయసులో కాలేజీ చదువు కోసం పారిస్ లో అడుగుపెట్టాడు. డాక్టరేట్ పూర్తిచేసి 1848లో స్ట్రాస్ బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. యూనివర్సిటీ వైస్      ఛాన్స్ లర్ కు వారి అమ్మాయి మేరీ లారెంట్ ను పెళ్ళిచేసుకుంటానని అనుమతికోసం లేఖ రాశాడు. 1849 మే 29న వీరిద్దరు పెళ్ళిచేసుకున్నారు. ఆదర్శదంపతుల్లాగా జీవించారు. వీరికి అయిదుగురు పిల్లలు పుట్టినా ముగ్గురు మరణించారు; టైఫాయిడ్ వల్ల ఇద్దరు, మశూచి వల్ల ఒకరు పిల్లల్ని పోగొట్టుకొన్నాడు.

🍁శాస్త్ర పరిశోధన🍁
 పాశ్చర్ అంగారక పదార్ధాలు ధ్రువిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసి "స్టీరియో కెమిస్ట్రీ" అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించారు. తరువాత తన పరిశోధనలను పులియడం (Fermentation) వంటి అంశాలపై కొనసాగించి సూక్ష్మక్రిములపై అనాదిగా ఉన్న భావాలను ఖండించి కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు. *ద్రాక్షసారా (Wine) వల్ల వచ్చే వ్యాధులు, నిల్వచేసే పద్ధతులు, వెనిగర్ తయారీ మొదలైన అనేక అంశాలపై కొత్త విషయాలు కనుగొన్నాడు.

🍀 కోళ్ళకు వచ్చే కలరా వంటి పారుడు వ్యాధిపై పరిశోధన జరిపి వ్యాధికారకాలైన సూక్ష్మజీవులను బలహీనపరచి ఇతర కోళ్ళకు ఎక్కించి వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి తర్వాత కాలంలో రోగం రాకుండా రక్షిస్తుందని నిర్ణయానికి వచ్చారు.

🍀 పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధికి మందు కనిపెట్టడం Louis పాశ్చర్ సాధించిన శాస్త్ర విజయాలలో ప్రధానాంశం. ఈ మందుతో చాలా మందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు.

🍀 1870 దశాబ్దంలో టీకా పద్ధతులను పశువులలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మీద ప్రయోగించాడు.

🍀 ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనిషులు గాని, జంతువులు గాని అంటు వ్యాధితో మరణిస్తే ఆ శవాన్ని దహనం చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు.

🌷పాశ్చర్ pasture సుక్ష్మజీవశాస్త్రంలో అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని 1895లో పొందారు.🌷

 పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు.

🌷సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం.🌷

🌷రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ 1895 సెప్టెంబరు 28న పరమపదించారు.🌷                       

Friday, December 2, 2016

జీవితంలో డబ్బే ముఖ్యము కాదు ( పాత రష్యన్ కథ )

 జీవితంలో డబ్బే ముఖ్యము కాదు ( పాత రష్యన్ కథ )



ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు..
ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది..
మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!!
అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! 

ఇంకో రాగి నాణెం వస్తుంది..

మళ్ళీ రుద్దుతాడు..

మరోటి వస్తుంది..

మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!!

అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. 

ఓ మనిషీ..!
ఇది మాయానాణెం..
దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ..

అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!!
అని చెప్తుంది..

అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు..
తనను తాను మర్చిపోతాడు.. కుటుంబాన్ని మర్చిపోతాడు..

పిల్లల్ని మర్చిపోతాడు..

ప్రపంచాన్ని మర్చిపోతాడు.

.అలా రుద్దుతునే వుంటాడు..

గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు..!!

ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది..
రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు..

అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు..

పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు..

కొత్త భవనాలు వెలసి వుంటాయి..

కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి..

స్నేహితులు..

చుట్టాలు..

పుస్తకాలు..

ప్రేమ,పెళ్ళి... 

జీవితం ప్రసాదించిన అన్ని సంతోషాలనూ అనుభవిస్తుంటారు..

ఆ మనిషికి ఏడుపు వస్తుంది.

ఇంతకాలం ఇవన్నీ వదిలెసి నేను చేసింది ఏమిటా అని కుప్పకూలుతాడు..!!

ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణెం పట్టుకొని వుంటున్నామా అనిపిస్తుంది...

సంపాదనలో పడి ..

కెరీర్ లో పడి..

కీర్తి కాంక్షలో పడి..

లక్ష్య చేధనలో పడి,

బంగారు నాణెం వంటి జీవితాన్ని..

మకిలి రాగినాణెం లా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది..!!

అమ్మ చేతి ముద్ద..

భార్య ప్రేమ..

పిల్లల అల్లారు ముద్దు..

స్నేహితుడి మందలింపు..

ఆత్మీయుడి ఆలింగనం..

ఈ బంగారు నాణేలు మన జేబులో తగినన్ని వుండాలి..

ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి.

Image cv raman

మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?

మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?

మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.
కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .

 అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.! వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని " అణుకువ " నటిస్తారు. అంతవరకే.!

3⃣పదవి , పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ  తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు  వాడుకుందామని. పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే ఒక్కడూ ఉండడు.
ఇది నిజం

 కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత గొప్పగా చెబుతారు.!
కాసేపు కబుర్లు " ఎంజాయ్ " చేస్తారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!మనిషి " విలువ " పొందాలంటే ఉండవలసినవి 1 కరుణ,2 దయ,3 ప్రేమ ,4 జాలి ,5 సేవాభావం ,6 సాయపడాలనే తపన ,7 మంచి మనసు ,8 తెగింపు ,9 విశాలహృదయం , ఉండాలి.!!! " విలువ " మనం పిలవకుండానే మన దగ్గరకు  వస్తుంది.!
 value

సింపుల్ మెసేజే కానీ ఇందులో జీవిత పరమార్థం దాగుంది మీరు ఓ సారి చదివి చూడండి

సింపుల్ మెసేజే కానీ ఇందులో జీవిత పరమార్థం దాగుంది మీరు ఓ సారి చదివి చూడండి. 

భార్యా , భర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు .. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆఫీస్ కు వెళ్లారు..అదే రోజు ఆఫీస్ లో ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ను ఏర్పాటు చేశారు ఆఫీస్ నిర్వాహకులు అందులో ఈ దంపతులు కూడా పాల్గొన్నారు ట్రైనర్ వచ్చాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ స్టార్ట్ చేశాడు… ప్రాక్టికల్ గా ఏదో చెప్పాలనుకున్నాడు భార్య భర్తల్లో ఒకరిని రమ్మనాడు.. భార్య వెళ్లింది ఆమె చేతికి చాక్ పీస్ ఇచ్చి మీకు బాగా ఇష్టం అయిన 30 పేర్లను బోర్డు మీద రాయమన్నాడు.. వెంటనే తనకు కావాల్సిన వాళ్లను, ఫ్రెండ్స్ ను గుర్తుకుతెచ్చుకొని టపా,టపా ఓ 30 పేర్లను బోర్డు మీద రాసేసింది.

గుడ్ ఇప్పుడు రాసిన వాటి నుండి ఓ 20 పేర్లను తొలగించండి అని అన్నాడు ట్రైనర్..అప్పుడు ఆమె ఆలోచించి తనకు అంతగా అవసరం లేరు అనుకున్న వారి పేర్లను తుడిచేసింది మళ్లీ ఓ ఆరు పేర్లను తుడిచేయండి అని అన్నాడు ట్రైనర్ ఆ సారి బాగా ఆలోచించి ఆరు పేర్లను తుడిచేసింది.

ఈ సారి మిగిలిన నాలుగు నేమ్స్ లో రెండిటిని తీసేయండి అన్నాడు.. చాలా బాధగా తన తల్లిదండ్రుల పేరును డిలేట్ చేసింది ఆ ఉద్యోగిని ఇప్పుడు మిగిలిన రెండు పేర్లలో ఒక పేరుని తీసేయండి అన్నాడు.. అప్పుడు ఆమె రెండు చేతుల్లో ముఖాన్ని అడ్డుపెట్టుకొని ఎడవసాగింది….

 హు..తీసేయండి …ఒక పేరును అన్నాడు ట్రైనర్….

 అలాగే ఎడుస్తుంది.. పాప పుట్టిన రోజు, ఆ పాపను అల్లారుముద్దుగా పెంచిన తీరు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి అయినా సరే.. అనుకొని తన 3 యేళ్ల పాప పేరును తుడిచేసింది.

బోర్డు మీద ఒకటే పేరు మిగిలింది… ఆ పేరు ఎవరిదో తెలుసా… కట్టుకున్న భర్తది అప్పుడు చెప్పాడు ట్రైనర్ భార్య భర్తల అనుబంధం, అనురాగం అంటే ఇలాగే ఉంటుంది కనిపెంచిన తల్లిదండ్రులను, కన్న పసిపాపను కాదని… భర్త పేరును అలాగే ఉంచింది ఎందుకంటే …. కడదాకా ఒకరికి ఒకరు తోడుగా ఉండేది వాళ్లిద్దరే అన్నాడు ట్రైనర్.

అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న హాల్ చప్పట్లతో మారుమోగింది.

Love your Wife
Love your Husband...

నచ్చితే మీ తోటి మిత్రులకీ షేర్ చేయడం మరువద్దు..
telugu
  

Sunday, November 6, 2016

ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!

ఈ మెసేజ్ Save చేసుకోండి.. దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!

దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.

🚿సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

🌐ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

🔑తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా  సమస్య కూడా  రాదు

🍥తూట కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు

🍥మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..

👍నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

💪నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని…

🎀స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.

👏చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.

💞కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

🍥ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.

⏰ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.
అదే తేడా…

✊గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.

🚶నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.

✊స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.



దీనమ్మా.... పురుష జీవితం
ఇవ్వాల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం...
ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా...😂
👦☆☆..మగవాడు..☆☆👦
భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం..

తన🍫చాక్లెట్స్ చెల్లికి👧ఇవ్వగలవాడు..

తన కలలను తల్లి👪తండ్రుల
😀చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు..

తన పాకెట్ మనీ💰గర్ల్ ఫ్రెండ్
🎁గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు..

తన యవ్వన కాల మంతా త్యాగం చేసి 👰భార్యా👫పిల్లలకోసం గొడ్డులా🌂
పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు..

వారి భవిష్యత్తు కోసం🏦బ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి🚶 కట్టేవాడు..

అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు, భార్య,  బాసు లతో తిట్లు😛తింటూ వాళ్ళ 😄ఆనందం కోసం జీవించేవాడు..

బయటకు వెడితే🏠ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు..

🏡ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు
👞కాలు పెట్టడు అంటారు..

పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు..

పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు..

అమ్మ మాట వింటే అమ్మ కూచి
అంటారు..

భార్య మాట వింటే బానిస బతుకు అంటారు..

ఆడపిల్లలూ ♡..మగవాడిని..♡
గౌరవించండి...🙏

వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి..👀

మగవాళ్ళూ..!
ఇది అందరికీ పంపించండి..!
మన మీద మనమే సానుభూతి  చూపక పోతే ఎలా..?

ఈ  సమయానికి  ఎవరో  మెసేజ్ చేస్తే కాని తెలియ లేదు
Happy Men's day

Monday, October 24, 2016

Motivate Ur Self.

motivate

Motivate Ur Self.


కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
 వ్యాపారం దెబ్బతినిందని,
 స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?

 దేహానికి తప్ప,
 దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
 అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
 ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
 అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

 మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు మాత్రమే,
 ఆచరిస్తే...
 అస్త్రాలు.

Wednesday, October 19, 2016

Devulapalli Krishna Sastry

Devulapalli Krishna Sastry

మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళిoచేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా.. పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా…
అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .
“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…
మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వార మైన మనకే ఎంతో అవమానం…ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..
అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..
“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం..”
అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…
కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…
“..ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…
సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..
చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమె తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..
మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…చిత్ర పరిస్రమకు సంబందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..
గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..
ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలోమారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..
“.. పొద్దున్నేఎవరో మహానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు..
ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు..
కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..
మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు..
“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తె ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా …”
తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్నఅక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..
అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..
ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…
మీరే చదవండి .తెలుస్తుంది .
శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది…అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…
మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చిఅలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…
ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…
అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది…ఆ తరువాత అందులోని విషయాన్నిసంగ్రహించి జీర్ణించు కోవటానికింకో అర నిమిషం పట్టింది…ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది…
“.. నాకుషస్సులు లేవు..ఉగాదులు లేవు.. ” అంటూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ  ఉగాదులూ  వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు…
ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..
“..పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి..
ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…
దుంఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…
“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”
తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపది మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..
ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని
“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు  అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…
అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాదించారు శాస్త్రిగారు…
“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”
వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…
“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..
“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”
దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు.. దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..
“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”
“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…
ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..
వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…
కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…
“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..ఇదీ దాని సారాంశం…
గుండె  పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..
“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “
“..సరే…అట్లాగే  రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…'” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..
వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…
అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…
వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…
“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”
అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..
“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”
“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…
ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….
ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా  వున్నారు…అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..
ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..
మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు
“…అయ్యా  మీరిక్కదేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది…ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా  ” అని…
దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు..
“.. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను.. కానీ  ఒక చిన్న విషయం…నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి…గమనించ గలరని మనవి “..
అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు…
ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..
ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..
ఆ పాటే…
అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”
ఉపసంహారం
ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…
“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం) “.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు) “..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం) “..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం) మొదలైనవి…ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు..
“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను  మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ…  రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..
ముక్తాయింపు
“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” --కృష్ణపక్షం    

Monday, September 12, 2016

భగవద్గీత అంటే ఏమిటి?



భగవద్గీత అంటే ఏమిటి?


జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
అది కేవలం హిందువులదా?
పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి

భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదుఅని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది మనం దాని జోలికి పోవద్దుఅనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.

సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలిఅనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే  వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.

సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.

ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.

ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన  ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. నేనుఅన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నానుఅనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు  అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. నాకోసం కాదుఅనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.

అసలు భగవద్గీత ఏం చెబుతుంది?
 -ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
 -కర్తవ్యం గురించి చెబుతుంది.
 -నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది.
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
-ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
-జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
 -ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
-ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
 -నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో
రాత మార్చుకో
.