Pages

Wednesday, October 19, 2016

ఎనిమిది శాతం బాలల్లో దృష్టి లోపం

సవాలుగా మారిన సూపర్‌బగ్‌
రోగకారక క్రిములు గతం కంటే శక్తివంతంగా తయారై క్రిమినాశక ఔషధాలను తట్టుకుని నిలబడగల బ్యాక్టీరి యాను ‘సూపర్‌బగ్‌ అంటారు. బ్యాక్టీరియా కారణం గా వచ్చే వ్యాధులను నయం చేయడానికి యాంటీబయోటిక్స్‌ను వినియోగిస్తుంటారు. ఇటువంటిబ్యాక్టీరియా వృద్ధిచెందకుండా అడ్డు కోగలిగిన ఉనికిని నిర్వీర్యం చేయగలిగిన శక్తి యాంటిబయోటిక్స్‌ కు తగ్గినప్పుడు సూపర్‌ బగ్‌లు తయారవ్ఞతాయి. ప్రతి సంవత్స రం మనదేశంలో సూపర్‌బగ్‌ వల్ల దాదాపు 58వేలమంది పసిపిల్ల లు మృత్యువాతపడుతున్నారు. దేశంలో రోజూ 70వేల మంది శిశువ్ఞలు జన్మిస్తున్నారు. ఈ పసికందులకు వచ్చే 80శాతం అంటు వ్యాధులు శక్తివంతమైన క్రిమినాశక ఔషధాలను కూడా తట్టుకోగ లుగుతాయి. అయితే 2050 నాటికి సూపర్‌ బగ్‌లు కోటి మంది ప్రాణాలను బలిగొంటాయని ఓపరిశీలనలోవెల్లడైంది. అంటే క్యాన్సర్‌ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికంటే సూపర్‌ బగ్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. వైద్యు లు రాసిచ్చిన మందులను పూర్తిగా వాడకుండా మధ్యలోనే అర్థాంత రంగా ఆపేయడం, లేదా డాక్టర్ల వద్దకు వెళ్లకుండా మెడికల్‌ షాపుల వారినడిగి ఏవో మందులు ఇష్టం వచ్చినట్టువాడడం ఇవన్నీ సూపర్‌ బగ్‌లకు కారణాలవ్ఞతున్నాయి. ఫలితంగా వ్యాధి పదేపదే తిరగబెట్ట డం, రోగకారకక్రిములు గతంకంటే శక్తివంతంగా తయారై సూపర్‌ బగ్‌లుగా తయారవ్ఞతుంటాయి. ఈ కారణంగా రోగి వైద్యపరంగానే కాక ఆర్థికపరంగా కూడా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. అంతేకాదు కొన్నేళ్ల పాటు అనారోగ్యంతో సతమతపై చివరకు ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. సూపర్‌బగ్‌లో సులువ్ఞగా జంతువ్ఞల నుంచి మనుషులకు సంక్ర మిస్తుంటాయి.ఆస్పత్రుల్లో రోగనిరోధకవ్యవస్థ చాలా బలహీనంగా ఉండేవారికి గాయాలు,ఆపరేషన్‌ సమయాల్లో చేసిన కత్తిగాట్లు,సెలై న్లు, వెంటిలేటర్ల ద్వారా కూడా ఇవి బయ��                                                 

ఎనిమిది శాతం బాలల్లో దృష్టి లోపం


- బోధన రీతులూ కారణమే
- టివిలు, సెల్‌ ఫోన్లతో చేటు
- స్కూల్‌ హెల్త్‌కు మంగళం
ప్రజాశక్తి-విజయవాడ ప్రతినిధి :
                           సర్వేంధ్రియానం నయనం ప్రధానం.. అన్నారు. వృద్ధులకే కాదు..నేడు వయసుతో సంబంధం లేకుండా అనేక మందికి పిన్న వయసులోనే కంటిచూపు మందగిస్తోంది. కంటి చూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పట్టుమని పదేళ్లు నిండని చిన్నారులూ దృష్టి లోపంతో బాధపడుతున్నారు. ప్రతి వంద మంది పిల్లల్లో ఎనిమిది మందికి దృష్టి లోపం ఉంటోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా 11 నుంచి 14 ఏళ్ల వయసు లోపు వారే కావడం గమనార్హం. ఇందుకు ప్రధానంగా జన్యుపరమైన సమస్య ఒక కారణమైతే, బాలలకు విటమిన్‌-ఎ లోపమూ మరో ముఖ్య కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. చీకటి గదుల్లో విద్యా బోధన, టివి చూడటం, కంప్యూటర్‌, వీడియో గేమ్స్‌, సెల్‌ఫోన్‌ చిత్రాలు చూడటం వంటి కారణాలతో పిల్లల్లో కంటిచూపు తగ్గుతున్నట్లు వారు వెల్లడిస్తున్నారు. కంటిచూపు సమస్యతో బాధపడే వారిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఎక్కువ. తగినంత వెలుతురు, గాలి లేని తరగతి గదుల్లో బోధనే అందుకు కారణం. తరగతి గదుల్లో బ్లాక్‌ బోర్డులే వాడాలి. నల్లని బోర్డుపై చాక్‌పీస్‌తో తెల్లగా రాసే అక్షరాలు దూరం నుంచి కూడా కళ్లపై ఒత్తిడి లేకుండా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ వివిధ ప్రయివేట్‌ పాఠశాలల్లో బ్లాక్‌బోర్డుల స్థానే తెల్ల, పచ్చ తదతర రంగుల బోర్డులు వాడుతున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో ఎక్కువగా తెల్లబోర్డులనే వాడుతున్నారు. ఆ బోర్డులపై మార్కర్లు వాడడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతోందంటున్నారు. ఈతరం పిల్లలకు బడిలో కంప్యూటర్‌ పాఠాలుంటే, ఇంటికొచ్చి టివిలకు, లేదా స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కు పోతున్నారు. పుస్తకాల్లోని అక్షరాలూ చిన్నవిగా ముద్రించడం వల్లా

No comments:

Post a Comment

.