Pages

Wednesday, November 22, 2017

సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు - *మిస్టరీ* !

సైంటిస్టులకు  కూడా కనిపించిన దేవుడు -  *మిస్టరీ* !


ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.అలాంటి మిస్టరీస్ ఇప్పటివరకూ వీడనే లేదు. మీలో అంతులేనిమన దేశంలో ఎన్నెన్నో మిస్టరీ దేవాలయాలు వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. ఆలోచనాతరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు, వాటి మిస్టరీలు మీ కోసం.


తెప్పేరుమనల్లూర్;-

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయపూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై వుండటం అతను ఆ తర్వాత ఆ పాము అక్కడ్నుంచి బిల్వాపత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకొని నోటిద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి పూజ చేసింది. ఆ పాము అలా ఎందుకు చేసింది? ఆ పాముని ఆ శివుడే పంపించివుంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం.కానీ ఈ మిస్టరీ మాత్రం ఇంతవరకూ వీడనేలేదు.


శని శింగనాపూర్

ఇది ఒక గ్రామం. మహారాష్ట్రలో వుంది. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు.ఒకవేళ దొంగ తనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు శనిరూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు.అంత పవర్ ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది.


గురుద్వార్

గురుద్వార్ పంజాబ్ లోని మొహాలీలో వుంది.ఈ గురుద్వార్ లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి వుంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు వుంది.సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి. కాని ఇక్కడున్న మామిడిచెట్టుకి కాలాలతో సంబంధం లేదు. సీజన్ లతో సంబంధం లేకుండా ప్రతీరోజూ కాస్తూనే వుంటాయి. ఆ మామిడిచెట్టుకి ఎందుకు అలా కాయలు కాస్తున్నాయనేది ఎవరికీ అర్ధం గాని ప్రశ్న.


యాగంటి

యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా వున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూవుంటారు.


యాగంటి

దీనికి సైంటిస్టులు చెప్పేమాటేమిటంటే ఆరాయి పెరిగే స్వభావగుణాన్ని కలిగివుందని అందుకే ప్రతి 20ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూవుంటుందని అంటూవుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు.యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు.


ఆంధ్ర ప్రదేశ్ లో వున్న మరో మిస్టరీ లేపాక్షి

లేపాక్షీ అనంతపురం జిల్లాలో వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు.


ఆంధ్ర ప్రదేశ్ లో వున్న మరో మిస్టరీ లేపాక్షి

అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం గ్రౌండ్ ని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు.


దార్వేష్ దర్గా, పూణే

ఇది పూణే లో వుంది.90కేజీల రాయి పూణేలోని చిన్న దర్గాలో ప్రత్యేకఆకర్షణ. ఇక్కడ కరెక్ట్ గా 11మంది కలిసి ఒక రాయిని కేవలం 1 వేలితో పైకి లేపాలి.రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమార్ అలీదర్వేష్ అని పలుకుతూ రాయిని పైకెత్తాలి.

దార్వేష్ దర్గా, పూణే

ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 10అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూనే వుంటుంది.ఇది ఎలా జరుగుతుందో కూడా ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్క లేదు.


మరో మిస్టరీ తంజావూరులో వుంది

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు.ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయంలోని నీడ. ఈ ఆలయం నీడలు ఎవరికి కనిపించవు.


మరో మిస్టరీ తంజావూరులో వుంది

సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమిమీద పడక పోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ కూడా ఎక్కడనుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. ఇలాగే మరొకటి కూడా వుంది.


పూరీజగన్నాథ్ ఆలయం

పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది.అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు.మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు.


షోలాపూర్

మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ వుపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది. షెత్పల్ అనే గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది.


షోలాపూర్

ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి.కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతుంది అంటేనే భయమేస్తుంది కదూ.


మరో మిస్టరీ కబీస్ బాబా ఆలయం

ఓ దేవుడు లేని ఆలయం.ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలోని కబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం.ఈ ఆలయంలో విగ్రహం వుండదు.పూజారి కూడా వుండడు. ఈ ఆలయం 150ఏళ్ల క్రితం నిర్మించారని అక్కడివారు చెపుతున్నారు.


మరో మిస్టరీ కబీస్ బాబా ఆలయం

అయితే అక్కడ ఓ శివభక్తుడు కబీస్ బాబా వుంటారు. ఆయన సాయంత్రం వేళ భక్తులు సమర్పించే మద్యంసేవించి భక్తుల అనారోగ్య సమస్యలను నయంచేస్తాడని ఇక్కడి వారు నమ్ముతూవుంటారు.


అమ్రోహా

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు. అవును.ఇక్కడ ఆలయంలోపల ఆలయం చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో.అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటి మరో ఆలయం ఆంధ్రప్రదేశ్ లో కూడా వుంది.


మిస్టరీమమ్మీ

మరో విచిత్రం అతి భయంకరం కూడా మన ఇండియాలో మిస్టరీగానే మిగిలిపోయింది. అదే ఓ మిస్టరీమమ్మీ. మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్.కాని హిమాచలప్రదేశ్ లో గ్యూఅనే గ్రామంలో 500ఏళ్ల ఒక మమ్మీ అందరికి షాక్ ఇస్తోంది. సంగాతెన్జింగ్ అనే టిబెట్ కు చెందిన ఒక బౌద్ధసన్యాసి మమ్మీ అక్కడ కూర్చొనివుంది.


మిస్టరీమమ్మీ

ఆ మమ్మీ 500ఏళ్ల నాటిది.అయితే అది చెక్కుచెదరని చర్మం,జుట్టుతో అలాగే వుంది.అయితే ఇదేమి విచిత్రం అనేది ఎవరికీతెలీదు. తెలుసుకున్నారుగా మన ఇండియాలో దాగున్న మిస్టరీలు.   శుభోదయం ...
   

Saturday, November 11, 2017

Scholarships for High School Students

Scholarships for High School Students     Scholarships for High School Students


Sunday, October 15, 2017

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా..

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా..
తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్తు.. కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం.. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి, ఆర్థికంగా బలవంతులకు, సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం… అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి, తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…? వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..? ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు…. కాకపోతే కాస్త ముందే సంప్రదించండి… రిజర్వ్ చేసుకొండి… ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి… ఇవిగో నంబర్లు, పేర్లు….*

మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
1. ఎప్పుడైనా ఛార్జింగ్ 96% కంటే ఎక్కువ అవ్వనివ్వద్దు. 20% కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి.

2. మీ మొబైల్ పౌచ్ ఉంటే దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టండి.

3. మొబైల్ ఛార్జింగ్ పెట్టె టప్పుడు  హీట్ గా ఉంటే 5 లేదా 10 నిమిషాలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టండి.

4. మొబైల్ ఛార్జింగ్ లో వున్నప్పుడు  wi.fi, hot spot, songs, net,calls, games use చేయకండి.

5. మొబైల్ కి వచ్చిన చార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ చార్జర్ ని కొనుక్కొని వాడండి, 100 Rs cheap చార్జర్ అస్సలు వాడకూడదు.

6. మీకు అవసరం లేని applications వెంటనే తీసేయ్యండి, కొన్ని games, applications వళ్ళు మీ మొబైల్ విపరీతంగా హీట్ అవుతుంది వాటిని uninstall చెయ్యండి.

7. మొబైల్ ఛార్జింగ్ ఐయినా వెంటనే వీడియో కాల్ , హెవీ గేమ్స్ అస్సలు ఆడకూడదు, ఛార్జింగ్ ఐనా తర్వాత మొబైల్ హీట్ ఉంటే 5 min. వరకు మొబైల్ ని పట్టుకోకుండా, ఫాంట్ జాబులో పెట్టుకోకుండా ఉంటే మంచిది.

8. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లేదా airoplane mode on చేసి ఛార్జింగ్ పెట్టడానికె ఎక్కువ  ప్రయత్నించండి. ఇలా చెయ్యడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది మీరు safe.

9.మొబైల్ హీట్ గా వున్నప్పుడు తడి చేతులతో అస్సలు పట్టుకోకూడదు.

10. మొబైల్ ఛార్జింగ్ లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్ లో మొబైల్ ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఎక్కువ. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అవుతే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి చల్లబడ్డాక on చెయ్యండి.

11. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఐయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరీ తీసుకోని మార్చండి.

12.కొంతమంది ఛార్జింగ్ పెట్టి ear phones lo సాంగ్స్ వింటూంటారు అలా చేయ్యడం  చాలా risk,  ఇప్పుడికె ముగ్గురు చనిపోయారు.

ఒకటే గుర్తుపెట్టుకొండి redmi ఒక్కటే కాదు phone 6 , samsung edge, oppo, vivo, lenovo, cool pad mobiles కూడా కొన్ని పేలాయి ఇండియాలో redmi మొబైల్స్ sales ఎక్కువ కాబట్టి ఎక్కువ అవే పేలుతున్నాయి అనిపించడం సహజం

మనం మొబైల్  వాడే దాని బట్టే మన ప్రాణాలు ఆధార పడి ఉన్నాయి. Mobile company బట్టి కాదు,  మొబైల్ లో చెత్త applications , heavy గేమ్స్ ని వాడకూడదు.

FRIENDS SHARE THIS MESSAGE TO ALL..


Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

ఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

1. ఆకలి నిన్ను చంపుతున్నపుడు
2. నిద్ర మత్తులో ఉన్నపుడు
3. మద్యం సేవించినపుడు

ఈ మూడు సమయాల్లో ఎవరికీ వాగ్దానం చేయకూడదు.
1.బాగా సంతోషంగా ఉన్నపుడు
2.బాగా దుఃఖంలో ఉన్నపుడు
3.బాగా కోపంలో ఉన్నపుడు

అలాగే ఈ ముగ్గురుని ఎప్పటికీ మరవకూడదు.
1.ఆపదలో మనల్ని ఆదుకున్న వారిని
2మనలో లోపాల్ని బూతద్దంలో చూడని వారిని
3.మన మంచిని సదా కోరే వారిని

ఈ ముగ్గురుని దరికి రానివ్వకండి..!!
1.మనకు విలువ నివ్వని వారిని
2.మనల్ని చూసి ఈర్ష పడేవారిని
3.మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారికి.
- మంచిమాట



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

నైవేద్యము అంటే..?

నైవేద్యము అంటే..?

ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో నమో గురుభ్య:

నైవేద్యము అంటే ఏమిటి?

నివేదింప తగిన, సమర్పింప తగిన వస్తువు, పదార్ధము. భగవంతునికి నివేదించే పదార్ధము.

అది వస్తువే వుండ వలసిన అవసరము లేదు. మన మనస్సును కూడా నివేదించ వచ్చు.

మనము తినే ఆహారమును భగవంతునికి పెడితే, ఆ పెట్టె విధానమును నైవేద్యము అని అంటారు, ఆయన తినిన తరువాత ఆయన ఉచ్చిష్టము మనకు ప్రసాదము అవుతుంది. అదే మనము ముందు తిని ఆయనకు పెడితే ఎంగిలి అవుతుంది. అలా చేయ కూడదు . భగవంతునికి నివేదించిన పదార్ధము మనకు ప్రసాదము అవుతుంది. ఆ ప్రసాదము మనము భక్తితో తిన వలెను.

మనము తినే ఆహారమును శుచిగా, మడిగా వండి భగవంతునికి నివేదన చేయ వలెను. ఒక్కో దేవతకు ఒక్కో వస్తువు ప్రీతి. విశేష దినములలో ఆ రకముగా పిండి వంటలు చేసి భగవంతునికి ఆరాధన చేయ వలెను.

భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహేశ్వరీ .....
అని నివేదన చేయ వలెను.

మరి ఈ నివేదన ఎలా చేయాలి?

వండిన పదార్ధములను అన్నీ ఒక పళ్ళెములో (అది మనము తినే పళ్ళెము వుండ కూడదు) లేదా ఒక విస్తరాకులో అన్నీ వడ్డించి తీసుకొని రావలయును. దాని మీద ఆవు నెయ్యిని అభికరించ వలెను. ఆవు నేతితో అది అమృతము అవుతుంది. గో సంబంధమైన పదార్దములు అమృతములు. అమృతమైన పదార్దములనే భగవంతునికి నివేదన చేయ వలెను. ఇతర పదార్ధములను పెట్టకూడదు.

యజమాని కుడి చేతి వైపు నీళ్ళు చల్లి , మత్స్య ముద్ర తో, చంధనముతో, చతురస్రము, దానిలో వృత్తము లిఖించ వలెను. దాని పైన మహా నివేదన పాత్ర వుంచవలెను. గాలినీ ముద్రతో విషమును వడ కట్టి, గరుడ ముద్రతో ఆ విషమును హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించి, గాయత్రీ మంత్రముతో ప్రోక్షణ గావించి పంచ ప్రాణములకు, పంచ ఆహుతులు సమర్పించ వలెను స్వాహా కారముతో.
ముద్రలు తెలియని వారు గాయత్రీ మంత్రముతో సంప్రోక్షణ గావించి నివేదన చేయ వచ్చు.

నివేదన అయిన తరువాత ఆ పాత్రలు తీసి, ఆ తీసిన చోట మరలా నీళ్ళు చల్ల వలెను. ఆ పైన తాంబూలాది సర్వోపచారములు చేసి భగవంతునికి నీరాజనము, మంత్ర పుష్పము చేయ వలెను.

తరువాత అపరాధాస్తవము చదువ వలెను.

ఓం...నమో... వేంకటేశాయ


Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Friday, September 29, 2017

పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు

పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు

  • అనసూయ - అసూయ లేనిది
  • అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు
  • అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.
  • ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.
  • ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)
  • ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.
  • కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.
  • కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.
  • కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).
  • కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).
  • గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.
  • గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు
  • ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)
  • జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.
  • తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు
  • దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.
  • ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
  • త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు
  • శంకువులు(పాపాలు) చేసినవాడు.
  • దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).
  • దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)
  • దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.
  • దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
  • ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.
  • ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
  • ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.
  • నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.
  • ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)
  • ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.
  • ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు
  • బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.
  • బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి)
  • భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
  • భీముడు - భయమును కలిగించువాడు
  • భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన
  • (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.
  • మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)
  • మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.
  • మహిషాసురుడు 1. రంభుడు మహిషంతో (గేదే) రమించగా పుట్టినవాడు
  • 2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.
  • యముడు - యమము (లయ)నుపొందించువాడు.
  • యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.
  • రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)
  • యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.
  • రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు
  • రుక్మిణి - రుక్మము(బంగారము) కలది
  • వాల్మీకి -ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు.
  • వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.
  • విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు
  • విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు
  • శంతనుడు - శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు
  • ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము)
  • శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.
  • శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)
  • సగరుడు - విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)
  • సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)
  • సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శిశువు కనుక సీత అయినది.

Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

బతుకమ్మ నానీలు

బతుకమ్మ నానీలు


స్వరాష్ట్ర సాధనలో
కీలకభూమిక
బతుకమ్మ
వేడుక

ఆత్మగౌరవ నినాదం
బతుకమ్మ
స్వాభిమానానికి
ప్రతీక

అస్తిత్వపు గొంతుక
బతుకమ్మ
తెలంగాణ
ఉద్యమం స్ఫూర్తి

బతుకమ్మ
తెలంగాణ తల్లి
రాష్ట్ర సిగలో
పూసిన మరుమల్లి

పూలను పూజించటం
తెలంగాణ సంస్కృతి
బతుకమ్మ
పూబంతుల గుమ్మ

నేల సింగిడి
బతుకమ్మ
ఊరుఊరంతా
సంబురాల వైభవం

బతుకమ్మ
పువ్వుల తల్లి
ఆడపడుచుల
పులకరింత

వసంతంలా
బతుకమ్మ పండుగ
జీవితం
విరిసే హరివిల్లు

బతుకునివ్వడమే
బతుకమ్మ సందేశం
కలిసి బతకడం
అంతరార్థం

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో
బతుకమ్మ
తెలంగాణ
విశ్వవ్యాప్తం

-----భీంపల్లి శ్రీకాంత్

బాపూజీ నానీలు*

కొండా లక్ష్మణ్ బాపూజీ
మహోన్నత వ్యక్తి
బడుగువర్గాల
ఆశాజ్యోతి

తెలంగాణ కోసం
రాజీనామా అస్త్రం
అసలైన తెలంగాణవాది
బాపూజీ

ఆయన జీవితం
అందరికీ ఆదర్శం
తెలంగాణకు
స్ఫూర్తిదాయకం

తెలంగాణ కోసం
జీవితం త్యాగం
మరవదు
తెలంగాణ లోకం

బాపూజీ లక్ష్యం
తెలంగాణ సాధన
జీవితాంతం
అదే తపన

బాపూజీ జీవితం
నిత్యపోరాటం
ఆయన ఆరాటం
తెలంగాణ రాష్ట్రం

బడుగుల బాంధవుడు
బాపూజీ
నిస్వార్ధం
ఆయన జీవితం

నిబద్ధతకు
నిదర్శనం బాపూజీ
నీతి నిజాయితే
ఆభరణం

రాజకీయాల్లో
ప్రత్యేక ముద్ర
బాపూజీ జీవితం
విలక్షణం

మంత్రి పదవికి
రాజీనామా
తెలంగాణ కోసం
ఉద్యమ దీక్ష-------భీంపల్లి శ్రీకాంత్





బతుకమ్మ

ఉద్యమానికి ఊపిచ్చావు                               మాకు బతుకిచ్చావు
సకలజనులను నడిపించావు
స్వరాష్ట్రన్నీఅoదిచ్చావు
మనందరి తల్లి బతుకమ్మ
అమే తెలంగాణ అమ్మ !!!!
 
సబ్బండ వర్గాలకు
పోరాటం నెర్పిన అమ్మ
వలస వాదులను,ఉద్యమ ద్రోహులను
పొలిమేర దాకా తరిమిన అమ్మ
స్వరాష్ట్ర సాధనలో నీ పాత్ర
అనన్య, అసమనమైంది!!!!!!
 
బతుకమ్మ
మన చైతన్య కెరటం
బతుకమ్మ
మన సాంస్కృతిక పతకం
బతుకమ్మ
తీరొక్క పూల తీరైన రూపం
బతుకమ్మ
ఏడాది బతుకు పాట!!!!!
 
పూలను పూజించే సాంస్కృతి తెలంగాణదే
ఊరు వాడను ఏకం చేసే శక్తి నీదే
బతుకమ్మమంటే
ఉయ్యాల పాటలు,చప్పట్లమోతలు
ఇంద్రధనస్సును తలపించే పుష్పాలు
ఆడబిడ్డల సంబురాలు, కోలాటాలు
 చిన్నారుల కేరింతలు!!!!!!!
              
నాటి బతుకమ్మకు
అడుగడుగునా అవరోధాలు
నేటి బతుకమ్మ
విశ్వవ్యాప్తమైన రాష్ట్ర ప్రభుత్వ అధికారపండుగ!!!!!
 
         డాక్టర్ గుంటి గోపి


Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Thursday, September 21, 2017

పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ!


పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ!

 ఈపుస్తకాలతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు* ఒకటో తరగతి నుంచి పరిశోధనల వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు..* 70కి పైగా భాషలు.. అన్నీ ఆన్‌లైన్‌లో..* ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకలేదన్న బెంగ అక్కర్లేదు.* కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే..దాన్ని ఇంకొకరికి ఇచ్చేశారు.. చదువుకోవడం ఎలా.. అనే ఆందోళన కాలేజీ విద్యార్థులకు అసలే అవసరం లేదు..* *యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్,రాష్ట్ర సర్వీసు కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచన వద్దు..* ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పరిశోధనలకు అవసరమైన రిఫరెన్స్‌ పుస్తకాల దాకా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.. ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. వీడియోలు చూడవచ్చు.. ఆడియో వినవచ్చు.. పీడీఎఫ్‌ కాపీలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్‌ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. సుమారు కోటికిపైగా పుస్తకాలు, ఆర్టికల్స్, రచనలు, వ్యాసాలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆన్‌లైన్‌లో (https://ndl.iitkgp.ac.in/) అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సహకారంతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని రూపొందించింది.* ఒక్క క్లిక్‌.. సమస్తం కళ్లముందు!* డిజిటల్‌ పుస్తకాలు, ఆర్టికల్స్, ఇతర అనేక రూపాల్లో ప్రతి ఒక్కరికీ చదువు, సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థి వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు అన్ని సబ్జెక్టులు, అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను ఒకే దగ్గరకు చేర్చింది. పైసా చెల్లించనవసరం లేకుండా విద్యార్థులు ఉచి తంగా తీసుకోవచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు.* ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి ఈ డిజిటల్‌ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటిని కంప్యూటరీకరించి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మెుబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు.* రిజిస్ట్రేషన్‌ సులభం* డిజిటల్‌ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈమెయిల్‌ ఐడీ, చదువుతున్న లేదా చదివిన కోర్సు, వర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత ఈమెయిల్‌ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్‌ కావచ్చు.* *డిజిటల్‌ లైబ్రరీ ప్రత్యేకతలెన్నో..🔰* *⇒ 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌* *⇒ లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు* *⇒ రాత ప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు* *⇒ 18 వేలకు పైగా ఉపన్యాసాలు* *⇒ 33 వేలకు పైగా గత ప్రశ్నపత్రాలు* *⇒ వర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, జవాబులు* *⇒ వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్‌ కోర్సులు* *⇒ వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు* *⇒ సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు* *💻అందుబాటులో ఉన్న ఈపుస్తకాలు* *5,36,487 కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్, ప్రోగ్రామింగ్‌* *1,52,340 ఫిలాసఫీ, సైకాలజీ: తత్వశాస్త్రం, మానసిక తత్వశాస్త్రం, అస్తిత్వ, విశ్వ ఆవిర్భావం, లాజిక్, ఎథిక్స్‌* *1,67,671 మతంతత్వం, మత సిద్ధాంతం, దైవ భావన, సైన్స్‌ అండ్‌ రిలీజియన్‌ఆర్ట్స్‌* *1,45,290లిటరేచర్‌* *4,40,607 హిస్టరీ జియోగ్రఫీ3,65,5358,70,802 సోషల్‌ సైన్సెస్‌:* సోషియాలజీ,ఆంత్రొపాలజీ, సామాజిక మార్పు,రాజకీయ, అర్థ, న్యాయశాస్త్రాలు,పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మిలటరీ సైన్స్‌ 56,17,754 టెక్నాలజీ: వ్యవసాయ టెక్నాలజీ, కెమికల్, సివిల్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక కోర్సుల పుస్తకాలు 2,65,577 నేచురల్‌ సైన్సెస్‌:వైద్యం, ఆరోగ్యం, ఫిజియాలజీ,ఫార్మకాలజీ, థెరపీ, సర్జరీకి సంబంధించిన వైద్య పుస్తకాలు భాషలు *తెలుగు,*హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం, తమిళ్, గుజరాతీ తదితరాలు, విదేశీ భాషలు ఫార్మాట్లు పీడీఎఫ్, హెచ్‌టీఎల్‌/హెచ్‌టీఎంఎల్, ఎంపీ3/4/ఎంపీఈజీ4, ఎఫ్‌ఎల్‌వీ, డాక్యుమెంట్‌ 70కి పైగా భాషల్లో..కోటికి పైగా ఈపుస్తకాలు Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు

ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే 'హైపర్‌టెన్షన్‌' కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది. అందుకే, లక్షణాలు బయపడేదాకా ఎదురు చూడకుండా, తరచుగా బీపీ పరీక్ష చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

కుళాయిలో నీరు తగినంత ఫోర్స్‌తో వస్తేనే ధార చక్కగా పడుతుంది. నీటి వేగం ఎక్కువైనా, తక్కువైనా ధారలో తేడా వచ్చినట్టే, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో హెచ్చుతగ్గులైనా రక్తపోటులో తేడా వస్తుంది. ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తంలో కొంత ప్రెషర్‌ ఉంటుంది. ఆ ప్రెషర్‌ వల్లే గుండె నుంచి రక్తం శరీరంలోని ప్రతి ఒక్క రక్తనాళంకీ సక్రమంగా చేరుతుంది.

ఆ ప్రెషర్‌ అవసరానికి మించి ఎక్కువ ఉంటే ఆ పరిస్థితినే 'హైపర్‌టెన్షన్‌' అంటారు. 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లకు బ్లడ్‌ ప్రెషర్‌ 140/90 వరకూ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పసికందులు, స్కూలుకి వెళ్లే వయసు పిల్లలకు బీపీ ఇంకా తక్కువగా ఉంటుంది. అది సాధారణమే! ఇక 50 ఏళ్లు దాటిన వారికి వయసుతోపాటు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది.

రక్తపోటు పెరిగిపోతే ఆ ప్రభావం ప్రధానంగా గుండె మీద పడుతుంది. వేగంగా గుండెకు రక్తం చేరుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె కండరాలు, కవాటాల్లో సమస్యలు మొదలవుతాయి. రక్తాన్ని వడగట్టే మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? అనే విషయాల్లోకి లోతుగా వెళ్తే కచ్చితమైన సమాధానం దొరకకపోవచ్చు. హైపర్‌టెన్షన్‌కు ఎన్నో కారణాలుంటాయి. వయసుతో పని లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా హైపర్‌టెన్షన్‌ రావొచ్చు.

అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవేంటంటే.*...

అధిక బరువు:*అధిక బరువు వల్ల శరీరం లావవుతుంది. దాంతో చర్మం ఉపరితలం వరకూ రక్తసరఫరా జరపటం కోసం రక్తనాళాలు చెట్టు కొమ్మల్లా పెరుగుతూ పోతాయి. వాటి చివర్ల వరకూ రక్తం సరఫరా కావాలంటే రక్తం ఫోర్స్‌ పెరగాలి. ఇందుకోసం గుండె మరింత బలంగా రక్తాన్ని సరఫరా చేయాలి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రక్తంలో ప్రెషర్‌ పెరిగిపోయి హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది.

ఒత్తిడి:* మానసికం, శారీరకం...ఒత్తిడి ఎలాంటిదైనా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఒత్తిడితో కూడిన జీవనవిధానాన్ని అవలంబించేవాళ్లు హైపర్‌టెన్షన్‌కి తేలికగా గురవుతారు.

అస్తవ్యస్త జీవనశైలి:* సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకపోవటం, రోజుల తరబడి నిద్రకు దూరం కావటం, భోజనానికి నియమిత వేళలు పాటించకపోవటం...ఇలాంటి అస్తవ్యస్త జీవనశైలిని అనుసరించినా అధిక రక్తపోటు ఖాయమే!

అధిక ఉప్పు:*ఉప్పు (సోడియం క్లోరైడ్‌)లో ఉండే 'సోడియం' వల్లే ముప్పంతా! కాబట్టి సోడియం ఉండే పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది.

దురలవాట్లు:* హైపర్‌టెన్షన్‌కు మద్యపానం, ధూమపానం కూడా కారణమే! ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో గుండె రక్తాన్ని బలంగా పంప్‌ చేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హైపర్‌టెన్షన్‌ మొదలవుతుంది. మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. మద్యపానం వల్ల రక్తపోటు పెరుగుతుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. మద్యపానం ప్రస్తుతం ఓ ఫ్యాషన్‌ కావటంతో వారాంతాల్లో మద్యం సేవించటం పరిపాటిగా మారింది. వీకెండ్స్‌లో మద్యం సేవించి సోమవారంనాడు హై బీపీతో వైద్యుల్ని కలిసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.

ఆధునిక జీవనశైలి:* గ్రామీణ జీవనశైలిని గడిపే వాళ్లలో రక్తపోటు సమంగా ఉండటం, పట్ణణీకరణ పెరిగిన తర్వాత బీపీ పెరగటం వైద్యపరమైన పరిశీలనల్లో కనిపించింది. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు గ్రామీణుల్లో కూడా అధిక రక్తపోటు సర్వసాధారణమైపోయింది. ఇందుకు కారణం గ్రామాల్లో పట్టణ వాతావరణం ఉండటమే!

మధుమేహం:* మధుమేహం ఉన్నా ఆ ప్రభావం బ్లడ్‌ ప్రెషర్‌ మీద పడుతుంది. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది.

లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు!

రక్తపోటు ఉన్న వాళ్లలో చాలామందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు ్ల ఈ విషయం బయటపడితే తప్ప తమంతట తాముగా రక్తపోటు ఉన్న విషయాన్ని ఎక్కువశాతం మంది గ్రహించలేరు. అయితే ఇదే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

అవేంటంటే...

గుండె దడ,తలనొప్పి,          చమటలు పట్టడం,కళ్లు తిరగటం,ఆయాసం

చికిత్స తేలికే!*

రక్తపోటును మందులతో నియంత్రించవచ్చు. అయితే మందులు సక్రమంగా వాడుతున్నా, రక్తపోటు అదుపులో ఉండకపోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నెలకోసారి బీపీ పరీక్షించుకుంటూ ఉండాలి. దాన్నిబట్టి వైద్యులు మందుల పవర్‌ పెంచటం, తగ్గించటం చేస్తారు. కొన్నిసార్లు మందుల ప్రభావం ఎక్కువై బీపీ తగ్గిపోతుంది కూడా! అలాంటప్పుడు రక్తపోటును స్థిరంగా ఉంచే మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.

హైపర్‌టెన్షన్‌ని నిర్లక్ష్యం చేస్తే..*.

35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. అలాకాకుండా 'లక్షణాలు కనిపించలేదు కదా!' అని రక్తపోటు ఉండీ బీపీ పరీక్షించుకోవటం నిర్లక్ష్యం చేస్తే...అంతర్లీనంగా జరగరాని నష్టం జరిగిపోతుంది. రక్తపోటును సరిచేయకుండా వదిలేస్తే ఒత్తిడి పెరిగి, గుండె పెద్దదవుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హార్ట్‌ ఫెయిల్‌ అవ్వొచ్చు. ఇదేకాకుండా మూత్రపిండాలు కూడా ఫెయిల్‌ అవ్వొచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ప్రెషర్‌ పెరిగిపోవచ్చు లేదా రక్తనాళాలు చిట్లిపోయి పెరాలటిక్‌ స్ట్రోక్‌ రావొచ్చు.

*హైవర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే.*..

రక్తపోటు అదుపులో ఉంచుకోవటం మన చేతుల్లో పనే! ఇందుకోసం అనుసరించవలసిన నియమాలు...మందులు సక్రమంగా వాడాలి. రక్తపోటుకు చికిత్స దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వైద్యులు సూచించినంత కాలం క్రమం తప్పకుండా మందులు వాడాలి.ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, సోడా ఉప్పు వేసి చేసిన వడలు, గారెలు, బజ్జీలు, బ్రెడ్‌, బిస్కెట్లు, కేక్‌ల లాంటివి తినకూడదు. అలాగే సాల్టెడ్‌ చిప్స్‌, బిస్కెట్లు కూడా మానేయాలి.వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం అరగంటపాటైనా నడక లేదా జాగింగ్‌ చేయాలి. రోజూ చేయడానికి సమయం లేకపోయినా వారంలో నాలుగు రోజుల పాటు వీటిని తప్పనిసరిగా చేయాలి.

 *ఉప్పు...పెద్ద తప్పు!*

మనం తినే ప్రతి కూరగాయలో, పళ్లల్లో, ఆకు కూరల్లో సహజసిద్ధంగానే కొంత ఉప్పు ఉంటుంది. వీటితో శరీరానికి సరిపడా సోడియం అందుతుంది. అయినా మనం రుచి కోసం వండేటప్పుడు ఉప్పును జోడిస్తుంటాం. నిజానికి ఉప్పు ఎక్కువ వాడకుండా ఆహారం తినగలిగితే రక్తపోటు రాదు. ఉప్పు వాడే సంప్రదాయం లేని జాతులు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. వాళ్లలో రక్తపోటు కనిపించకపోవటాన్ని వైద్యులు గమనించారు. దీన్నిబట్టి ఉప్పు నియంత్రిస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని రుజువైంది. కాబట్టి ఆహారంలో ఉప్పు వాడకం సాధ్యమైనంత తగ్గించాలి. కొంతమంది భోజనం చేస్తున్నప్పుడు కూరలో ఉప్పు తక్కువైందని కలిపేసుకుంటుంటారు. అలాగే పెరుగన్నం కూడా ఉప్పు లేనిదే తినరు. ఈ అలవాట్లు మానుకోవాలి. ఇంట్లో బిపి పేషెంట్లు ఉన్నప్పుడు వంటల్లో ఉప్పు సాధ్యమైనంత తక్కువ వాడాలి.

 *యోగా, ధ్యానంతో చెక్‌!*

యోగా వల్ల ఒరిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో రక్తపోటు అదుపులో ఉండటం ఒకటి. యోగా వల్ల సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 140 ఒక పది మిల్లీమీటర్లు, డయాస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 90 ఒక ఐదు మిల్లీమీటర్ల దాకా తగ్గుతుంది. రక్తపోటును తగ్గించే వ్యాయామంగా యోగా అంతర్జాతీయంగా ఆమోదం పొందింది. యోగాతోపాటు ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

 *బీపీ తగ్గించే...'డ్యాష్‌' డైట్‌*

'డైటరీ అప్రోచెస్‌ టు స్టాప్‌ హైపర్‌టెన్షన్‌' అనే 'డ్యాష్‌ డైట్‌'ను అమెరికాకు చెందిన డాక్టర్‌ మార్లా హెల్లర్‌ కనిపెట్టింది. రకరకాల ఆహారపదార్థాల ద్వారా శరీరానికి తగినన్ని పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగు పరచటంతోపాటు రక్తపోటును తగ్గించటంలో ఈ 'డ్యాష్‌ డైట్‌' దిట్ట. రక్తపోటు రాకుండా ఉండాలన్నా, నియంత్రణలో ఉండాలన్నా ఈ డైట్‌ను అనుసరించటం మేలని వైద్యులు అంటున్నారు. ఈ డైట్‌ను అనుసరిస్తే రెండు వారాల్లోనే సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ 8 నుంచి 14 పాయింట్లు తగ్గినట్టు ప్రయోగాత్మకంగా రుజువైంది. సోడియంను తగ్గించటంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియమ్‌లను పెంచటం డ్యాష్‌ డైట్‌ ప్రత్యేకత. ఈ డైట్‌లో భాగంగా తృణధాన్యాలు, పళ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. చేపలు, చికెన్‌, చిక్కుళ్లతోపాటు వారంలో ఒకటి రెండు రోజులు నట్స్‌, సీడ్స్‌ తినాలి. తక్కువ పరిమాణాల్లో మాంసం, స్వీట్లు, కొవ్వులు కూడా తీసుకోవచ్చు.

 *డ్యాష్‌ డైట్‌లో రోజుకి.*..

తృణధాన్యాల్లో భాగంగా రోజుకి ఒక హోల్‌ వీట్‌ బ్రెడ్‌ స్లయిస్‌ లేదా అర కప్పు బ్రౌన్‌ రైస్‌ లేదా పాస్తా తినొచ్చు.టొమాటో, క్యారెట్‌, బ్రొకోలీ, చిలకడ దుంపలు, ఆకుకూరల్లో పీచు పదార్థాలు బాగా ఉంటాయి. విటమిన్లతోపాటు పొటాషియం, మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ తినటం మేలు.పుల్లగా ఉండే నారింజ, బత్తాయిలాంటి నిమ్మజాతి పండ్లు తినాలి.పాలు, పెరుగు, జున్నులలో కాల్షియం, విటమిన్‌-డిలు ఎక్కువ ఉంటాయి.. వీటిని తినటం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది.బాదం, కిడ్నీబీన్స్‌, బఠాణీ, పప్పుల్లోనూ మెగ్నీషియం, పొటాషియంలు ఉంటాయి.

డాక్టర్.కె.శరత్ చంద్ర,

కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్,

ఇండో యుఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

తెలంగాణ బతుకమ్మ

తెలంగాణ బతుకమ్మ


తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ  మొదలు కానుంది. ఒక మనిషికి, పకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదియ్యని సంబంధం ఉంటుంది.

ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి సేదతీరేవాడు…. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక పకృతితో ఎలా కలుస్తాడు. బతుకమ్మ పండగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి పకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం.

ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది:

ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదలు కారాదనీ, కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.

ఈ పండుగను తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ.

తొమ్మిది రూపాల బతుకమ్మల పేర్లు:

1. ఎంగిలిపూల బతుకమ్మ
2. అటుకుల బతుకమ్మ
3. ముద్దపప్పు బతుకమ్మ
4. నాన బియ్యం బతుకమ్మ
5. అట్ల బతుకమ్మ
6.అలిగిన బతుకమ్మ
7. వేపకాయల బతుకమ్మ
8. వెన్నముద్దల బతుకమ్మ
9. సద్దుల బతుకమ్మ (చివరిరోజు)

ఎంగిలి పువ్వుల బతుకమ్మ :*

బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలాంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు, ఇచ్చుకుంటారు.

అటుకుల బతుకమ్మ*

రెండవ రోజునాడు ఉదయానే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి,  ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో వేస్తారు.
రెండవ రోజు అటుకులు వాయనంగా పెడుతారు.

ముద్దపప్పు బతుకమ్మ :

మూడవ రోజు బతుకమ్మను మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో అలంకరించి తామర పాత్రలలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరం పై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరో లేక నాలుగు బాటలు కాడ అందరూ కలసి ఆడవారు ఆడుకొని చెరువులో వేసి వస్తారు.
మూడవ రోజు వాయనంగా సత్తుపిండి,పేసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడుతారు.

నానబియ్యం బతుకమ్మ:

నాలుగవ రోజు నానబియ్యం ఫలహారంగా పెడుతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు.వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.

అట్ల బతుకమ్మ :

ఈ ఐదవ రోజు తంగేడు, గునుగు,చామంతి,మందార, గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు.
ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.

అలిగిన బతుకమ్మ:

ఈ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు.

వేపకాయల బతుకమ్మ :

ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు.
ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.

వెన్న ముద్దలా బతుకమ్మ:
ఎనిమిదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆట,పాటల మధ్య చెరువులో వేస్తారు.
ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.

సద్దుల బతుకమ్మ:

ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని  బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు.

చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు.

సర్వేజనా సుఖినోభావంతు

ధర్మో రక్షితి రక్షతి

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

అక్షర్తోత్పత్తి

అక్షర్తోత్పత్తి


ఇదం అంధతమః కృత్స్నం/ జాయతే భువనత్రయం
యది శబ్దాన్వయం జ్యోతి: ఆసంసారం న దీప్యతే
మూడు లోకాలలో శబ్దమనే జ్యోతి వెలిగి ఉండక పోతే, ఈ సమస్త జగత్తు అంధకారంలో మునిగి ఉండేది అని శ్లోక భావం.
నిజమేకదా! పశువులనుండి మనుషులనువేరు చెసేది, మది గదిలో నిదురించిన భావాలను వెలికితీసి, నలుగురితో పంచుకోనేలా చెసేది, సంఘజీవిగా మనిషి మనుగడ సాగించడానికి ఉపయోగ పడేది, గతాన్ని మనకు తెలిపి, వర్తమానంలో మన నడవడికి ఒరవడులు దిద్ది, భవిష్యత్తులోకినడిపించేది ఈ భాషేకదా! అట్టి *భాషకి మూలం అక్షరాలు.

#న క్షరః అక్షరః#* అనగా *క్షరము కానిది (నాశనములేనిది) అక్షరము.
#అక్షరాణామ్ అకారోస్మి#* అక్షరాలలో *అ*కారాన్ని నేను. అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి, అక్షరాల గొప్పతనాన్ని మనకి విశదీకరించెను.

 అందుకే అక్షరాలతో ఏర్పడే శబ్దాన్ని *శబ్ద బ్రహ్మ*గా *ఉపనిషత్తులు* ఎలా వివరించాయో చూడండి.
అనాది నిధనం బ్రహ్మ/ శబ్దతత్త్వం యదక్షరం‌ వివర్తతేర్థ భావేన ప్రక్రియా జగతో యతః

పూర్వకాలంనుండి శబ్ద బ్రహ్మ అక్షరరూపంలో ఈ జగత్తులో వ్యాపించి ఉందని, దానిని మనం సభక్తి పూర్వకంగా సేవించాలని పైశ్లోకం వివరిస్తుంది. అట్టి అక్షరాల ఉత్పత్తిని ఋషులు దర్శించి* మనకి అందించిన విధానాన్ని, ఈ వ్యాసం ద్వారా పెద్దలు తెలుసుకొని, పిల్లలకి భారతీయ ఋషుల గొప్పతనాన్ని, వారి ప్రతిభాపాటవాలని వివరించాలని కోరిక.

నేటి శాస్త్రజ్ఞులు లింగ్విస్టిక్ సైన్సు ద్వారా అక్షరాల అమరికలని, భాష ప్రదుర్భావాన్నిఆధునిక పద్ధతిలో వివరించటానికి పూర్వమే, *అరటిపండు వలచి చేతిలో పెట్టి* నట్లు అక్షరాల ఉత్పత్తిని, వాటిని పలికే విధానాన్ని, మన ఋషులు తేటతెల్లం చేసారు. అద్భుతమైన ఈ అక్షరోత్పత్తిని తెలుసుకొందాం.

పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలుమ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి, పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించెను. ఈ సూత్రాలే "మాహేశ్వర ప్రత్యాహారసూత్రాలు"గా పిలువబడుతున్నాయి, ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు.* పైన చెప్పిన విషయానికి ఈ క్రిందిశ్లోకం ప్రమాణం

నృత్యా వసానే నాటరాజ రాజో ననాద ఢక్కాం నవ పంచవారం* ( *నవ=*తొమ్మిది. *పంచ=*ఐదు కలిపితే =14)
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివ సూత్రజాలం

అక్షరాలని గ్రహించి సూత్రీకరించింది *పాణిని మహర్షి* ఐతే, వాటికి వార్తికం (సూత్రాదులను వివరించడం కోసం రచించిన వ్యాఖ్యాన గ్రంథం.) వ్రాసినది మాత్రం *వరరుచి*. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది *పతంజలి మహర్షి* అందుకనే
వాక్యాకారంవరరుచిం భాష్యాకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం

అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం వ్యాకరణాన్ని,తద్వారా భాషని అభ్యసించేవారు. ఇక అక్షరరూపంలోఉన్న పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం. ( ఇవి *ఢమరుక నాదాలని* మరచిపోవద్దు.)
1.‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు).
2.‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు).
3.‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు).
4.‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము).
5.‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు)
6.‘ల ణ్’ (లకారం)
7.‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )
8.‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)
9.‘ఘ,ఢ,ధ ష్’
(ఘకారం, ఢ కారం, ధకారం)
10.‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )
11.‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)
12.‘క ప య్’ (క & ప)
13.‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )
14.‘హల్’ ( హకారం)

“ఇతి మాహేశ్వరాణి చతుర్దశ ప్యత్యహార సూత్రాణి”

ఈ పదునాలుగూ  మహేశ్వరుని ద్వారా ప్రేరేపంపబడ్డ  సూత్రాలు. 
ప్రతి సూత్రం చివర ఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించ బడినవి.#* అట్లే *#అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలోనిర్దేశించబడినవి.#* అవి తొలి సూత్రము లోని మొదటి అక్షరం *అ* నాల్గవ సూత్రము లోని చివరి హల్లు *చ్* కలిపితే *అచ్* సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని *అచ్చులు* అనివ్యవహరించెదరనియు, ఐదవ సూత్రము లోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని విపులముగా వివరించెను. ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో *పాణినిచె రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు.* ఈ సూత్రాలకే *వరరుచి* వార్తికాలని, *పతంజలి*భాష్యాన్ని విరచించి లోకానికి ప్రసాదించిరి. *#భాషాశాస్త్ర వేత్తలకి ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.

ఇక అక్షరాలని ఎలాపలుకుతామో ఇప్పుడు తెలుసుకొందాం. ముందుగా సంస్కృత సూత్రాలని తెలిపి, వాటిని తెలుగులో వివరిస్తాను.
అకుహ విసర్జ నీయానాం కంఠ:#*
అ ఆ లు, కవర్గ, హకారమూ, విసర్గలు, అనే అక్షరాలు కంఠము నుండి వెలువడి పలుకబడతాయి.
ఇ చు యశానాం తాలు.#* ఇ ఈ లు, చవర్గ, యకారము, శకారము తాలువు అనగా నాలుకతో పలుకబడతాయి.
ఋ టు ర షాణామ్ మూర్ధా* ఋకారము, టవర్గ, రకారము, షకారము అనే అక్షరాలూ పలికేటప్పుడు శబ్దం శిరస్సునుండి వెలువడుతుంది. మూర్ధా అంటే శిరస్సు.
లు తు ల సనామ్ దంతాః* అచ్చులలోని అలూ అనే అక్షరం, తవర్గ, లకారము, సకారము దంతముల సహాయముతో పలుకుబడతాయి.
ఉ పూప పద్మానీయానాం ఓష్టౌ* ఉ,ఊలు, పవర్గ పెదవులతో పలుకబడతాయి.
ఙ మ ఞ ణ నానాం నాసికాచ* వర్గల యొక్క చివరి అక్షరములు ఐదు నాసిక అంటే ముక్కు. అవి ముక్కుతో పలుకబడతాయి.
ఏ దైతో: కంఠ తాలు* ఏకారము, ఐకారము కంఠము, నాలుక సాహాయముతో పుడతాయి.
ఓ దౌ తో: కంఠ, ఓష్ట్యం* ఓ మరియు,ఔ అనేఅచ్చులు కంఠము, పెదవుల కలయికతో పుడతాయి.
వ కారస్య దంతోష్ట్యం* వకారము దంతములు, పెదవుల సాహాయముతో ఉచ్ఛరించ బడుతుంది.

అక్షరాల పుట్టుకని, వాటిని పలకడానికి ఉపయోగపడే స్థానాలని ‘పాణిని మహర్షి’
ఎంత విపులంగా వివరించాడో! ఇంకా వీటికి *స్వరాలని,వ్యంజనాలని, ప్రాణులని, మహాప్రాణులని* ఇలా అక్షరాలకి రకరకాల పేర్లు పెట్టి అవి ఉచ్చారణలో ఎలా ఉపయోగ పడతాయోతెలియ జెప్పిన ఋషుల గొప్పతనాన్ని తెలుసుకొని వారిని నిత్యం స్మరించుకోవడం మరియు వారి అడుగుజాడల్లో నడుచుకోవడం మన విధి.

దేశ భాషలందు తెలుగు లెస్స

తెలుగు చదువుదాము
తెలుగు మాట్లాడుదాం
తెలుగు వ్రాద్దాం
సర్వేజనాఃసుఖినోభవంతు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది !

పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది !


అవును ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ పని పట్టొచ్చు. ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ఇటీవలి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది.
అల్లో పతి మందులకు లొంగని హై షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటోంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.. ఇలా 7 రోజులు చేస్తే అద్భుత మైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఆచరించడంతో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి..
ఇలా చేయాలి:
రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఖచ్చితంగా తినాలి.
ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకుని తిన్నా సరే.. పచ్చిది మాత్రం తినాలి.
50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.
7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.
50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.
పచ్చి ఉల్లిపాయతో పచ్చిపులుసు చేసుకుని అన్నంతోపాటు తిన్నా సరిపోతుంది.
పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు:
ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.
ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.
ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ 2, 3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలను రావు.
కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు కూడా రావు.
షేర్ చేయండి.
Wish you a good health...
forwarded as received
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!


సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.



రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు

1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

ఈ ఉపయోగకరమైన సమాచారం మీ మిత్రులకి షేర్ చేయండి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఈ 10 అలవాట్లు మార్చుకోకపోతే ఎప్పటికి ధనవంతులు కాలేరు..!

ఈ 10 అలవాట్లు మార్చుకోకపోతే ఎప్పటికి ధనవంతులు కాలేరు..!

శాస్త్రాల ప్రకారం మనుషులకు ఉండే కొన్ని అలవాట్ల వలన దరిద్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందట .కొంతమంది ఎంత కష్టపడినా ఆర్దికంగా పైకి రారు.ఎప్పుడు కష్టాలు దారిద్య్రంలో చివరకు రోడ్డుపైకి వస్తారు.అయితే ఎలాంటి చేయకూడని పనులేమిటి తెలుసుకుందాం./

  • బాత్రూమ్ కడగకుందా నీట్ గా ఉంచకపోవడం వలన దరిద్రం చుట్టుకుంటుంది.
  • ఎవరైనా వారు తినగలిగినంత కాక ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తుంటారు అన్నాన్ని.
  • ఇలా చేయడం వల్ల ఎప్పుడు పేదవారిలాగానే ఉంటారట.
  • తిన్న తరువాత ప్లేట్ అలానే ఉంచకూడదు
  • వెంటనే కడిగేయాలి లేదంటే శని చుట్టుకుంటుంది .
  • రోజూ వాడే మంచం పక్కబట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట.
  • మంచాన్ని ఉదయకాలంలో మాత్రమే శుభ్రపరచాలి రాత్రిపూట శుభ్రపరుస్తే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
  • ఉమ్మును ఎక్కడపడితే అక్కడ ఊయడం వలన లక్ష్మి దేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది ఇంతకంటే దరిద్రం మరింకేది ఉండదు.
  • శాస్త్రం ప్రకారం సంధ్యా వేళలో ఊడ్చకూడడు
  •  ఇలా చేయడం కూడా దరిద్రమే.ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగెటివ్ ఎనర్జీ నీ తెస్తాయి.
  • ఉత్తర దక్షిణ మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు .ఇలా చేస్తే గొడవలు వస్తాయి .
  • మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు.
  • ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి ఇంటీలోనుంచి వెళ్ళిపోతుంది
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Wednesday, August 23, 2017

మొక్కల్లో మెడికల్‌ షాప్‌

మొక్కల్లో మెడికల్‌ షాప్‌

  • మన చుట్టూరానే ఎన్నో ఔషధాలు
  • చిన్న స్థాయి అనారోగ్యం నుంచి దీర్ఘకాలిక వ్యాధులకూ ఉపశమనం
  • దశాబ్ద కాలంగా పెరుగుతున్న వినియోగం
  • వినాయకుడి పూజలో అన్ని ఔషధాలే..!
  • రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు నివేదిక

సాధారణంగా ఏదైనా అనారోగ్యం తలెత్తితే.. ఏ అల్లోపతి వైద్యుడి దగ్గరికో వెళ్లి మందు బిళ్లలు వేసుకుంటాం. చికిత్స తీసుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్న మొక్కలు, చెట్లలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న అనారోగ్యం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఉపశమనం కలిగించే వేలాది రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. అసలు మన చుట్టూ ఉన్న మొక్కలు, చెట్లలో చాలా వరకు ఏదో ఒకరకమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఇప్పటివరకు దేశంలోని మొత్తం 18 వేల రకాల వృక్షజాతుల్లో ఏడు వేల జాతుల వరకు ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి తదితర వైద్య విధానాల్లో వాటిని వినియోగిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్‌

ఔషధ’ సంప్రదాయం;-
మన దేశ సంస్కృతిలోనే సంప్రదాయ వైద్య విధానం ఇమిడి ఉంది. అనాది నుంచి ప్రతి మొక్కలోని లక్షణాలను పరిశీలించి.. వాటిల్లోని ఔషధ గుణాలను గుర్తించారు. వైద్యం కోసం వినియోగించారు. కానీ అనంతరం అల్లోపతి వైద్యం బాగా విస్తరించింది. తిరిగి ఇటీవలి కాలంలో ఔషధ మొక్కల వినియోగంపై పరిశోధనలు, వినియోగం పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో వినియోగించే మొక్కలు, వాటి ఉత్పత్తుల్లో ఎన్నో ఔషధ లక్షణాలు ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది.

ముఖ్యంగా వినాయక చవితిలో వినియోగించే మొక్కలు, వాటి ఉత్పత్తులను పరిశీలిస్తే... ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని గుర్తించారు. భారత ఔషధ మొక్కల మండలి ఈ అంశాలను ధ్రువీకరించింది కూడా. వినాయక చవితిలో ఉపయోగించే 21 రకాల మొక్కలు, వాటి ఆకులు, ఉత్పత్తుల్లో ఉన్న ఔషధ లక్షణాలపై తెలంగాణ ఔషధ మొక్కల మండలి అవగాహన కల్పిస్తోంది. తాజాగా వీటిపై ఒక నివేదికను కూడా రూపొందించింది.

జీవనోపాధి కూడా.

ఔషధ మొక్కలు ఆరోగ్యపరంగా తోడ్పడడమే కాదు.. వాటి పెంపకం ఎంతో మందికి జీవనోపాధి కూడా కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఔషధ మొక్కల ఉత్పత్తులు మన దేశంలోనే ఉన్నాయి. దేశంలో 1,178 ఔషధ మొక్కలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో దాదాపు 242 రకాల మొక్కల ఉత్పత్తులు ఏటా వందల టన్నుల్లో వినియోగమవుతున్నాయి. ఇక ఏటా 1.95 లక్షల టన్నుల మేర ఔషధ మొక్కల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటి విలువ సుమారు రూ. 5,000 కోట్ల వరకు ఉండడం గమనార్హం.

మన చుట్టూ ఉన్న Ayurveda medicines ఔషధాలివే.;-


  • మాచీ పత్రం (మాచిపత్రి):* దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • బృహతీ పత్రం (వాకుడాకు):* దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులు, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి పనికివస్తుంది.
  • బిల్వ పత్రం (మారేడు):* జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • దూర్వాయుగ్మం (గరిక):* గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శమొలల నివారణకు వినియోగిస్తారు.
  • దత్తూర పత్రం (ఉమ్మెత్త):* సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, రుతు సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితం కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది.
  • బదరీ పత్రం (రేగు):* జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది.
  • అపామార్గ పత్రం (ఉత్తరేణి):* దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవిపోటు, రక్తం కారటం, అర్శమొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • తులసీ పత్రం (తులసి):* దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నునొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
  • చూత పత్రం (మామిడాకు):* రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లో క్రిమికీటకాల నివారణకు పనికివస్తుంది.
  • కరవీర పత్రం (గన్నేరు):* కణతులు, తేలుకాటు, ఇతర విష కీటకాల కాట్లు, దురద, కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధుల వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • విష్ణుకాంత పత్రం (విష్ణుకాంత):* జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
  • దాడిమీ పత్రం (దానిమ్మ):* విరేచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, అర్శమొలలు, ముక్కు నుంచి రక్తం కారడం, కళ్ల కలక, గొంతునొప్పి, చర్మవ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • దేవదారు పత్రం (దేవదారు):* అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి సంబంధ వ్యాధులు తగ్గించడానికి వినియోగిస్తారు.
  • మరువక పత్రం (మరువం):* జీర్ణశక్తి, ఆకలి పెంపొందించేందుకు, జుట్టు రాలడాన్ని, చర్మవ్యాధులను తగ్గించేందుకు పనికి వస్తుంది. దీనిని సువాసన కోసం కూడా ఉపయోగిస్తారు.
  • సింధువార పత్రం (వావిలి):* జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్చ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • జాజి పత్రం (జాజి ఆకు):* వాత నొప్పులు, జీర్ణాశయం వ్యాధులు, పెద్దపేగు వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మవ్యాధులు తగ్గించడానికి తోడ్పడుతుంది.
  • గండకీ పత్రం (దేవకాంచనం):* మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులి పురుగుల నివారణకు పనికివస్తుంది. ఈ ఆకులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
  • శమీ పత్రం (జమ్మి):* కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధుల నివారణకు వినియోగిస్తారు.
  • అశ్వత్థ పత్రం (రావి ఆకు):* మలబద్ధకం, కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, నోటిపూత, చర్మవ్యాధుల నివారణకు... జీర్ణశక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
  • అర్జున పత్రం (తెల్లమద్ది):* చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, జీర్ణాశయ, పెద్దపేగు సమస్యలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.
  • అర్క పత్రం (జిల్లేడు):* చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు వంటివాటిని తగ్గించడానికి తోడ్పడుతుంది. (తెలంగాణ ఔషధ మొక్కల మండలి వివరాల ప్రకారం..)

మన సంస్కృతిలోనే వైద్యం

‘‘భారతదేశ సంస్కృతిలోనే సంప్రదాయ వైద్యం ఇమిడి ఉంది. మన పరిసరాల్లోనే మనకు ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఔషధాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా వినాయక చవితి పూజల సందర్భంగా ఉపయోగించే మొక్కలు, ఆకులు, ఉత్పత్తులలో.. వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను నివారించే ఎన్నో ఔషధాలు ఉండడం గమనార్హం.’’
– ఎ.వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర ఔషధ మొక్కల మండలి.

ఫోన్ పోగుట్టు కుంటే?

ఫోన్ పోగుట్టు కుంటే?

సోమాజిగూడ/హైదరాబాద్: క్రాంతి ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పంజాగుట్టలో గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. డోర్‌ పక్కన మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి స్నానానికి వెళ్లాడు. ఆఫీసుకు వెళ్లేందుకు బ్యాగ్‌, టిఫిన్‌ బాక్స్‌ సిద్ధం చేసుకున్నాడు. ఫోన్‌ తీసుకుందామని డోర్‌ వద్దకు వెళ్లి చూడగా లేదు. రూమ్‌లో ఉన్న మరో స్నేహితుడిని.. నా ఫోన్‌ ఎక్కడుందని అడగగా తెలయదని సమాధానం చెప్పాడు. ఓ క్షణం ఆలోచించాడు... తన వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ తన పక్కనే ఉన్న రూమ్‌లో ఉందని గుర్తించాడు. ఇవ్వమని వారిని బతిమాలాడు. నీ ఫోన్‌ మేమెందుకు తీసుకుంటామని వాగ్వివాదానికి దిగారు. క్రాంతి పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌కెళ్లి విషయాన్ని పోలీసులకు వివరించాడు. కానిస్టేబుల్స్‌ వెళ్లి ఆ గదిని పరిశీలించగా.. మొబైల్‌ ఆచూకీ లభించింది.

      సోమాజిగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సింధు స్మార్ట్‌ఫోన్‌ను ఆమె మూడేళ్ల కుమార్తె తీసుకుంది. ఇంట్లో తిరుగుతూ ఫోన్‌తో ఆడుకుంటుంది. గమనించిన ఆమె ఎక్కడికి వెళ్తుందిలే అనుకుంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి చేతిలో నుంచి ఫోన్‌ మాయమైంది. సింధు అర్జెంటుగా ఆఫీసుకు వెళ్లాల్సి ఉంది. ఇంటి నుంచి వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి. ఫోన్‌ లేకపోతే కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఎంత వెతికినా కనిపించలేదు. కూతురిని అడిగితే చెప్పలేకపోతోంది. గంట సమయం దాటిపోయింది. ఫోన్‌ దొరకడం లేదు. మరో మొబైల్‌ నుంచి ఫోన్‌ చేస్తే రింగ్‌ అవుతున్నా.. ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఫ్రెండ్‌ సహాయంతో ఇంటర్నెట్‌ ఓపెన్‌ చేసి తన జీమెయిల్‌ ఐడీ ద్వారా మొబైల్‌ ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకుంది.

     ఎక్కడో ఫోన్‌ పెట్టి మరిచిపోతాం.. పని చేసుకుంటూ ఎక్కడ పెట్టామో తెలియక వెతుకుతుంటాం. పిల్లలు పోన్‌ తీసుకుని గేమ్‌ ఆడుకుని అయిపోయాక ఎక్కడో పెట్టి మరిచిపోతారు. ఫోన్‌ ఎక్కడుందని అడిగితే సమాధానం రాదు. దానికోసం వెతుకుతూ కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగుతాం. ఆలోచిస్తే వెతికి పట్టుకోవచ్చు. ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ ఉన్న ప్రాంతాన్ని తెలుసుకోవచ్చు. ఈమెయిల్‌ ఐడీతో కనిపించని మొబైల్‌ ఫోన్‌ను గుర్తించొచ్చు. ఎవరైనా దొంగలిస్తే లొకేషన్‌ కూడా పట్టేస్తుంది.
ఇలా గుర్తించవచ్చు

         ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు జీమెయిల్‌ ఐడీ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి. కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో జీమెయిల్‌ ఐడీని ఓపెన్‌ చేయాలి. మెయిల్‌ ఐడీ పేజీలో కుడివైపు మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. వెంటనే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ఫైండ్‌ యువర్‌ ఫోన్‌ అని ఉంటుంది. అక్కడ క్లిక్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మన జీ మేయిల్‌ ఐడీ ఏ ఏ మొబైల్స్‌కి అనుసంధానం చేశామే చూపిస్తుంది. అక్కడ మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ను సెలెక్ట్‌ చేయాలి. అకౌంట్‌ వెరిఫై చేయాలని పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఐడీ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. రింగ్‌, లొకేట్‌ యువర్‌ ఫోన్‌ అని ప్రత్యక్షం అవుతుంది. కుడివైపు రెండు సింబల్స్‌ కనిపిస్తాయి. ఒకటి రింగ్‌, రెండోది మ్యాప్‌ లొకేషన్‌. ఇంట్లోనే ఉంటే రింగ్‌ అప్షన్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్న రింగ్‌టోన్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఎడమ భాగంలో మరిన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. మొబైల్‌ లొకేషన్‌, డివైజ్‌ లాక్‌, కన్సిడర్‌ ఎరైజ్‌ డాటా... అని ఉన్నాయి. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

వ్యక్తిగత డేటా తొలగించొచ్చు
మహానగరంలో ఎక్కువమంది ఉపయోగించేది ఖరీదైన ఫోన్లే. రోజుకు సుమారు వందకు పైగా వారివారి ఫోన్‌లను పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరి కొంతమంది పోనీలే అని లైట్‌గా తీసుకుంటున్నారు. యువతులు వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉంటే దొరికిన వ్యక్తి సామాజిక మద్యమాల్లో పోస్ట్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైన ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌లు ఉంటాయని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని మనోవేదన చెందుతారు. వీటికి పరిష్కారం ఉందని చాలా మందికి తెలియదనే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్మార్ట్‌ ఫోన్‌ను లాక్‌ చేయడంతో పాటు కీలక సమాచారాన్ని తొలగించే అవకాశం ఉంది.

లొకేషన్‌ తెలుసుకోవచ్చు
స్మార్ట్‌ ఫోన్‌కు అనుసంధానం చేసిన జీ మెయిల్‌ ఐడీ సహాయంతో మీ ఫోన్‌ లొకేషన్‌ ఎక్కడుందో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. జీ మెయిల్‌ ఐడీ ఓపెన్‌ చేసిన తర్వాత మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ద్వారా మొబైల్‌ లోకేషన్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం పోలీస్‌స్టేషన్‌, ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

జాగ్రత్తగా వ్యవహరించాలి
ఏ పని చేయాలన్నా అందరూ స్మార్ట్‌ ఫోన్‌ మీద ఆధారపడుతున్నారు. సమాచారాన్నంతటినీ ఫోన్‌లోనే భద్రపరుస్తున్నారు. భద్రతపరంగా భాగానే ఉంటుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాల.....

Wednesday, August 16, 2017

Anganwadi teacher Jobs in Mahabubnagar

Anganwadi teacher Jobs in Mahabubnagar

తెలంగాణా ప్రభుత్వం Anganwadi teacher Jobs in Mahabubnagar
జిల్లా సంక్షెమ అధికారి మహిళా శిశు వికలాంగుల & వయోవృద్దుల శాఖా
మహబూబ్ నగర్ జిల్లా.

నోటిఫికేషన్ నెo. 460/A/2017. తేది:10/08/2017.

మహబూబ్నగర్ జిల్లా లోని (6) ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయ పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్లు, ఆయాలు మరియు మినీ అంగన్వాడి టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఖాళీల వివరాలు:-
1. మహబూబ్ నగర్ (అర్బన్) = టీచర్లు-06, ఆయాలు-13, మినీ అంగన్వాడి టీచర్-07
2. మహబూబ్ నగర్ (రూరల్) = టీచర్లు-13, ఆయాలు-34,  మినీ అంగన్వాడి టీచర్-08
3. దేవరకద్ర =  టీచర్లు-11,     ఆయాలు-43,    మినీ అంగన్వాడి టీచర్-05
4. మద్దూర్ =  టీచర్లు-03,   ఆయాలు-18,    మినీ అంగన్వాడి టీచర్-01
5. మక్తల్ =   టీచర్లు-19,   ఆయాలు-34,    మినీ అంగన్వాడి టీచర్-02
6. నారాయణపేట =  టీచర్లు-11,   ఆయాలు-41,    మినీ అంగన్వాడి టీచర్-07

దరఖాస్తు తో పాటు తగిన దృవీకరణ పత్రాలు గజిటెడ్ అధికారి అటెస్ట్ తో పాటు 24-08-2017 సాయంత్రం 5 గంటల లోపుఈ క్రింది ఆన్ లైన్ లింక్ ద్వార సమర్పించాలి.

పూర్తి వివరాలకొరకు;- 
http://wdcw.tg.nic.in
OR
http://mahabubnagar.nic.in/
వెబ్ సైట్ ను సందర్శించాలి.



అర్హతలు:-
అభ్యర్థిని తప్పని సరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.
జనరల్ కేటగిరి లో దరఖాస్తు చేసుకొనే అభ్యర్తినులు నోటిఫికేషన్ విడుదల ఐన నాటికీ 21 సంవత్సరాలు వయస్సు నిండి,  35-సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురలయి ఉండాలి.
అభ్యర్థిని తప్పనిసరిగా స్తానికంగా ఆ గ్రామంలో / గ్రామపంచాయతి లో నివసిస్తూ ఉండాలి.
ఎస్.సి. ఎస్.టి. కి కేటాఇంచిన అంగన్వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు.
ఎస్.సి. కి కేటాఇంచిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామా పంచాయతి కి చెందిన అభ్యర్థులు అర్హులు.
ఎస్.టి. కి కేటాఇంచబడిన అంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యబిటేషన్ కు చెందిన అభ్యర్థులు అర్హులు.


ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్తినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు :-
వినికిడి పరికరాన్ని ఉపయోగించిన వినగలిన వారు.
అంధత్వం ఉన్నప్పట్టికీ (escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించు కోగలిగిన వారు.
కాళ్ళు, చేతుల కు సంభందించిన అంగ వైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాధమిక విద్యను నేర్చుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు.

జతపరచవలసిన ధ్రువ పత్రాలు:-
(Scanned Copies)
పుట్టిన తేది / వయస్సు ద్రువికరణ పత్రం.
కుల ద్రువికరణ పత్రం.
విద్యార్హతల ద్రువికరణ పత్రం./ పదవ తరగతి మార్కుల జాబితా.
నివాస స్తల ద్రువికరణ పత్రం.
అంగ వైకల్యo కలిగిన వారు వైద్యాదికారి ద్వార ద్రువికరణ పత్రం.
వితంతువు ఐతే భర్త మరణ ద్రువికరణ పత్రం.
అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
వికలాంగు లైనచో సంభందిత సర్టిఫికేట్.

దరఖాస్తు తో పాటు తగు ద్రువికరణ పత్రాలు గజెటెడ్ అధికారి తో అటెస్ట్ తో తేది:- 24-08-2017 సాయంత్రం 5.00 గంటల లోపు ఈ క్రింద తెలిపిన ఆన్ లైన్ లింక్ ద్వార సమర్పించాలి.

 ఈ నోటిఫికేషన్ పూర్తి రద్దు పరుచుటకు గాని, మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్ గారికి అధికారాలు కలవు.

All Details/Authentic Information visit;-
http://wdcw.tg.nic.in
OR
http://mahabubnagar.nic.in/

Anganwadi teacher Jobs in Mahabubnagar - Anganwadi jobs in Mahabubnagar - Mahabubnagar.nic.in  - wdcw.tg.nic.in - Mahabubnagar anganwadi jobs - anganwadi posts in mahabubnagar dist.- anganwadi vacancies in Koilkonda - deverkhadra - narayanpet - 

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Sunday, August 13, 2017

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism)

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism)

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism) ఈ మతముము "మజ్దాఇజం" అనికూడా అంటారు. జొరాస్త్ర మతము (Zoroastrianism) అనేది ఇరాన్(పూర్వపు పర్షియా) దేశానికి చెందిన ఒక మతము. దీనిని జొరాస్టర్ (జరాతుష్ట్ర, జర్-తోష్త్) స్థాపించారు. ఈమతములో దేవుని పేరు అహూరా మజ్దా. ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతము ప్రాచీన పర్షియాలో పుట్టినా ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయిలో ఎక్కువగా నివసిస్తున్నారు.

జొరాస్త్ర మతమును అనుసరించే వారిని జొరాస్త్రీయన్లు అని అందురు. ఈ మతము క్రైస్తవ మతములకంటే పూర్వం ఆవిర్భవించింది. జొరాస్త్రీయన్ల మత గ్రంథమైన అవెస్త (Avesta) లో దేవుడి పేరు ఆహూరా మజ్దా (Ahura Mazda).

జొరాస్త్ర మతము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్తర్ (Zoroaster) అను ప్రవక్త. ఆర్యుల తెగలకు చెందిన ఈ ప్రవక్త జీవించిన కాలము తెలియరాకున్నది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి .

ఆర్యుల సమాజంలో బహు విగ్రాహాల ఆరాధన, జంతు బలులు ఉండేవి. యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు స్వప్నంలో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా దేవుడుఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన బోధనలతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, పర్షియాసామ్రాజ్యానికి జరిగిన యుద్ధంలో ట్యురాన్ దేశపు రాజుచేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు రక్షకులుకన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు.

జొరాస్తర్ జీవించిన కాలంలో ఆకాశం, రాళ్ళు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, నదులు, సముద్రాల ఘోష, మరణం, అగ్ని, సమాధులు - ఇవన్నీ విగ్రహాల రూపాలు దాల్చాయి. కాలక్రమేణా ఇండో-ఆర్యన్ తెగల్లో చీలికలు వచ్చాయి. దానితో వారు ఒకే దేవుడిని ఆరాధించే వారిగా (Monotheists) మరియు అనేక దేవుళ్ళను ఆరాధించేవారిగా (Polytheists) చీలిపోయారు. ఫలితంగా అనేక దేవుళ్ళను ఆరాధించే శాఖ వారు పాకిస్తాన్, హిమాలయాల గూండా భారత దేశానికి చేరుకొని నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) వ్రాసుకోగా, ఒకే దేవుడిని ఆరాధించే శాఖ వారు మాత్రం అక్కడే స్థిరపడి ప్రవక్త జొరాష్టర్ చెప్పిన సిద్దాంతాలు ఆచరించారు.

జొరాస్త్రీయన్లు చదివే అవెస్త గ్రంథమునకు, భారతీయ వేదాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవెస్త గ్రంథము - యశ్న (worship), గాత (Psalms), వెందిదాద్ (law against demons), యస్త (worship hymns), కోర్ద అవెస్త (litanies and prayers) అను ఐదు భాగాలుగా విభజించబడింది. ఈ గ్రంథము గ్రీకువీరుడైన అలగ్జాండర్, అరబ్బులు వంటి శత్రుదేశ రాజుల ఆక్రమణలవల్ల అవెస్త చాలా వరకూ నాశనమైయ్యింది . నేడు గ్రంథములో కొంత భాగం మాత్రమే మిగిలియున్నది.[4] కన్నడ భాష తెలుగు భాషకు దగ్గరగా ఉన్నట్టు అవెస్తలో ఉపయోగించిన భాష కూడా సంస్కృత భాషకు చాలా దగ్గరగా ఉంటుంది.

జొరాస్త్రీయన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్త్ర మతము ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రీయన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్ (Herodotus) జీవించిన కాలం తర్వాత జొరాష్ట్రియన్లు అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించుకొన్నారు. అవే అగ్ని దేవాలయాలు (Fire Temples). నేడు అగ్ని దేవాలయాలు టర్కీ, ఇరాన్, భారత దేశం లోను మిగిలియున్నాయి.

జొరాస్త్రీరియన్ల నమ్మకం ప్రకారం సృష్టి కర్త అహుర మాజ్డా. ఇతడు సత్యము, వెలుగు, పరిశుద్ధత, క్రమము, న్యాయము, బలము, ఓర్పుకు గుర్తు.ఈ ప్రపంచం మంచికి చెడుకి మధ్య యున్న యుద్ధ భూమి. అందువల్ల ప్రతి మనుష్యుడు దుష్టత్వం నుండి దూరంగా ఉండుట ద్వారా తన ఉనికిని కాపాడుకొని, మత ఆచారాల ద్వారా పరిశుద్ధపరచుకోవాలి.జొరాస్త్రీరియన్ల నమ్మకం ప్రకారం దేవుడు తన నుండి దృశ్యమైన ప్రపంచాన్ని మరియు అదృశ్యమైన ప్రపంచాన్ని సృష్టించాడు. కనుక సృష్టిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి మానవుడి బాధ్యత.దేవుడు ఆత్మ స్వారూప్యాలను మొదటగా సృష్టించాడు. అగ్ని, నీరు, గాలి, మట్టి, మొక్కలు, జంతువులు, మనుష్యులు కలిగియున్న ప్రపంచము దేవుని శరీరమువలే యున్నది. అయితే ఆయన ఆత్మఎల్లప్పుడూ సృష్టిని సంరక్షించుకొనుచున్నది. ఆది మానవుడినుండి సంరక్షణా దూతలను, మష్యె (Mashye), మష్యానె ( Mashyane) అను మొదటి స్త్రీ పురుషులను సృష్టించాడు దేవుడు. ఈ స్త్రీ పురుషుల నుండియే సమస్త మానవ జాతి ఆవిర్భవించింది.దేవుని సులక్షణాలను ప్రతిబంబించే మరియు భౌతిక ప్రపంచంలో దుష్టుడితో పోరాడటంలో దేవునికి సాయపడే దైవ స్వరూపాలు ఉంటాయి. వీటిలో గొప్పవైన ఆరు అమరమైన స్వరూపాలు లేక అమేష స్పెంతాస్. ఇంకా దేవ దూతలు వగైరా ఉంటాయి. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అర్పణలతో కూడిన యజ్ఞాలు, ప్రార్థనలు చేస్తారు.మనిషి సహజంగా దైవ స్వరూపం కలిగి దైవ లక్షణాలు కలిగియుంటాడు. మనుష్యులకు రెండు అవకాశాలుంటాయి - ఒకటి నీతిగా ఉండి దేవుడి బోధనలు పాటించడం, రెండవది దుష్టత్వాన్ని పాటించి నాశనమవ్వడం. మనిషి ఎంచుకొన్న మార్గాన్ని బట్టి దేవుడు ఆ మనుష్యుని ఖర్మను నిర్ణయిస్తాడు. పాప ప్రాయిశ్చిత్తం చేసుకొనే విధానం గురించి, సత్ప్రవర్తన గురించి దేవుడు విజ్ఞానాన్ని ఇస్తాడు. కాని తనను ఆరాధించేవారు చేసిన పాపాలను మోయడు.దేవుడు భౌతిక ప్రపంచం సృష్టించక ముందే ఆత్మీయ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆత్మీయ ప్రపంచం దుష్టశక్తికి అతీతమైనది. భౌతిక ప్రపంచం ఎప్పుడూ దుష్టుడి ఆక్రమణకి గురవ్వుతూవుంటుంది ఎందుకనగా దుష్టుడు అక్కడ నివాసమేర్పరచుకొన్నాడు. కనుక మనుష్యులు తమకు ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించాలి. వాటివైపు వెళ్ళకూడదు. అగ్ని, నీరు, భూమి, గాలి - వీటిని దుష్ట స్వరూపాలు లోపలికి వెళ్ళి కాలుష్యం చేయకుండా కాపాడాలి. మృత దేహాలను ఖననం చేయకూడదు, పాతిబెట్టకూడదు, నీటిలో పడవేయకూడదు. రాబందులకు, ఇతర పక్షులకు ఆహారంగా వేయాలి.జొరాస్త్ర మతము ప్రవక్త అయిన జొరాస్తర్ బోధనలపై ఆధారపడియున్నది. ఒక కథ ప్రకారం దేవుడే స్వయంగా జరాతుస్త్రకు దర్శనమిచ్చి సృష్టి రహస్యాలను, సన్మార్గంలో పయనించడానికి మానవులు పాటించవలసిన నియమాలను తెలిపాడు. జొరాస్తర్ బోధనలు జెండ్ అవెస్తా (Zend Avesta) లో దొరకుతాయి. జొరాస్త్రీయన్లు జరతుస్త్ర పుట్టుక 3000 సంవత్సరాల పాటూ సాగే సృష్టి చక్రం ఆరంభాన్ని తెలియజెప్పిందని నమ్ముతారు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. జొరాస్తర్ కుమారుడైన షోశ్యాంత్ (మూడవ ప్రవక్త) తీర్పు దినాన్ని, భౌతిక ప్రపంచంలో దుష్ట శక్తుల సంహారం గురించి ప్రవచిస్తాడు.జొరాస్త్రీయన్ల నమ్మకం ప్రకారం మరణము అనేది ఆత్మ శరీరంలోంచి బయటకు వెళిపోవడం వల్ల సంభవిస్తుంది, ఆపై శరీరం అపవిత్రమైపోతుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వెడలిన తరువాత 3 రోజులవరకూ ఆ శరీరం వద్ద తిరుగుతూ తరువాత దేనా అనే ఆత్మ సాయంతో ఆత్మీయ లోకానికి వెళ్ళిపోతుంది. అక్కడున్న దేవ దూత విచ్చేసిన ఆత్మ అంతిమతీర్పు దినానికి ముందు తాత్కాలికంగా స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నిర్ణయిస్తుంది. జొరాస్త్రీయన్ల నమ్మకం ప్రకారం అంతిమ తీర్పు దినములో దేవుడు మరణించిన ఆత్మలను లేపి రెండవసారి విచారణకు సిద్ధం చేస్తాడు. అన్ని మంచి ఆత్మలు స్వర్గంలో శాశ్వత స్థానాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నిత్య జీవం పొందేవరకూ తాత్కాలికంగా శిక్షలు పొందుతాయి. కొంతమంది జొరాస్త్రీయన్లు దైవ నిర్ణయం ప్రకారం ఆత్మలు పొరపాట్లను అధికమించి, సిద్దిత్వం పొందాలని భూమ్మీదే జన్మిస్తాయని, కనుక ఆత్మలు తమ వ్యక్తిత్వాన్ని శుద్ధీకరించుకోవడానికి, వెలుగుమయం చేసుకోవడానికి ఆత్మలకు భూమ్మీద జీవనం ఒక అవకాశమని నమ్ముతారు. జొరాస్త్రీయన్ పుస్తకాలు స్వర్గాన్ని సంపూర్ణ సంతోషకరమైన ప్రదేశమని, దేవుని వెలుగుతో అలంకరించబడినదని; నరకాన్ని పాపపు అత్మలు శిక్షలు పొందే శీతలమైన, చీకటియన ప్రదేశంగా చెబుతాయి.దుష్ట శక్తి వల్ల భూమ్మీద జీవనం ప్రమాదంతో కూడియున్నదని జొరాస్త్రీయన్లు నమ్ముతారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోవడము వల్ల కాదు కాని, జొరాస్తర్ చెప్పిన మూడు ఆజ్ఞలు (మంచి ఆలోచన, మాటలు, మంచి కార్యాలు) పాటించకపోవడం వల్ల మనుష్యులు వ్యభిచారము, దొంగతనము, పంచభూతాలను మలినం చేయడం, ఇతర నమ్మకాలను ఆచరించడం, చనిపోయిన వాటిని తొలగించకపోవడం, చనిపోయినవాటిని ముట్టుకోవడం, దేవుడిని ప్రార్థనలు - యాగాలు చేయకపోవడం, దెయ్యాలను ఆరాధించడం, కుస్తీ ధరించకపోవడం, పై వస్త్రం ధరించకపోవడం, దురుద్దేశ్యంతో వ్యాపారం చేయడం, లేఖనాల్లో చెప్పినట్లు వివాహం చేసుకోకపోవడం వంటి అనేక పాపాలు చేస్తారు.ప్రతీ 3000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు సమస్త దుష్ట శక్తులను అంతం చేసి తీర్పు దినాన్ని ప్రకటిస్తాడు, అన్ని ఆత్మలను లేపి రెండవసారి విచారణకు గురిచేస్తాడు. ఆ విచారణలో విధేయులైన ఆత్మలు స్వర్గంలో నిత్యజీవాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నరకంలో నిత్య శిక్షలకు గురవుతాయి.జొరాష్ట్రియన్లు కూడా హిందువులవలే దేవునితో సంభాషించడానికి యజ్ఞాలు నిర్వహిస్తారు. వీటినే యస్నాలు అని అందురు. మానవాళి కోసం నిర్వహించే ఈ యజ్ఞాలను అనుభవజ్ఞులైన పూజారులు తమ అగ్ని దేవాలయంలో అవెస్తాలో వాక్యములు / మంత్రాలు చదువుతూ చేస్తారు. జొరాస్త్రీయన్లు తమ దేవాలయాల్లో రోజుకి ఐదు సార్లు పూజలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా నాజోత్ అనే ఉపనయన తంతును బాలురకు, బాలికలకు నిర్వహిస్తారు. నాజొట్ ను ఎవరికైనా జోరాస్త్ర మార్గంలో ప్రయాణం సాగించే ముందు చేస్తారు.

సూక్తులు

అపకీర్తి, కుటిలత్వము రాకుండునట్లు, అబద్దమాడకుము [5]అసూయ దెయ్యము నీ వైపు చూడకుండునట్లు, ప్రపంచపు నిధి ప్రీతికరముగా లేకుండునట్లు నీవు ఆశ కలిగియుండకుము.ఆవేశపడకుము, ఎందుకనగా ఆవేశము వచ్చినప్పుడు బాధ్యతలు, మంచికార్యాలు మరుగున పడును, ప్రతి పాపము ఆలోచనలోకి వచ్చును.[6]ఆందోళన పడకుము, ఎందుకనగా ఆందోళన ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అధికమించును.హాని, పశ్చాతాపము నీ వద్దకు రాకుండునట్లు, మోహపడకుము.చేవలసిన పని పూర్తి కాకుండా ఉండునట్లు సోమరితనమును చేరనీయకుము.చక్కని గుణములు కలిగిన భార్యను ఎంచుకొనుముకలిగియున్న సంపదను బట్టి గర్వించకుము, ఎందుకనగా ఆఖరిలో అన్నింటినీ వదిలేయాల్సిందే.

ప్రస్తుత స్థితి

2004 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్త్రీయన్ల సంఖ్య 1,45,000 నుండి 2,10,000 వరకూ ఉంది. 2001 భారత్ జనగణన ప్రకారం 69,601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్త్రీయన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము (ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉంది. భారత దేశంలో జోరాస్త్ర మతమునకు పార్శీ మతమనికూడా పేరు.

 ప్రముఖ పార్శీలు
దాదాభాయి నౌరోజీ, జమ్సేట్జి టాటా ,ఫిరోజ్ షా ,మెహతాఫిరోజ్ గాంధీజుబిన్ మెహతాఅర్దెషీర్ ఇరానీగోద్రెజ్ కుటుంబం, వాడియా కుటుంబం, టాటా కుటుంబం వగైరాలు.

 ప్రపంచంలోనే వీరు మహా జ్ఞానులుగా ప్రసిద్ది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు ఈ జొరాస్ట్రియన్లే కావడం గమనార్హం. సికింద్రాబాద్ లోని "పార్సీగుట్ట"లో వీరి నివాసగృహాలు, స్మశానాలు ఉన్నాయి.
.