Pages

Wednesday, March 22, 2017

కృత్రిమంగా అమర్చే ఆక్సిజన్‌ సిలిండర్లు ఎలా పనిచేస్తాయి?



ప్రశ్న: కృత్రిమంగా అమర్చే ఆక్సిజన్‌ సిలిండర్లు ఎలా పనిచేస్తాయి?


జవాబు: కృత్రిమ శ్వాస అందించడంలో కీలకమైనవి ఆక్సిజన్‌ వెంటిలేటర్లే. మామూలు సిలిండర్లలో పెద్ద పనితనం ఏమీ లేదు. చిన్న వాల్వ్‌ పిన్నును తెరవడం, రెగ్యులేటర్ల ద్వారా సిలిండర్లలోని గాలిని ఒకే దిశలో ఆశించిన పీడనంలో బయటకు పంపడం మినహా వాటిలో మరే తతంగం లేదు. కానీ ఆక్సిజన్‌ వెంటిలేటర్లు వేరు. ఎవరికయినా అత్యవసర చికిత్స అవసరమైనపుడు, ఊపిరితిత్తుల పనితనం స్తంభించిపోయినపుడు, కోమాలోకి వెళ్లినపుడు కృత్రిమంగా శ్వాస ప్రక్రియను నిర్వహించాలి. అలాంటి సందర్భాలలో సిలిండర్లలో ఉన్న ఆక్సిజన్‌ను తగు మోతాదులో తగిన పీడనంలో రోగి ముక్కు లేదా నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. సాధారణంగా ఇలా కృత్రిమంగా పంపే ఆక్సిజన్‌ (ఒక్కోసారి నైట్రోజన్‌లో కలిసి) పీడనం బయటి వాతావరణ పీడనం కన్నా హెచ్చుగా ఉండడం వల్ల బలవంతంగానే ఆక్సిజన్‌ లోపలికి వెళ్లి రోగి ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలుస్తుంది. అదే సమయంలో అధిక పీడనం వల్ల వ్యాకోచించిన ఊపిరితిత్తుల ప్రోద్బలంతో పేషెంటు ఉదర వితానం (diaphragm)కూడా వ్యాకోచిస్తుంది. ఇది ఉచ్ఛ్వాస ప్రక్రియ (inspiration).ఈ దశకాగానే ప్రత్యేకమైన వాయు సరఫరా పద్ధతుల ద్వారా గాలిని పంపడం నిలుపు చేస్తారు. అప్పుడు ఉదరవితానం సంకోచించడం ద్వారా నిశ్వాస ప్రక్రియ (expiration)జరుగుతుంది. అపుడు విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడు, నీటి ఆవిరి మరో మార్గం ద్వారా గాల్లో కలుస్తాయి. ఇలా ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియనే కృత్రిమ శ్వాస క్రియ అంటారు. ఈ విధానంలో ఉపయోగపడే పరికరాల్ని వెంటిలేటర్లు అంటారు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

రాష్ట్రం కథ : జమ్మూ కాశ్మీర్

రాష్ట్రం కథ :  జమ్మూ కాశ్మీర్


జమ్మూ కాశ్మీర్ వైశాల్యం 2,23,236 చదరపు కిలో మీటర్లు  జమ్మూ దీనికి శీతాకాలపు రాజధాని  ,శ్రీనగర్ వేసవి కాలపు  రాజధాని . అధికార భాష ఉర్దూ . అయినా ఎక్కువ మాట్లాడే భాషలు కాశ్మీరీ ,డొంగ్రి ,లడక్
ముఖ్యమైన నదులు ..తావీ,జీలం చీనాబ్ ,సింధు .గంగ ,యమునా నదులు
సరస్సులు ..మనసబల్ సరస్సు ,వూలార్,నాగీన్,దాల్ లేక్
జమ్మూ కాశ్మీర్ ని మూడు ప్రాంతాలు గా చూడవచ్చు
 1.జమ్మూ 2.కాశ్మీర్ లోయ ౩.లడఖ్ ప్రాంతం
కాశ్మీర్ చరిత్రని తెలియజేసే చారిత్రక గ్రంధం ;;రాజ తరంగిణి ,కల్హాణుడి విరచితం
ప్రస్తుతం ముఖ్య మంత్రి  ; మెహబూబా ముఫ్తీ సయీద్
370 వ అధికరణ ప్రకారం కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వబడింది
అసెంబ్లీ సభ్యుల సంఖ్య 87 మంది .6 గురు లోక్ సభ ,4 రాజ్యసభ సీట్లు ఉంటాయి
ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం .వరి, గోధుమ ,మొక్కజొన్న.ఆపిల్ ,రేగు ,ద్రాక్ష ప్రధాన పంటలు
పరిశ్రమల కంటే చేతి పనులు ,స్వయం ఉపాధి మీద ఎక్కువ ఆధార పడతారు .కాశ్మీరీ తివాచీలు ,శాలువాలూ ,నగిషీ పనులూ ,హస్త కళల కి కాశ్మీర్ ప్రసిద్ధి
జమ్మూ కాశ్మీర్ ప్రకృతి సౌందర్యానికి  ప్రసిద్ధి .భూలోక స్వర్గం ,సూపర్ స్విట్జర్లాండ్ గా పిలవబడే జమ్మూ కాశ్మీర్ ఫల పుష్పాలూ ,జలపాతాలలో ,సెలయేళ్ళతో ,సరస్సు ల తో ,ప్రకృతి దృశ్యాలతో అలరారుతుంది
కాశ్మీర్ మార్చ్ నుంచి జూన్ వరకూ దర్శించడానికి వీలు గా ఉంటుంది .దాల్ సరస్సు లో బోటు షికారు ,మొగల్ గార్డెన్స్ ,చశ్మా షాహీ ,శాలీమార్ ,హరి పర్వతం ,హజరత్ మసీద్ ,అనంత్ నాగ్  ముఖ్య దర్శనీయ స్థలాలు .గుల్మార్గ్ ,సోనా మార్గ్,వేసవి విడుదులు
అమర్ నాధ్ గుహ హిందువుల పవిత్ర స్థలం .ఇది శ్రీనగర్ కి 153 కిలో మీటర్ల దూరం లో ఉంటుంది .ఎక్కువ శాతం ముస్లిం లూ,హిందువుల తో పాటు బౌద్ధులు కూడా ఎక్కువ సంఖ్య లో నివసిస్తారు
లడఖ్ ,కార్గిల్ ,ద్రాస్  సెక్టార్ లో సైనిక  స్థావరాలు ఉనాయి .ఇవి దేశం లోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేసే ప్రాంతాలు
ఇవండీ జమ్మూ కాశ్మీర్ విశేషాలు సంక్షిప్తం గా ..రేపు మరో రాష్ట్రం చూద్దాం.

మిగతా జంతువుల్లాగా గుర్రం ఎందుకు నేల మీద కూర్చోదు?



ప్రశ్న: మిగతా జంతువుల్లాగా గుర్రం ఎందుకు నేల మీద కూర్చోదు?


జవాబు:

మామూలుగా ఆవు, మేక, గేదెలాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లని ముడుచుకుని కూర్చుని సేద తీరడం చూస్తుంటాం. ఏనుగు, ఒంటెలాంటి పెద్ద జంతువులు కూడా అలాగే నేలపై కూర్చుంటాయి. అలా కూర్చోవడం ద్వారా అవి తమ కాళ్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. కానీ గుర్రం అలా కనిపించదు. అది అతి వేగంగా పరిగెత్తగల జంతువు. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి దాని సొంతం. దానికి కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండడమే. గుర్రం నులుచుని ఉన్నప్పుడు మూడు కాళ్లపైనే ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ దేహాన్ని నిలదొక్కుకోగల సామర్థ్యం ఉంది. అందువల్ల అది మిగతా జంతువుల లాగా తన కాళ్లను ముడుచుకుని కూర్చోవలసిన అవసరం లేదు. అంతేకాదు అది నిలబడి నిద్రపోగలదు కూడా. ఒకోసారి నేలపై పూర్తిగా ఒక పక్కకు ఒరిగి పడుకుంటుంది.





వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా..
ప్రశ్న: బోరు బావుల నుంచి బయటికి వచ్చే నీరు శీతకాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటాయి. ఎందువల్ల?

జవాబు: పగలు సూర్య కాంతి ఎక్కువగా ఉండటం వల్ల భూమి పైపొర వేడెక్కుతుంది. రాత్రిపూట సూర్యకాంతి లేకపోవడం వల్ల భూమి చల్లబడుతుంది. కానీ పై పొరలో ఉన్న పగటి వేడి బోరు బావిలోని నీరున్న కింది పొరలోకి వెళ్లడానికి సమయం పడుతుంది. అందువల్ల పగలు ఇంట్లో ఉన్న బిందెలోని నీరు ఎండ వల్ల వెచ్చగా ఉన్నా బోరు బావిలోని నీరు అదే వెచ్చదనంతో ఉండదు.

కానీ రాత్రి పూట మీరు ఎండాకాలంలో బోరు నీళ్లు కొట్టినట్లయితే అవి కాస్త వెచ్చగానే ఉంటాయి. అంటే ఆ పాటికి మాత్రమే పగటి వేడి లోపలి నీటికి చేరిందన్న మాట. అలాగే చలికాలంలో బయట పగలు చల్లగానే ఉన్నా కిందటి రోజు పగటి కాంతి వల్ల ఆలస్యంగా ఎంతో కొంత వేడెక్కిన నీరు బోరు బావిలో నుంచి బయటికొస్తుంది. బోరు నీళ్లు ఇలా పగలు వేసవికాలంలో చల్లగా, చలికాలంలో కాస్త వెచ్చగా అనిపించడానికి కారణం భూమి పొరలలో ఉష్ణ ప్రవాహం ఆలస్యం కావడమే!.
 
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?

 ప్రశ్న: పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?

జవాబు: పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది. 'నిప్పు లేనిదే పొగరాదు' అన్న సామెత సబబే అయినా నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అగత్యం లేదు. నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్‌ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు.
పచ్చిగా ఉన్న వంట చెరకు, తడిగా ఉండే బొగ్గులు, మలినగ్రస్తమైన తారు తదితర పెట్రోలియం ఇంధనాలు, ప్లాస్టిక్కులు, రబ్బరులు, కిరోసిన్‌ దీపాలు, గాలి సరిగా సరఫరా కాని కిరోసిన్‌ పొయ్యిలు, సిగరెట్లు, బీడీలు పొగల్ని బాగా ఇస్తాయి. ఆయా మండే పదార్థాల్లో ఉన్న రసాయనిక సంఘటనాన్ని బట్టి వచ్చే పొగలో ఉన్న పదార్థాల సైజు ఆధారపడుతుంది. మండే పదార్థాలు ఏమైనా వాటిలో పొగలో సాధారణంగా తేలికపాటి కర్బన రేణువులు, నత్రికామ్ల బిందువులు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్‌ సరిపడా అందకపోతే ఇంధనంలో ఉన్న కర్బన పరమాణువులన్నీ కార్బన్‌డయాక్సైడుగా మారవు.
పొగ తెల్లగా ఉండటానికి ప్రధాన కారణం కర్బనరేణువులే.కర్ర, సిగరెట్టు వంటి ఇంధనాలలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది. ఇందులో ఉన్న నత్రజని సమ్మేళనాలు మండినపుడు వెలువడే నైట్రిక్‌ ఆక్సైడ్‌, హైడ్రోజన్‌ భాగం మండగా ఏర్పడే నీటి బిందువులతో కలిసి నత్రికామ్లము, నైట్రస్‌ ఆమ్లం ఏర్పడుతాయి. కర్బన రేణువుల మీద పాక్షికంగా జతకూడని ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటికి చర్యాశీలత చాలా ఎక్కువ. ఇటువంటి చర్యాశీలత అధికంగా ఉన్న కర్బన రేణువులు, సహజంగానే అవాంఛనీయమైన ఆమ్ల బిందువులు ఉన్న పొగ మన కళ్లను చేరినపుడు కంటి పొరల్లో ఉన్న జీవ కణాల్ని వాటి కార్యకలాపాల్ని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ అవాంఛనీయమైన రసాయనిక ప్రేరణలే నొప్పిగా, మంటగా మన మెదడు భావించి వెంటనే కన్నీటి గ్రంథుల్ని ప్రేరేపించి కన్నీళ్ల ధారలో మలినాల్ని, పొగలోని రసాయనాల్ని కడిగేయడానికి ప్రయత్నించడం వల్లే మనకు ఆ సమయంలో నీళ్లు కూడా కారుతుంటాయి. అవే ముక్కు ద్వారా కూడా వస్తాయి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. 1899 మార్చి 13న జన్మించిన ఇతను హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. పడకల్ లో మాతామహుల ఇంట జన్మించిన ఇతని స్వగ్రామం బూర్గుల. అసలు ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ స్వగ్రామాన్నే ఇంటిపేరుగా చేసుకొని ప్రసిద్ధి చెందారు. 1967 సెప్టెంబర్ 14న బూర్గుల మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం
బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చి 13న మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో జన్మించారు. ఇంటిపేరు పుల్లంరాజు. అయితే తన స్వగ్రామమైన బూర్గుల పేరుమీదుగా ప్రసిద్ధులై ఇదే ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. హైదరాబాదు లోని ధర్మవంత్ పాఠశాలలోను, నిజాం కాలేజీలోను ఆయన విద్యాభ్యాసం సాగింది. నిజాం కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో ప్రథముడిగా వచ్చి వాకర్ మెడల్ను గెలుచుకున్నారు. తరువాత పూనా (పుణె) ఫెర్గుసన్ కాలేజీలో బి.ఏ. చదివారు. అక్కడే మరాఠీ కూడా నేర్చుకున్నారు. తరువాత బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. చదివారు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు.

బూర్గుల రామకృష్ణారావు రాజకీయ జీవితం:-
న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసారు. కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసారు.హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అద్యక్షత వహించారు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించారు. 1948 లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటై వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడాయన షాద్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకోసం తన ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత బూర్గుల కేరళ రాష్ట్రానికి గవర్నరుగా పనిచేశారు. 1967 సెప్టెంబర్ 14న బూర్గుల మరణించారు.          

Saturday, March 18, 2017

The Third Letter of Ur Name shows ur Character..


As per Japanese Psychology:-


The Third Letter of Ur Name shows ur Character..!!!!



What's the Third Letter of Ur Name?

A. Romantic
B. Proud
C. Innocent
D. Loved by all
E. Good and lovely
F. Fake
G. Logical mind person
H. Leader
I. Helpful
J. Enjoys every bit of life
K. Irritating
L. Funny
M. Emotional
N. Sensible
O. Supportive
P. Crazy
Q. Unpredictable
R. Practical
S. Loving
T. Feels for others
U. Sensitive
V. Genius
W. Calm
X. Takes everything easy
Y. Intelligent
Z. Jovial.

Whats Urs Check It Up..and share.... Its almost true...              
[11:04 PM, 3/16/2017] +91 99487 85291: FLASH..!!Govt.Ran Away Frm CPS Debate at MBNR
Let's See How Long It Can Escape & Save It's MLCs.Think..!!
Only  Can Abolish CPS,
AVN REDDY

మతిమరుపు...మందు

మతిమరుపు...మందు


మతిమరుపు...మందుమనలోనే!

గడియారంలో ముల్లు కదిలిపోతూ ఉంటుంది కానీ ఆన్సర్‌ షీట్‌ మీద పెన్ను కదలదు. జవాబులన్నీ తెలిసినట్టే ఉంటాయి. కానీ రాయబోతే ఒక్క అక్షరం ముక్క గుర్తుకురాదు. చదివిందంతా గుర్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఏ ఒక్కటీ జ్ఞాపకం ఉండదు. అసలేంటీ తిరకాసు? మెదడులోకి చేరిన మ్యాటరంతా ఏమవుతున్నట్టు? అసలీ మతిమరుపును జయించే మార్గమే లేదా? ఇవీ పరీక్షల టైమ్‌లో విద్యార్థులను వేధించే ప్రశ్నలు. వీటికి నిపుణులిస్తున్న సమాధానాలివే!

జ్ఞాపకశక్తిని మనం తేలికగా తీసుకుంటాం. కానీ అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్ర పోయేవరకూ చేసే ప్రతి చిన్న పనికీ మనం జ్ఞాపకాల మీదే ఆధారపడతాం. విషయాలకు సంబంధించిన సమాచారమంతా మెదడులో జ్ఞాపకంగా నిక్షిప్తమై ఉండబట్టే మన దైనందిన జీవితం సాఫీగా సాగిపోతోంది. మనం చూసే, చేసే, మన అనుభవంలోకి వచ్చే ఒక సమాచారం జ్ఞాపకంగా మారాలంటే ఎన్‌కోడింగ్‌, స్టోరేజ్‌, రిట్రీవల్‌ అనే మూడు దశలు దాటాలి. ఈ మూడు దశలూ దాటిన ప్రతి సమాచారం మనకు జీవితకాలం గుర్తుండిపోవాలనే రూలేం లేదు. కొన్ని క్షణం పాటు గుర్తుండొచ్చు. ఇంకొన్ని కొన్ని రోజులు, నెలలపాటు, మరికొన్ని జీవితకాలంపాటు జ్ఞాపకం ఉండొచ్చు. సమాచారం ప్రాధాన్యాన్ని బట్టి మెదడే ఈ తేడాలను పాటిస్తుంది. కాబట్టే మెదడుకు వెళ్లిన సమాచారం సెన్సరీ, షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ మెమరీల రూపంలో నిక్షిప్తమై ఉంటోంది.

సెన్సరీ మెమరీ: దీని వ్యవధి ఒక సెకను. మన ముందు నుంచి ఓ కారు వెళ్లిపోయింది. ఆ విషయాన్ని ఆ క్షణం తర్వాత మర్చిపోతాం.

షార్ట్‌టర్మ్‌ మెమరీ: దీని వ్యవధి ఒక నిమిషం. పదే పదే పునరావృతమైతే ఎక్కువకాలం గుర్తుండవచ్చు. పాఠాలు చదవటం ఈ కోవకే చెందుతుంది.

లాంగ్‌ టర్మ్‌ మెమరీ: దీని వ్యవధి జీవిత కాలం. డ్రైవింగ్‌, ఆటలు ఆడటం లాంటివి. వీటిని సాధన చేయకపోయినా పూర్తిగా మర్చిపోం.

ఈ మూడింట్లో పాఠాలు చదివి గుర్తుపెట్టుకోవటం అనే షార్ట్‌టర్మ్‌ మెమరీకి పదును పెట్టగలిగితే దాని వ్యవధిని ఎక్కువ కాలం పొడిగించుకోవచ్చు. ఇందుకోసం మెదడులోకి చేరవేసే చదువు తాలూకు సమాచారాన్ని బలమైన జ్ఞాపకంగా మార్చాలి. దీనికి కొన్ని పద్ధతులు, మెలకువలు అనుసరించాలి.

పాఠాలు మెదడులో నాటుకోవాలంటే?

50% పాఠం వినటంతోనే నేర్చుకుంటాం. తిరిగి చదివితే 75% ఒంటబడుతుంది. అలా నేర్చుకున్న పాఠాన్ని చూడకుండా రాస్తే నూటికి నూరుశాతం గుర్తుండిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే! అయితే ఇలా నేర్చుకున్న పాఠం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే...

 నేర్చుకున్నది బోధించాలి: పాఠం నిజంగానే మనకు అర్థమైందో లేదో పరీక్షించుకోవాలంటే అదే పాఠాన్ని బోధించాలి. ఇలా చేస్తే ఆ పాఠం మనకెంత గుర్తుందో తెలుస్తుంది. ఇలా చెప్పేటప్పుడు బ్రేక్‌ పడితే మళ్లీ పుస్తకం తిరగేయాల్సిందేనని అర్థం. ఈ టెక్నిక్‌ని స్నేహితుల మీద ప్రయోగించొచ్చు లేదా ఎవరికి వారే ప్రయత్నించొచ్చు.

పాఠాలు కథల్లా!: కథల పుస్తకాలు చదివినంత ఇష్టంగా క్లాసు పుస్తకాలు చదవాలి. పాఠాన్నొక చేదు మాత్రలా మింగే ప్రయత్నం చేస్తే ఎంతకీ మింగుడుపడదు. ఓ కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్టు, ఆసక్తికరమైన అంశం దొరికినట్టు పాఠం చదివితే ఎంత కష్టమైనదైనా తేలిగ్గా తలకెక్కుతుంది.

బిగ్గరగా చదవటం మంచిదే!: ఇది కొంత చిత్రంగా అనిపించవచ్చు! కానీ మనసులో చదవటం మాని బిగ్గరగా చదవండి. మనసులోనే మళ్లీ మళ్లీ చదవటం కంటే పైకి చదవటం వల్ల గుర్తుండే అవకాశం 50% ఎక్కువ.

బొమ్మల రూపంలో: చదివినదానికి దృశ్యరూపమిస్తే గుర్తుండిపోయే అవకాశం పెరుగుతుంది. మెమరీ టెస్ట్‌లో వందల పేర్లు గుర్తు పెట్టుకుని రికార్డులకెక్కేవాళ్లు అనుసరించే పద్ధతి ఇదే! కాబట్టి చదివిన విషయాలను బొమ్మల రూపంలో గీసే ప్రయత్నం చేయండి. అదొక దృశ్య జ్ఞాపకంగా మీ మెదడులో నిక్షిప్తమైపోతుంది. పరీక్షల్లో ఈ బొమ్మను గుర్తుచేసుకుంటే చాలు! దాని ఆధారంగా సమాధానాన్ని రాసేయొచ్చు.

డాక్యుమెంటరీ చూడండి: పేజీలకొద్దీ విషయాన్ని చిన్న టైమ్‌ఫ్రేమ్‌లోకి మలిచి కాలక్షేపాన్ని అందించేవి డాక్యుమెంటరీలు. వీటిని చూడటం వల్ల పాయింట్లు తేలికగా గుర్తుంచుకోవచ్చు. కాబట్టి కన్‌ఫ్యూజ్‌ చేసి, ఇబ్బంది పెట్టే పాఠ్యాంశాలు డాక్యుమెంటరీలుగా దొరుకుతాయేమో చూడండి. ఇన్‌ఫోగ్రాఫిక్స్‌ కూడా ప్రయత్నించొచ్చు.

ఫ్లాష్‌ కార్డ్‌ టెక్నిక్‌: కొటేషన్లు, ఫార్ములాలు, కాన్సెప్ట్స్‌, డెఫినిషన్లు.. గుర్తుంచుకోగల్గితే పరీక్షల్లో సగం గట్టెక్కినట్టే! కాబట్టి వీటిని తేలికగా నేర్చుకోవటం కోసం ‘ఫ్లాష్‌ కార్డ్‌’ టెక్నిక్‌ ప్రయత్నించాలి. ఒక్కో కొటేషన్‌, ఫార్ములాకు ఒక్కో ఫొటోను జతచేస్తూ కొన్ని ఫ్లాష్‌ కార్డులు దగ్గర పెట్టుకోవాలి. ఆ ఫొటోలను చూస్తూ ఆ కొటేషన్లను నేర్చుకోవాలి. చివర్లో వరసగా ఫొటోలు తిప్పుతూ నేర్చుకున్నవి గుర్తు చేసుకోవాలి.

స్టడీ బ్రేక్స్‌: అదే పనిగా చదివినా మెదడు స్తంభిస్తుంది. ఏకాగ్రత కూడా సన్నగిల్లుతుంది. చదివే సమయంలో ప్రతి 45 - 50 నిమిషాలకు 10 నిమిషాలు బ్రేక్‌ తీసుకుంటే మెదడు అలసిపోదు. అలాకాకుండా ఒకటిన్నర గంటలకు మించి ఏకధాటిగా చదివితే గుర్తుంచుకునే అంశాల్లో గందరగోళం నెలకొంటుంది.

మ్యూజిక్‌ వింటూ: పాటలు వింటూ చదివితే త్వరగా ఎక్కుతుందనేది నిజమే! అయితే అది మూడ్‌ను ఎలివేట్‌ చేసే ఇన్‌సు్ట్రమెంటల్‌ మ్యూజిక్‌ అయితే మేలు.

మననం చేస్తే మేలు: చదివింది ఖాళీ సమయాల్లో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. గుర్తు తెచ్చుకోవటానికి ఎంత ఎక్కువగా శ్రమపడితే ఆ విషయం అంత బాగా గుర్తుండిపోతుంది. సగం గుర్తొచ్చి ఆగిపోతే వెంటనే ఆ సమాధానాన్ని పుస్తకంలో వెతకాలి.

పరీక్ష ముందు నిద్ర: పరీక్ష ముందు రాత్రంతా మేలుకొని చదవటం వల్ల నష్టమే ఎక్కువ. నిద్రపోయే సమయంలో మెదడు సమాచారాన్ని భద్రపరుచుకుని అవసరమైన సమయంలో గుర్తుకు తెచ్చే శక్తిని పెంపొందించుకుంటుంది.

పాయింట్స్‌ టు రిమెంబర్‌

మరికొద్ది క్షణాల్లో పరీక్ష. పాఠాలు మొత్తం తిరగేసే సమయం లేదు. అలాంటప్పుడు ఆ కాస్త టైంలోనే పుస్తకం మొత్తాన్ని రివైజ్‌ చేయగలిగే టెక్నిక్‌ ఒకటుంది. అదే ‘పాయింట్స్‌ టు రిమెంబర్‌’. పరీక్ష ముందు రోజు పాఠాల్లోని ముఖ్యమైన అంశాలను పాయింట్ల రూపంలో చిన్న నోట్‌ ప్యాడ్‌లో రాసి పెట్టుకోవాలి. పరీక్ష హాల్లోకి వెళ్లేముందు వాటిని ఒకసారి చూసుకుంటే పాఠాల సారాంశమంతా గుర్తుకొస్తుంది.

మెమరీ ఫుడ్‌

జ్ఞాపకశక్తి పెరగాలంటే పోషకాహారం తీసుకోవాలి. మరిముఖ్యంగా పరీక్షల సమయంలో తప్పక తినవలసిన స్పెషల్‌ ఫుడ్‌ ఏంటంటే...

బీట్‌రూట్‌: దీన్లోని నైట్రేట్‌ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా మెదడు పనితీరు మెరుగవుతుంది.

బోన్‌ సూప్‌: ఎముకల సూప్‌తో పెద్ద పేగులు శుభ్రమవుతాయి. ఈ సూప్‌లోని ప్రోలీన్‌, గ్లైసీన్‌ ఎమినో యాసిడ్లు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

బ్రాకోలీ: దీన్లోని విటమిన్‌ కె, కోలీన్‌లు మెదడు పదును పెంచుతాయి.

గుడ్డులో పచ్చసొన: తల్లి తినే గుడ్లు.. గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయి. గుడ్లు శరీరంలో ‘బీథేన్‌’ అనే హ్యాపీ హార్మోన్‌ విడుదలను పెంచుతాయి. కాబట్టి పరీక్షలు హ్యాపీగా రాయాలంటే గుడ్లు తినాల్సిందే!

ఆకుకూరలు: ఆకుకూరలు మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిలో సమృద్ధిగా ఉండే ఎ, కె విటమిన్లు మెదడు కణాలైన న్యూరాన్ల మధ్య సమాచార ప్రసారాన్ని సరళం చేస్తాయి.

వాల్‌నట్స్‌: ప్రతిరోజూ మెదడు ఆకారంలో ఉండే గుప్పెడు వాల్‌నట్స్‌ తింటే మెంటల్‌ అలర్ట్‌నెస్‌ పెరుగుతుంది.

మెమరీ గేమ్స్‌ మెదడులోని హిప్పోక్యాంపస్‌ జ్ఞాపకశక్తి కేంద్రం. ప్రతి పదేళ్లకు ఐదు శాతం చొప్పున హిప్పోక్యాంపస్‌లోని న్యూరాన్లు నశిస్తూ ఉంటాయి. దీంతోపాటు జ్ఞాపకశక్తికి ఉపయోగపడే ‘అసిటైల్‌ కోలీన్‌’ అనే న్యూరోట్రాన్స్‌మీటర్‌ ఉత్పత్తి కూడా వయసుతోపాటు తగ్గుతుంది. ఫలితంగా మతిమరుపు వేధిస్తుంది. ఈ మార్పుల్ని నెమ్మదించాలంటే మెదడు యాక్టివిటీని పెంచే మెమరీ గేమ్స్‌ రెగ్యులర్‌గా ఆడుతుండాలి.

పజిల్స్‌, సుడోకు లాంటి గేమ్స్‌ ఆడాలి.

మెదడుకు పని పెంచే చదరంగం ఆడొచ్చు.

క్రాస్‌వర్డ్స్‌ మరీ తరచుగా ఆడకూడదు. చకచకా పూరించేసి పెన్ను పక్కన పెట్టేసే క్రాస్‌వర్డ్స్‌ ఆట వల్ల ఫలితం ఉండదు. అరుదుగా ఈ ఆట ఆడాలి.

షాపింగ్‌కి వెళ్లేటప్పుడు సరుకుల లిస్ట్‌ రాసుకున్నా, ఆ లిస్ట్‌ చూడకుండా వాటిని గుర్తుచేసుకునే ప్రయత్నం చేయాలి.
ఆకారాలు, రంగులు మ్యాచ్‌ అయ్యేలా చేయాల్సిన జిగ్‌సా పజిల్స్‌ వల్ల షార్ట్‌ టర్మ్‌ మెమరీ లాస్‌ మెరుగవుతుంది.
రెండు మూడు రకాల ‘కీ’స్‌ వాడే వీలున్న మల్టీటాస్కింగ్‌ వీడియో గేమ్స్‌ ఆడితే కాగ్నటివ్‌ ఫంక్షన్‌ పెరుగుతుంది.

యోగా, మెడిటేషన్‌, వ్యాయామం ఙ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే శారీరక పటుత్వం కూడా బాగుండాలి. వ్యాయామం వల్ల మెదడుకు రక్తప్రసారం పెరిగి చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకోసం ఎలాంటి వ్యాయామ్మానైనా ఎంచుకోవచ్చు. శారీరకంగా అలసటకు గురిచేసే సైక్లింగ్‌, స్కిప్పింగ్‌, ఏరోబిక్స్‌, పరుగు లాంటివి రోజుకి కనీసం 20 నిమిషాలపాటు చేయాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చేసినా ఫలితం ఉంటుంది. ఏకాగ్రత పెరగటం కోసం యోగాను ఆశ్రయించవచ్చు.

శ్రద్ధ లేకపోతే ఏదీ గుర్తుండదు

చేసే పని మీద శ్రద్ధ లేకపోతే ఆ పని సక్రమంగా ఎలా పూర్తవదో దాని జ్ఞాపకం కూడా మెదడులో ముద్ర పడదు. ఇంట్లో నుంచి బయటకెళ్లే ప్రతిసారీ కారు తాళాల కోసం వెతుక్కునేవాళ్లు ఈ కోవలోకే వస్తారు. ఈ మతిమరుపు తిప్పలు తప్పాలంటే ఆ తాళాలు ఎక్కడ పెడుతున్నారో ఆ సమయంలో, ఆ చిన్న పని మీద శ్రద్ధ పెట్టాలి.తాళాలు ఏదైనా సొరుగులో ఉంచేటప్పుడు ‘తాళాలు సొరుగులో పెడుతున్నాను’ అని పైకి చెప్పాలి. మన మెదడులో ఒక సమాచారం జ్ఞాపకంగా నిక్షిప్తమవటానికి కనీసం 8 సెకన్ల సమయం పడుతుంది. ఆ సమయాన్ని మెదడుకు ఇవ్వాలి. కాబట్టి చేసే పని మీద అంత సమయం పాటు శ్రద్ధ పెడితే అది జ్ఞాపకముంటుంది. పైకి చెప్పటం వల్ల జ్ఞాపకం ఉంచుకునే శక్తి రెట్టింపవుతుంది. మతిమరుపుకు మరో శత్రువు ‘ఏమరుపాటు’. ఒకేసారి నాలుగైదు పనులు చేస్తే దాన్లో ఒకటి కచ్చితంగా మర్చిపోతాం. ఫోన్‌ మాట్లాడుతూ కారు దిగి ఇంట్లోకి వచ్చి, టివి ఆన్‌ చేసి రిమోట్‌తో ఛానల్స్‌ మారుస్తూ సోఫాలో కూర్చుండిపోతాం. తర్వాత మళ్లీ బయటికెళ్దామంటే కారు తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తుకురాదు. ఏమరుపాటుతో వచ్చే తిప్పలివి.

సీరియస్‌గా తీసుకోవాలా..?

ప్రతి ఒక్కరికీ ఏదో ఓ సందర్భంలో మతిమరుపు అనుభవంలోకి రావటం సహజం. అయితే ఎలాంటి మతిమరుపును తేలికగా భావించాలి? దేన్ని సీరియ్‌సగా తీసుకోవాలంటే...

పేర్లు మర్చిపోవటం: రెండు, మూడు రోజుల కిందటే కలిసిన వ్యక్తి మళ్లీ ఎదురుపడి పలకరిస్తే అతని పేరు గుర్తుకురాక ఇబ్బంది పడతాం. 45 ఏళ్లు పైబడిన వాళ్లలో ఇది సహజమే! మెదడు నుంచి సమాచారాన్ని రాబట్టుకోగలిగే వేగం, సాంద్రత 45 ఏళ్లు పైబడితే తగ్గుతుంది. అయితే కుటుంబ సభ్యుల పేర్లు కూడా మర్చిపోతూ ఉంటే మాత్రం వైద్యుల్ని కలవాలి.
గదిలోకి దేనికోసం వెళ్లామో మర్చిపోతాం: దేని కోసమో గదిలోకి వెళ్తాం. తీరా అక్కడికెళ్లాక ఎందుకెళ్లామో గుర్తుకురాదు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా జరగటం సహజం. ఇలా మొదటిసారి తల్లయిన వాళ్లకి, కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకి జరగొచ్చు. ఈ మతిమరుపుతోపాటు తరచుగా వస్తువులను పోగొట్టుకుంటూ, ఆ నెపాన్ని ఇతరుల మీద మోపుతుంటే జాగ్రత్త పడాల్సిన సమయమొచ్చిందని అర్థం.

చెప్పిందే చెప్పటం: ఒక్కోసారి చెప్పిన విషయాన్నే అదే వ్యక్తికి మళ్లీ చెప్తూ ఉంటాం. అయితే రెండోసారి చెప్పేటప్పుడు ఆ విషయాన్ని చెప్పినట్టు గుర్తొస్తుంది గానీ ఎవరితో చెప్పామో గుర్తుకురాదు. ఇది సహజం. అయితే ఒకే వ్యక్తితో ఒకే సంభాషణలో చెప్పిందే పదే పదే చెప్తూ, అలా చెప్తున్న విషయాన్ని గ్రహించలేకపోతే మాత్రం సమస్య ఉన్నట్టే. 
Please Leave your Comment below / Ask doubts ?
Share this to your Friends

వేదగణితం

వేదగణితం - ఒక కథ

Vedic Maths
వేదగణితం vedic maths

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!
చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!
రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు.

"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.

మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!
ఒక గడిలో ఒక గింజ -
రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -
మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -
నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -

.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.

ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..

‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..’

‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’

‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.

‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’

‘ఎందుకు..?  ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా !  అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.

‘అలాగా.. ఏమిటా పద్యం..?’

‘ఇదుగో.. వినండి మహారాజా !’

శర శశి షట్క చంద్ర శర
  సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి
    తర్క పయోనిధి పద్మజాస్య కుం    
జర తుహినాంశు సంఖ్యకు ని
 జంబగు తచ్చతురంగ గేహ వి     
స్తర మగు రెట్టికగు
            సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’

‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

 ‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..

ఈ పద్యంలో

శర, సాయక, -  అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.

గగన, వియత్ - 0
(ఆకాశం గగనం శూన్యం)

శశి, చంద్ర, తుహినాంశు -1

(చంద్రుడొకడే భూమికి )

షట్కము - 6

రంధ్ర - 9 

(నవరంధ్రాలు)

నగ, గిరి, భూధర - 7

అగ్ని - 3

(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)

అబ్ధి, పయోనిధి - 4

వేద -4
(చతుర్వేదములు)

తర్క - 6
( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)

పద్మజాస్య - 4

(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)

కుంజర - 8
(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’

శర శశి షట్క చంద్ర శర
5     1     6         1    5
            సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
                  5       9       0         7  3
ధర గగనాబ్ధి వేద గిరి
  7     0  4      4    7
            తర్క పయోనిధి పద్మజాస్య కుం
               6         4           4    
జర తుహినాంశు సంఖ్యకు ని
8       1
            జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -
కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.

1,84,46,74,40,73,70,95,51,615

ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,

4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..

పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.

పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే
సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సంవత్సరాలు..
అదీ సంగతి…

వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు.

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .

ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.

                 
Please Leave your Comment below / Ask doubts ?
Share this to your Friends
.