Pages

Monday, January 16, 2017

తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు:: Tourism Places in Telangana



తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు:: Tourism Places in Telangana


తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు:: Tourism Places in Telangana
 కొమ్మాల:-   వరంగల్‌కు 40 కి.మీ. దూరంలో ఉంది. ఈ కొమ్మాల తీర్థం పాండవులు తపస్సు చేసిన ప్రాంతం. ఈ గ్రామంలోని ఒక గుట్టుకు పాండవుల గుట్ట అని పేరు. దీనిపై కోనేరు ఉంది.
లక్నవరం చెరువు:-ములుగు నుంచి ఏటూరు నాగారం వెళ్లే మార్గంలో వరంగల్‌కు 70 కి.మీ. దూరంలో ఈ చెరువు ఉంది.
 రామప్ప చెరువు:-

ఈ చెరువు పాలంపేట రామప్ప ఆలయం దగ్గర్లో ఉంది. కాకతీయ గణపతి దేవుని కాలంలో (1213లో) రేచర్ల రుద్రుడు నిర్మించాడు. కాకతీయ ప్రభువులు ఆలయం సమీపంలోనే చెరువు ఉండాలన్న సంప్రదాయాన్ని పాటించేవారు. అందుకే  రామప్ప చెరువును తవ్వించారు. ఈ చెరువు ప్రాంతంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుంది.

ఘనపురం ఆలయాలు:

పాలంపేటకు 8 కి.మీ. దూరంలో కాకతీయుల కాలానికి చెందిన 22 దేవాలయాలు ఉన్నా యి. ప్రధాన ఆలయం శైవాలయం. రామప్ప దేవాలయం నిర్మాణం జరిగిన కొంతకాలానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. గ్రామం చివర రెడ్డి గుడి అనే దేవాలయం ఉంది.

 ఘనపురం తటాకం

ములుగు తాలూకాలో ఉంది. ఇక్కడ అనపోతుని శాసనం కలదు. ఇక్కడ ఎండాకాలంలో చల్లని నీరు ప్రవహిస్తూ, వర్షాకాలంలో నీరు ప్రవహించదు.

 కొమరవెల్లి

జనగామకు 13 కి.మీ. దూరంలో వీరశైవ మతకేంద్రం ఉంది. ఇక్కడ మట్టితో చేసిన 4 అడుగుల విగ్రహం ఉంది. 4 చేతులలో త్రిశూలం, నాగాస్త్రం, ఒక పాత్ర ఉన్నాయి. ఇక్కడి ప్రధాన దైవ కొమరెల్లి మల్లన్న.

 పాకాల చెరువు

ఈ చెరువు విహార సరస్సు. దీని నుంచి 5 పంట కాలువలు కలవు. వరంగల్‌కు 70 కి.మీ దూరంలో పచ్చటి చెట్లు పెరిగిన గుట్టల మధ్య ఈ చెరువు ఉంది. కాకతీయ గణపతి దేవుడు ఈ చెరువును తవ్వించినట్టు చెబుతారు. పాకాల చెరువు చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకాల వన్యమృగ అభయారణ్యం ఉంది. శీతాకాలంలో వలస వచ్చే పక్షులతో పాటు పెద్ద పులులు, చిరుతలు, జింకలు కూడా అందులో ఉన్నాయి. మున్నేరు వాగు ఈ సరస్సుకు ఆధారం.

 పెంబర్తి
:కాకతీయులు తమ రథాలను, ఆలయాలను అలంకరించుకోవడానికి దళసరి రేకును విరివిగా ఉపయోగించేవారు. ఈ అలంకరణ అనేది ఒక కళ. కాకతీయ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఈ కళ పతనమైంది. అయితే నిజాం నవాబుల కాలంలో ఈ కళను పునరుద్ధరించారు. వరంగల్‌కు 60 కి.మీ. దూరంలోని పెంబర్తి కళాభిమానులు తప్పక సందర్శించే ప్రాంతం.

 ఏటూరి నాగారం

వరంగల్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో, గోదావరి తీరాన అభయారణ్యం ఉంది. అందులో తేళ్లు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయి. చుట్టూ చిన్నచిన్న గుట్టలతో, పచ్చని చిట్టడవులతో ఈ అభయారణ్యాన్ని చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. ఏటూరి నాగారం సమీపంలోని తాడ్వాయ్‌లోనూ అటవీశాఖ కాటేజీలను నిర్వహిస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అక్టోబర్-మే నెలల మధ్యకాలం అనువైనది.

తాటికొండ

: ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు 7 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ రెండు కోటలు ఉన్నాయి. దీన్ని సర్దార్ సర్వాయి పాపన్న కట్టించాడని ప్రతీతి.

 పాలకుర్తి

 ఈ గ్రామం ఘనపురం రైల్వే స్టేషన్ నుంచి 29 కి.మీ. దూరంలో ఉంది. పాలేరు............. వాగు ఇక్కడి నుంచే పుడుతుంది. అందుకే పాలకుర్తి అనే పేరు వచ్చింది. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం ఉంది. దీనికి సోమనాథాలయం అనే పేరు వచ్చింది. వీరశైవ మతవాది అయిన కవి పాలకుర్తి సోమనాథుడు

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం - వేములవాడ:*

కరీంనగర్‌కు 35 కి.మీ. దూరంలో కలదు. ఇక్కడ ధర్మ కుండం అనే కోనేరు ఉంది. వేములవాడ చాళుక్యరాజు రాజాధిత్యుడు ఈ ఆలయ నిర్మాత. అర్జునుడి మనుమడు నరేంద్రుడు నిర్మించాడనేది స్థల పురాణం. ఈ ఆలయంలో 22 శివ లింగాలున్నాయి. అందులో రామాలయం, మహిషాసురమర్దని ఆలయం, కాశీ విశ్వనాథాలయం చూడదగినవి.

 కాళేశ్వరం

: గోదావరి ఉపనది కాళేశ్వరం కలిసేచోట ఉంది. స్కాంద పురాణంలో దీని ప్రస్తావన కలదు. ఇక్కడి శిల్పాలపై బౌద్ద-జైన శిల్ప రీతుల ప్రభావం కనిపిస్తుంది. వేంగిరాజు విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్ని జయించినట్లు ఆధారాలున్నాయి. ఆయన దండయాత్ర నాటికి నగరంలో 26 కోనేరులు ఉండేవట. కాకతీయ ప్రోలరాజు బంగారంతో తులాభారం తూగి, దాన్ని స్వామికి ఇచ్చాడని స్థానికుల అభిప్రాయం. ఇక్కడి ముక్తేశ్వరాలయంలో 2 శివలింగాలుండటం విశేషం. ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలుండటం మరో విశేషం. ఇక్కడ బ్రహ్మకు గుడికట్టారు. 1246 నాటి కాకతీయ గణపతి దేవుని శాసనం ఇక్కడుంది.

 ధర్మపురి:

 కరీంనగర్‌కు 65 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని 108 పుణ్యక్షేత్రాల్లో ధర్మపురి ఒకటి. దీనికి దక్షిణ కాశీ అని పేరు.

రామగిరి దుర్గం:

 కరీంనగర్‌కు 40 కి.మీ. దూరంలో బేగంపేట గ్రామం వద్ద ఉన్న ఎత్తైన పర్వతాన్ని రామగిరి అంటారు. 
తెలంగాణలోనే అతిపెద్ద శత్రుదుర్భేద్యమైన కోట ఇక్కడ ఉంది. ఇక్కడి సీతారామాలయం దగ్గర్లో పాండవ లంక ఉంది.

నాగనూరు కోట:

 ఇది కాకతీయుల నిర్మాణం. కరీంనగర్‌కు 8 కి.మీ. దూరంలో ఉంది. కోటలో 3 ఆలయాలు ఉన్నాయి.

 వరాహస్వామి ఆలయం 

కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండేరెండు వరాహస్వామి ఆలయాల్లో ఇది ఒకటి. బండపై చెక్కిన విగ్రహం వెంట్రుకలు కనిపించడం విశేషం. స్థల పురాణం ప్రకారం 600 సంవత్సరాల చరిత్ర ఉంది. 
కరీంనగర్‌కు 60 కి.మీ. దూరంలో ఉంది.

 కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం

: 400ల ఏండ్ల క్రితం కొడిమ్యాల పర్గణాలో సింగం సంజీవుడనే యాదవ కులస్థుడు స్థాపించాడు. ఇక్కడి విగ్రహం రెండు ముఖాలతో (నారసింహస్వామి ముఖం, ఆంజనేయస్వామి ముఖం) ఉండటం విశేషం.

 కొత్తకొండ కోర మీసాల స్వామి:

భీమదేవరపల్లి మండలం, కొత్తకొండలో ఉంది. ఇది ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధమైన వీరభద్ర క్షేత్రం.

 మత్స్యగిరీంద్రుడు:

 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో మత్స్య గిరీంద్రుని ఆలయాన్ని నిర్మించారు. ఇది కరీంనగర్‌కు 30 కి.మీ. దూరంలో ఉంది.

 మంథని:

 మంథని అంటే వేద విద్యలకు పుట్టినిల్లు. ఇక్కడ లక్ష్మీనారాయణ, ఓంకారేశ్వర, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలతోపాటు జైన, బౌద్ద మతాల ఆలయాలు ఉన్నాయి.

 బాసర:

బాసరలో జ్ఞాన సరస్వతీ దేవాలయం ఉంది. బాసరను వ్యాసపురి అని కూడా అంటారు. ఇది గోదావరి తీరంలో ఉంది.

 బాసరకు పేరు

 - వ్యాసుడు తపస్సు చేసి సరస్వతీదేవిని ప్రతిష్టించినందుకు వ్యాసర అనే పేరు వచ్చింది. వ్యాసర క్రమంగా బాసర అయింది. బాసర ఆలయం దేశంలోనే రెండో అతిపెద్ద సరస్వతి దేవాలయం (మొదటిది జమ్ముకశ్మీర్‌లో ఉంది.).

నాగోబా ఆలయం

: ముట్నూరుకు దగ్గరలో కేస్లాపూర్ గ్రామంలో ఉంది. నాగోబా అంటే సర్ప దేవత. వేలమంది గిరిజనులు నాగుల చవితి సందర్భంలో ఇక్కడ మహా ఉత్సవం చేస్తారు.

 అగస్త్యేశ్వరాలయం

: గోదావరి తీరంలో అగస్త్యుడు తపస్సు చేసిన ప్రాంతం. చెన్నూరులో ఉన్న ఈ ఆలయాన్ని ఉత్తర వాహిని అంటారు. ఇది అతి ప్రాచీన ఆలయం. 1289లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్‌నిర్మించాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ ఈ ఆలయంపై దాడిచేసి ధ్వంసం చేశాడు. శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా ఇక్కడి తెలుగు కన్నడ భాషా లిపిలో ఉన్న శాసనం చెబుతుంది. ఇక్కడ గోదావరి నది ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఈ ఆలయంలోని అఖండ జ్యోతి 400 ఏండ్లుగా వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతారు.

 జైనాద్ ఆలయం

ఆదిలాబాద్‌కు 21 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పల్లవ రాజులు పాలించారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం జైన మందిరాన్ని పోలి ఉంది.

 సిరిచెల్మ సోమేశ్వరాలయం:

 ఇచ్చోడకు 14 కి.మీ. దూరం లో ఉంది. 7వ శతాబ్దానికి చెందిన సోమేశ్వరాలయంలో శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మత శిల్ప సంపద కలదు. ఇక్కడ శ్రీ కృష్ణ దేవరాయలు భార్యతో కలిసి అర్చన చేసినట్లుగా శాసనాధారం.

 నిర్మల్:

 దీని చుట్టూ దుర్గం కలదు. పూర్వం వెలమ రాజుల పాలనలో ఉండేది. ఇక్కడ మహదేవ మందిరం ఉంది.

 కన్విట్ తాలూకాలోని మహుర గొప్ప చారిత్రక స్థలం

. ఇక్కడ ప్రాచీన రేణుకాదేవి మందిరం ఉంది. ఈమెను ఏకవీరాదేవి అంటారు.


ఇతర చూడదగిన ప్రాంతాలు:

1. రామకృష్ణాపురంలోని గాంధర్వ కొండ, పోచమ్మ ఆలయం,

2. కుంటాలలోని సోమేశ్వరాలయం,

3. సిరిసిల్లలోని వేంకటేశ్వరాలయం,

4. బెల్లంపల్లిలోని బుగ్గరామేశ్వరాలయం, నిర్మల్‌లోని మహదేవాలయం.

 ఏడు జలపాతాలు: 

బోధ్ నియోజకవర్గంలో 15 కి.మీ. పరిధిలో 7 జలపాతాలు కలవు. అవి:1. కుంటల 2. పొచ్చెర 3. లఖంపూర్ 4. గాజిలి 5. పొచ్చెల పాలధార 6. ఘన్‌పూర్ జలపాతం 7. కనకాయి జలపాతం........

 జమలాపురం

(తెలంగాణ తిరుపతి): ఇది ఎర్రుపాలెం (మం)లో ఉంది. వేంకటేశ్వరస్వామి దేవాలయం సూదిబోడపై కలదు. స్థల పురాణం ప్రకారం ఇక్కడి రెండు గుహలలో ఒకటైన వైకుంఠ గుహలో జాబాలి మహర్షి తన శిష్యులకు వేదం నేర్పాడని కథనం. మరొక గుహ పేరు కైలాస గుహ. ఈ దేవాలయాన్ని కాకతీయుల కాలంలో కట్టిఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం.

 శ్రీ బాలజీ
 వేంకటేశ్వరస్వామి: అన్నపురెడ్డిపల్లిలో ఉంది. ఇది ఖమ్మం జిల్లాలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. అన్నపు రెడ్డి అనే కాకతీయ సేనాపతి నిర్మించిన ఆలయాన్ని 1870లో వెంకటప్పయ్య పునర్‌నిర్మించాడు. మీర్ మహబూబ్ అలీఖాన్ అనే సుల్తాన్ పాలనా కాలంలో కాళ్లూరి వెంకటప్పయ్య మైసూరు ప్రాంతం నుంచి వలస వచ్చి దేవాలయాన్ని నిలబెట్టాడు.

నీలాద్రి ఆలయం:

 దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇది 1996 -97 సంవత్సరాల మధ్య దట్టమైన అడవుల నుంచి బయటపడింది. ఇక్కడ శివరాత్రి ఉత్సవం బాగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న జెండా గుట్ట కాకతీయుల విజయాన్ని తెలుపుతుంది.

 రామాలయం

(వనం కృష్ణాలయం): ముదిగొండ (మం) వనం కృష్ణరాయలు కట్టించినందున ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది.

 కూసుమంచి శివాలయం:

 ఇది కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయం చుట్టూ నిర్మించిన కళా ఖండాలు రమణీయమైనవి.             

Tuesday, January 10, 2017

ఎవరు పడితే వారు మీ ఆధార్ కార్డు వివరాలను తీసుకునేందుకు వీలుండదు



ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయండిలా.
   

ఒకప్పుడంటే కేవలం వంట గ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్ కార్డును తీసుకున్నారు. కానీ దాంతో ఇప్పుడు అనేక ఉపయోగాలు ఉన్నాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలు ఆధార్ కార్డుల ద్వారానే వినియోగదారులను గుర్తించి సేవలు అందిస్తున్నాయి. ప్రజల ఆధార్ కార్డులు ఆన్‌లైన్ డేటాబేస్‌లో ఉంచడం వల్లే వాటితో అనేక పనులను చేసుకోవడం సాధ్యమవుతోంది.

🌍ఈ క్రమంలో ఆన్‌లైన్ డేటాబేస్‌లో ఉన్న మన ఆధార్ కార్డ్ వివరాలను, బయోమెట్రిక్ డేటాను ఎవరు పడితే వారు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే... అందుకు కింద చెప్పిన స్టెప్స్ పాటించాలి.

1. ముందుగా HTTPS://UIDAI.GOV.IN/BETA/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో కింద ఉండే ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో LOCK/UNLOCK BIOMETRICS అనే ఆప్షన్ దర్శనమిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.

2. తరువాత వచ్చే విండోలో వినియోగదారులు తమ 12 అంకెల ఆధార్ నంబర్‌ను, కింద ఉండే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ బటన్‌ను ప్రెస్ చేయాలి.

3. మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడే కింద ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.

4. అనంతరం మరో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో కూడా ముందు లాగే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి అనంతరం కిందే ఉండే ENABLE అనే బటన్‌ను ప్రెస్ చేయాలి.

🔹అంతే, మీ ఆధార్ నంబర్‌కు చెందిన బయోమెట్రిక్ డేటా లాక్ అవుతుంది. దీంతో ఎవరు పడితే వారు మీ ఆధార్ కార్డు వివరాలను తీసుకునేందుకు వీలుండదు. దీంతో ఐడెంటిటీ థెఫ్ట్ వంటి సైబర్ క్రైంల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.   

Thursday, January 5, 2017

పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

 ప్రశ్న: పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?


జవాబు: పిడుగు అనేది రెండు వేర్వేరు ధ్రువత్వం గల విద్యుదావేశాలతో నిండుకున్న మేఘాల మధ్య జరిగే విద్యుదుత్సర్గం. ఒక వేళ ఒక మేఘానికి దగ్గర్లో మరో మేఘం లేనట్లయితే మేఘంలో ఏ ధ్రువత్వం గల విద్యుదావేశం పోగు పడిందన్న విషయంలో సంబంధం లేకుండా ఆ స్థిర విద్యుత్తు భూమి వైపు ప్రసరిస్తుంది. ఆ సమయంలో మేఘానికి దగ్గరగా ఎవరున్నా (చెట్లు, భవనం, విద్యుత్సంభం, వ్యవసాయదారుడు లేదా దారిన పోయే దానయ్య, పశువు) వారు విద్యుత్ప్రవాహి అయినట్లయితే వారి గుండా ఈ అధిక విద్యుత్తు ప్రవహించి మరణానికి దారి తీస్తుంది.

ఈ విపత్పరిణామాన్నే మనం పిడుగు పాటు అంటాం. పిడుగు పడే సమయంలో విద్యుత్తు ఉన్న మేఘానికి, భూమికి మధ్య కొన్ని లక్షల వోల్టుల విద్యుత్తు పొటన్షియల్‌ ఉంటుంది. ఈ విద్యుదుత్సర్గం లిప్తపాటు మాత్రమే ఉంటుంది. అదే పనిగా గంటల తరబడి కొనసాగదు. అంత తక్కువ వ్యవధిలో అంత అధిక మోతాదులో ఉన్న విద్యుత్తును నిల్వ చేయగల పరికరాలు, సాధనాలు లేవు. ప్రవహించే విద్యుత్తును దాచుకొని ఆ తర్వాత వాడుకోగలిగిన వ్యవస్థలు భౌతికంగా కెపాసిటర్లు, రసాయనికంగా ఛార్జబుల్‌ బ్యాటరీలు మాత్రమే! కానీ పిడుగు పడే సమయంలో వాటిని పిడుగు మార్గంలో ఉంచితే అవి కాలిపోవడం మినహా విద్యుత్తు నిల్వ ఉండటం దాదాపు అసంభవం.                       

E-Filling of Income Tax in Telugu

E-Filling of Income Tax in Telugu


ఆదాయం 2,50,000/- లు కన్నా ఎక్కువ గా ఉన్న వారు జూలై 31 లోగా రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది. ఫిబ్రవరి లో సమర్పించిన ఫారం--16 ఆధారం గా రిటర్న్ దాఖలు చేయాలి.

ఆన్ లైన్ ద్వారా ఇ--రిటర్న్ సులభం గా దాఖలు చేయవచ్చు.

💖పేరు రిజిస్టర్ చేసుకొనుట✍�

 www.incometaxindiaefiling. gov.in వెబ్సైటు లోకి ప్రవేశించి register your self అను ఆప్షన్ ఎంచు కోవాలి.దానిలో passward తదితర వివరాలు పూర్తి చేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తరువాత మొబైల్ కు వచ్చిన పిన్ నంబర్ ని నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే.మీ passward జాగ్రత గా ఉంచు కోవాలి.

 💖ఫారం--26 AS ✍�

ఇ--ఫైలింగ్ చేసేందుకు ఫారం--26 AS ను పరిశీలించుకోవాలి.పైన తెలిపిన వెబ్సైట్ లోకి ప్రవేశించిన తదుపరి view form 26 AS ని ఎంచు కోవాలి.దానిలో యూజర్ ఐడీ అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవటం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ ఇయర్ మనం చెల్లించిన పన్ను సక్రమం గా నమోదు ఐనదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు.ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ--రిటర్న్ చేయాలి.

💖 ఫారం--26 AS లో నమోదు ల పరిశీలన✍�

ఫారం--26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమం గా నమోదు కానట్లఇతే DDO కు తెలియజేయాలి. తప్పులను సరచేయ వలసిన భాద్యత DDO లదే.

💖ఇ--ఫైలింగ్ చేయటం✍�

ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమం గా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ--ఫైలింగ్ చేయటం ప్రారంభించాలి.
Incometaxindiaefiling.gov.in వెబ్సైట్ లోకి ప్రవేశించిన తరువాత Quick e file ITR--I & ITR--4S ఎంపిక చేసుకోవాలి.
పాన్ నంబర్, passward, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.వెంటనే ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి.అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR--1) అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి.తరువాత ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1.పాన్ ఆధారంగా 2.గతం లో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3.నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.
తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు,పన్ను వివరాలు,పన్ను చెల్లింపు వివరాలు,80జి వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి(వీటిని సేవ్ కూడా చేసుకోవచ్చు).26 AS లో నమోదు ఐన పన్ను, ఇ--ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి.లేనట్లయితే నోటీసులు ఇస్తారు.

💖ఎకనాలెఢ్జెమెంట్✍�

ITR--1 సబ్మిట్ చేసిన తరువాత ఎకనాలెఢ్జెమెంట్ ఆప్షన్స్ వస్తాయి. దానిలో NO CVC అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని తదుపరి వచ్చిన ఆప్షన్స్ లో Mobile OTP ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మన ఫోన్ కి, మెయిల్ కి OTP వస్తుంది.ఆ passward ను నమోదు చేస్తే ఎకనాలెఢ్జెమెంట్ మన మెయిల్ కు వస్తుంది.దాని నుండి ఎకనాలెఢ్జెమెంట్ డౌన్ లోడ్ చేసుకొని భద్రపరచుకోవాలి.దీనిని CPC బెంగుళూరు కు పంప వలసినదీ?? లేనిదీ?? దీని కింది భాగంలో లోనే రాశి ఉంటుంది.పంపాలి అని రాసి ఉంటే, 3 నెలల లోపు పంపాలి.

భోజ‌నానికి ముందు ఈ పండు తింటే, అనారోగ్యాలు హుష్ కాకి!

భోజ‌నానికి ముందు ఈ పండు తింటే, అనారోగ్యాలు హుష్ కాకి!



ఎండ‌బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చిన అంజీర్ పండ్లు మార్కెట్‌లో మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. వీటిని అంద‌రూ చూసే ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ రూపంలో దొరికే అంజీర్ పండ్లే కాదు, సాధార‌ణ పండు రూపంలోనూ అంజీర్‌ను తింటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ పండును రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో అనేక అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది మ‌నం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ బాగా ప‌నిచేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బద్ద‌కం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి.

2. అంజీర్‌లో పొటాషియం, సోడియం బాగా ల‌భిస్తాయి. ఇవి ర‌క్త‌పోటు (బీపీ) స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనాన్ని క‌లిగిస్తాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.

3. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నేడు చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు నిత్యం రెండు అంజీర్ పండ్ల‌ను భోజనానికి ముందు తిన్న‌ట్ట‌యితే వారిలో ర‌క్తం బాగా ప‌డుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి విష జ్వ‌రాల బారిన ప‌డి ప్లేట్‌లెట్లు త‌గ్గిన వారికి ఈ పండ్ల‌ను తినిపిస్తే వెంట‌నే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

4. అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఇప్పుడు అధిక‌మైంది. ఈ క్ర‌మంలో అంజీర్ పండ్ల‌ను రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావ‌న క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఎక్కువ‌గా ఆహారం తీసుకోవ‌డం త‌గ్గుతుంది. ఫ‌లితంగా బ‌రువు కూడా త‌గ్గుతారు. అంతేకాదు అంజీర్‌లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా త‌గ్గిస్తాయి.

5. నిత్యం అంజీర్ పండ్ల‌ను తింటుంటే గుండె సంబంధ స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అంజీర్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ అనే ప‌దార్థం శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొల‌గిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.

6. అంజీర్ పండ్ల‌లో మెగ్నిషియం, మాంగ‌నీస్‌, జింక్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాల‌నుకునే వారికి మేలు చేస్తాయి.

7. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే ప‌దార్థాలు నాశన‌మ‌వుతాయి.

8. అంజీర్ పండ్లు మ‌ధుమేహం ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంత‌రం ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు.

9. ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

10. అంజీర్ పండ్ల‌లో కాల్షియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢ‌మ‌వుతాయి. ఎముక‌లు విరిగి ఉన్న వారికి వీటిని పెడితే ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

11. గొంతు నొప్పి ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ద‌గ్గు కూడా త‌గ్గుతుంది.

12. జ్వ‌రం, చెవి నొప్పి, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఉంటే అంజీర్ పండ్ల‌ను తినాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది  


ఒత్తిడి వల్ల కంగారూ, ఆందోళన, తలనొప్పి వంటివే కాదు.. జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. బరువు నియంత్రణలో ఉండదు. దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులూ తప్పకపోవచ్చు. అందుకే ఎప్పటిప్పుడు ఒత్తిడిని అదుపులో ఉంచేలా చూసుకోవాలి.

 మొదట ఒత్తిడికి కారణమయ్యే అంశాలను ఓ చోట రాసుకోవాలి. వాటిని ఓ క్రమపద్ధతిలో తగ్గించుకుంటూ వెళ్లాలి.

 ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు మనం ఆరోగ్యంతో ఉండాలి. అంటే మానసికంగా, శారీరకంగా. అందుకోసం మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకుని దాన్నొక అలవాటుగా చేసుకోండి.

 ధ్యానం ఎలాంటి ఒత్తిడినైనా తగ్గిస్తుంది. రోజులో ఓ పదినిమిషాలు ఇందుకోసం కేటాయించండి.

 మీరు తీసుకునే సమతుల ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది. దాంతో మీకు ఎదురయ్యే ఏ రకం ఒత్తిడినైనా సమర్ధంగా ఎదుర్కోగలరు.

 కలతలు లేని నిద్ర మీ శరీరానికి, మెదడుకు ఆరోగ్యాన్నిస్తుంది. మనసుకీ హాయిగా అనిపిస్తుంది. అందుకే బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు హాయిగా నిద్రపోయేలా చూసుకోవాలి.

 మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగ్గిపోయినట్లు అనిపిస్తాయి. కాబట్టి అన్నివేళలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే సరదాగా మాట్లాడేవారితో గడిపినా కూడా ప్రయోజనం ఉంటుంది.

 తోటపని చేయడం, లేదా మొక్కల మధ్య గడపడం వల్ల కూడా ఒత్తిడి సులువుగా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Wednesday, January 4, 2017

APPSC Panchayat Secretary Exam Syllabus







GROUP-3 NEW SYLLABUS - (PANCHAYATH SECRETARY)

🔲గ్రూప్‌-3కి కొత్త సిలబస్‌
ఖరారు చేసిన ఏపీపీఎస్సీ1,054 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి):

గ్రూప్‌-3 సర్వీసె్‌సకు (పంచాయతీ కార్యదర్శులు) కొత్త సిలబ్‌సను ఏపీపీఎస్సీ శుక్రవారం ఖరారు చేసింది.

 స్ర్కీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌కు ఒకే సిలబస్‌ ఉంటుంది.

 అయితే స్ర్కీనింగ్‌ టెస్ట్‌తో పోలిస్తే మెయిన్స్‌ సిలబస్‌ మరింత విపులంగా, విస్తృత స్థాయిలో ఉంటుంది.

 www.psc.ap.gov.in వెబ్‌సైట్లో కొత్త సిలబస్‌ అందుబాటులో ఉంది.

స్ర్కీనింగ్‌ టెస్ట్‌ సిలబ్‌సలో

కరెంట్‌ అఫైర్స్‌,
బేసిక్‌ జనరల్‌ సైన్స్‌,
ఆధునిక భారత దేశ చరిత్ర,
భారతలో ఆర్థికాభివృద్ధి,
భారత రాజ్యాంగం,
ఏపీ పునర్విభజన-పరిణామాలు,
భారతలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ,
ఏపీ పంచాయతీరాజ్‌ వ్యవస్థ,
ఏపీ పంచాయితీరాజ్‌ అభివృద్ధి పథకాలు,
రూరల్‌ ఎకానమీ ఆఫ్‌ ఏపీ,
రూరల్‌ క్రెడిట్‌ సినారియో ఆఫ్‌ ఏపీ, మహిళాసాధికారత, ఆర్థిక పురోభివృద్ధి,
లాజికల్‌ రీజనింగ్‌,
ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
తదితర 13 అంశాలు ఉన్నాయి.

మెయిన్స్‌ సిలబ్‌సను రెండు పేపర్లుగా విభజించారు.

 పేపర్‌-1లో
జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీపై ప్రశ్నలు ఉంటాయి.

పేపర్‌-2లో
గ్రామీణాభివృద్ధిపై, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై ప్రశ్నలు ఉంటాయి.

 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది.

మెయిన్‌ పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌గా 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.

 మొత్తం మీద స్ర్కీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు, మెయిన్స్‌ 300 మార్కులకు నిర్వహిస్తారు.

ఈ కొత్త సిలబ్‌సతోనే 1,054 పంచాయితీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

ఏదేని డిగ్రీ కలిగిన వారికి అర్హత ఉంటుంది.

ఈ ఏడాది జూలై 1 నాటికి 42 సంవత్సరాలకు మించని వారందరూ అర్హులే.
[28/12, 9:39 PM] Thamasari: ఏపీపీఎస్సీ  గ్రూప్‌ - II  స్క్రీనింగ్ టెస్ట్          150 Marks    



ఎ) కరెంట్ అఫైర్స్ - రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక, పాలనా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు.

బి) భారత రాజ్యాంగ సమాఖ్య విధానం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వాలు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర - రాష్ట్ర చట్టసభలు, కేంద్ర - రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్టపరమైన సంబంధాలు, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల పరిపాలనా తీరు.

సి) భారత ఆర్థికాభివృద్ధి - మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ, స్వాంతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు, భారతదేశంలో వ్యవసాయం, హరిత విప్లవం ప్రాధాన్యం, జనాభా, ప్రాంతాల వారీగా ఆర్థిక వ్యత్యాసాలు.

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 1 > జనరల్‌ స్టడీస్‌        150 Marks

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
3. శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి; దైనందిన జీవితంలో సామన్యశాస్త్రం వినియోగం.
4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధునిక భారతదేశ చరిత్ర
5. భారత రాజకీయ వ్యవస్థ, పాలనః రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు
6. భారత స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి
7. భారత ఉపఖండం - భౌతిక భూగోళశాస్త్రం
8..విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా
9. సుస్థిర అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌
10. లాజిక‌ల్ రీజ‌నింగ్‌, అన‌లిటిక‌ల్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్‌
11. దత్తాంశ విశ్లేషణ (ఎ) ట్యాబులేషన్‌ ఆఫ్‌ డేటా (బి) విజువల్‌ రిప్రజంటేషన్‌ ఆఫ్‌ డేటా (సి) బేసిక్‌ డేటా విశ్లేషణ.

12. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో
ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదురయ్యే స‌వాళ్లు, దానివల్ల కలిగే ఆర్థిక పరమైన చిక్కులు
బి) ఉమ్మడి సంస్థల పంపకం, పున‌ర్నిర్మాణం
సి) ఉద్యోగుల పంప‌కం, వారి పున:స్థాపన, స్థానిక‌త స‌మ‌స్యలు
డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం
ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన చిక్కులు
ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు
జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, జ‌నాభా అంశాలపై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన సమస్యలపై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్ వ్యవస్థీకరణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధనల్లో ఏకపక్ష ధోరణులు

 ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 2 > సెక్షన్‌ - 1 >

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర     75 Marks



1. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితులు - చరిత్ర దాని ప్రభావం. శాతవాహనులు- సామాజిక, ఆర్థిక, మత నిర్మాణం, సాహిత్య సేవ, వాస్తు, శిల్పం. వేంగి తూర్పు చాళుక్యులు - సామాజిక, సాంస్కృతిక సేవ - తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధి.

2. క్రీ.శ. 11 - 16 శతాబ్దాల మధ్య ఆంధ్ర దేశంలో సామాజిక, సాంస్కృతిక, మ‌త‌ప‌ర‌మైన‌ స్థితిగతులు; తెలుగు భాష, సాహిత్యం, వాస్తు, చిత్రలేఖనం అభివృద్ధి. ఆంధ్ర చ‌రిత్ర, సాంస్కృతిక రంగాలకు కుతుబ్‌షాహీల సేవ

3. యూరోపియన్ల రాక - వాణిజ్య వ్యాపార కేంద్రాలు - కంపెనీ పాలనలో ఆంధ్ర. - 1857 తిరుగుబాటు - ఆంధ్రలో బ్రిటిష్‌ పాలనపై ప్రభావం - సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్‌ పార్టీ/ ఆత్మగౌరవ ఉద్యమాలు. 1885 - 1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ పరిణామం - సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర - జమీందారీ వ్యతిరేక, కిసాన్‌ ఉద్యమాలు. జాతీయవాద కవిత్వం.

4. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి - ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు. ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర..

5. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన సంఘటనలు - విశాలంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం, దాని సిఫార్సులు - పెద్ద మనుషుల ఒప్పందం - 1956 నుంచి 2014 మధ్యలో ప్రధాన సాంఘిక, సంస్కృతిక, సంఘటనలు.

6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న - ప‌రిపాల‌న‌, ఆర్థిక‌, సాంఘిక‌, సాంస్కృతిక‌, రాజకీయ‌, న్యాయ సంబంధిత చిక్కులు/ స‌మ‌స్యలు. వాటిలో
ఎ) రాజ‌ధానిని కోల్పోవ‌డం - కొత్త రాజ‌ధాని నిర్మాణంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, దానివల్ల క‌లిగే ఆర్థికప‌ర‌మైన చిక్కుళ్లు
బి) ఉమ్మడి ఆస్తుల పంప‌కం, పున‌ర్నిర్మాణం
సి) ఉద్యోగుల పంప‌కం, వారి పునఃస్థాప‌న, స్థానిక‌త స‌మ‌స్యలు
డి) వాణిజ్యం, పారిశ్రామిక‌వేత్తల‌పై విభ‌జ‌న ప్రభావం
ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించిన చిక్కులు
ఎఫ్‌) రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు
 జి) సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, జ‌నాభా అంశాల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
హెచ్‌) న‌దీ జ‌లాల పంప‌కం, వాటి ప‌ర్యవ‌సాన స‌మ‌స్యల‌పై రాష్ట్ర విభ‌జ‌న ప్రభావం
ఐ) ఆంధ్రప్రదేశ్ పున‌ర్‌వ్యవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం - 2014, కొన్ని నిబంధ‌న‌ల్లో ఏక‌ప‌క్ష ధోర‌ణులు.



ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > పేపర్ - 2 > సెక్షన్‌ - 2 >

భారత రాజ్యాంగం - విహంగ వీక్షణం     75 Marks



1. భారత రాజ్యాంగ స్వభావం - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.

2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక, న్యాయ నిర్వాహక - శాసన నిర్వాహక రకాలు - ఏక శాసనసభ, ద్విశాసనసభ - కార్యనిర్వాహక - పార్లమెంటరీ తరహా, న్యాయనిర్వహణ - న్యాయసమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.

3. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన నిర్వాహక, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు - రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు - యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, కాగ్‌.

4. కేంద్ర రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల అవసరం - రాజ్‌మన్నార్‌ కమిటీ, సర్కారియా కమిషన్‌, ఎం.ఎం. పూంచీ కమిషన్‌, నీతి ఆయోగ్ - భారత రాజ్యాంగ కేంద్ర, సమాఖ్య లక్షణాలు.

5. రాజ్యాంగ సవరణ విధానం - కేంద్రీకరణ వర్సెస్‌ వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్‌రాయ్‌ మెహతా, అశోక్‌మెహతా కమిటీలు - 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.

6. భారత రాజ్యాంగ పార్టీలు - జాతీయం, ప్రాంతీయం - ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు - ప్రాంతీయ తత్వం, ఉప ప్రాంతీయ తత్వం - కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ - జాతీయ సమైక్యత - భారత ఐక్యతకు ముప్పు/ సవాళ్లు. శ్రీకృష్ణ కమిటీ.

7. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రొవిజన్స్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం - జాతీయ రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్‌, జాతీయ, రాష్ట్రీయ మైనారిటీ కమిషన్స్ - మానవ హక్కుల కమిషన్ - సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్‌, లోకాయుక్త.

 ఏపీపీఎస్సీ > గ్రూప్‌-III > పేపర్ - 3 > సెక్షన్‌ - 1

 భారత ప్రణాళికా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ     75 Marks

భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ: పంచవర్ష ప్రణాళికల సామాజిక, ఆర్థిక లక్ష్యాలు - కేటాయింపులు - ప్రత్యామ్నాయ వ్యూహాలు - లక్ష్యాలు, విజయాలు - వివిధ ప్రణాళికల వైఫల్యానికి కారణాలు - 1991 నూతన ఆర్థిక సంస్కరణలు - సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ). ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, నియంత్రణ సంస్థల ఏర్పాటు.

భారత ఆర్థిక విధానాలు: వ్యవసాయ విధానాలు - 1986 నుంచి పారిశ్రామిక విధానాలు - ఐటీ పరిశ్రమలు - ఆర్‌బీఐ అసమతుల్యత, ద్రవ్యలోటు - నూతన విదేశీ వాణిజ్య విధానం. కరెంట్‌ అకౌంట్‌ అసమానతలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
సహజ వనరుల లభ్యత - అభివృద్ధి: జనాభా - పరిమాణం, కూర్పు, పెరుగుదల - ధోరణులు, వృత్తిపరమైన శ్రామిక విభజన - మానవాభివృద్ధి సూచీ. డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌.

ద్రవ్యం బ్యాంకింగ్‌, ప్రభుత్వ విత్తం: ద్రవ్య భావన, ద్రవ్య సరఫరా చర్యలు - బ్యాంకులు, పరపతి సృష్టి కారకాలు, పరిష్కారాలు - పన్ను, పన్నేతర ఆదాయం.

వృద్ధి వివరణ - మాపనాలు: వృద్ధి, అభివృద్ధి, అల్పాభివృద్ధి - అల్పాభివృద్ధి లక్షణాలు - అభివృద్ధి దశలు - మూలధన సమీకరణ వనరులు - వృద్ధి వ్యూహం - అభివృద్ధి -ఎదుగుదల మధ్య తేడా, ఎదుగుదల మాపనం. డీరెగ్యులేషన్‌, ఎదుగుదల.

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-III > పేపర్ - 3 > సెక్షన్‌ - 2

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సమకాలీన సమస్యలు     75 Marks



1. జాతీయాదాయం, భావనలు - స్థూల జాతీయోత్పత్తి - నికర జాతీయోత్పత్తి, మానవాభివృద్ధి సూచీ (అభివృద్ధి మాపనంగా) -ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం, ఉద్యోగితలో వ్యవసాయం పాత్ర.

2. ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళికలు -కేటాయింపులు - ప్రభుత్వ రంగ ప్రణాళికలకు ఆర్థిక సహాయం - ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళికలకు వనరుల కేటాయింపు.

3. ఆంధ్రప్రదేశ్‌ భూ సంస్కరణలు - భూసంస్కరణల అవసరం - ఆంధ్రప్రదేశ్‌లో భూకమతాల స్వరూపం - అడవులు, సాగు నేల, సాగునీటి పారుదల విస్తీర్ణం - పంటల విధానం - వ్యవసాయ రుణాల వనరులు - వ్యవసాయ సబ్సిడీలు - ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ.

4. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు - వృద్ధి స్వరూపం - చిన్న, కుటీర పరిశ్రమల పాత్ర - సహకార వ్యవస్థ - ఆంధ్రప్రదేశ్‌ మొత్తం పరపతిలో సహకార సంఘాల వాటా.

5. ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం - ప్రాముఖ్యం - ఆంధ్రప్రదేశ్‌లో రవాణా, విద్యుత్‌, సమాచారం, పర్యాటకం, సమాచార సాంకేతికతలకు ప్రాధాన్యమిస్తూ సేవారంగం కూర్పు, వృద్ధి.    

చమత్కార శ్లోకం

 చమత్కార శ్లోకం 


ఏకా భార్యా ప్రకృతి రచలా, చంచలాచ ద్వితీయా
పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః
శేషశ్శయ్యా ప్యుదధి  శయనం, వాహనం పన్నగారిః
స్మారం స్మారం స్వగృహ చరితం దారు భూతొ మురారి:

ఒకాయన ఉత్కళ దేశం లో వున్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి  ఉండడం చూసి ఆశ్చర్య పోయాడట. ఎందుకు? సామాన్యంగా అన్ని దేవాలయాల్లో విగ్రహాలు రాతితోగానీ లోహాలతో గానీ చేయబడి వుంటాయి. ఆ దారుమూర్తిని చూసిన ఆదికవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది. అదేమంటే శ్రీ మహా విష్ణువు తన కుటుంబం లోని వారి ప్రవర్తనలు చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట. విష్ణుమూర్తికి యిద్దరు భార్యలు ఒకావిడ ఒకరు కదలకుండా వుండే ప్రకృతి (భూదేవి)ఇంకొకావిడేమో ఒకచోట ఉండకుండా మనుష్యులను మారుస్తూ తిరుగుతూ వుంటుందిట. కొడుకు చూద్దామా అంటే ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ వుంటాడు.అందర్నీ బాధిస్తూ వుంటాడు. వాడేమైనా బలంగా వున్నాడా అంటే వాడికి శరీరమే లేదు. ఒక్క క్షణం విశ్రాంతి  తీసుకుందామా అంటే తాను నడుము వాల్చేది ఒక పెద్ద పాము మీద మెత్తగా వుంటుంది కానీ ఎంతసేపూ బుసలు కొడుతూ వుంటుంది.
ఒక తలా ఏమన్నా వెయ్యితలలాయే ఒకటి తర్వాత ఒకదానితో బుసలు కొడుతూంటాడు.
అది ఉండేది సముద్ర మధ్య లో అన్నీ అలలే హోరున శబ్దం ఒక అల అటువైపునుండి కొడితే ఇంకొకటి యిటువైపునుంచి కొడుతుంది. పోనీ వాహనమై ఎక్కి బయటికి పోదామా అంటే అది కూడా ఒక గ్రద్ద, పైన ఎగురుతూ పోతూవుంటే కింద పాము కనబడితే చాలు
తన యజమాని పని మర్చిపోయి గబుక్కున క్రిందికి దిగి ఆ పామును కాళ్లతో పట్టుకొని తినేదాకా కదలడు. ఇవన్నీ తలుచుకొని  తలుచుకొని విష్ణువు కొయ్యబారి పోయాడట.
కవుల మనసులో  ఏది మెరిస్తే అది చమత్కారంగా చెప్పేస్తారు.     

"శ్రీ భగవాన్ రమణ మహర్షి"

"శ్రీ భగవాన్ రమణ మహర్షి"


🌻🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి🌹🌻

🍀రమణ మహర్షి తత్వం :    అద్వైత వేదాంతము

🍀ఉల్లేఖన :    మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేను అనునది.

🍀శ్రీ రమణ మహర్షి (తమిళం : ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు.బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.

🍀రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.

🌷కుటుంబ నేపథ్యం🌷

🍀శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.

🌷బాల్యం🌷

🍀పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.

🌷బోధనలు🌷

🍀స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

🍀"The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
"In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."

🌷శ్రీ రమణ మహర్షి శిష్యులు    🌷

🍀కావ్యకంఠ గణపతిముని

🍀యోగి రామయ్య

🌷భగవాన్ గురించి చలం🌷   

🍀భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.

🍀చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, ఒక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! when you were in Thiruvannamalai go for a walk around the hill. The Arunachala hill will gives the power to all the hill itself called (Tejolingam). Shankara charya we sat in the hill and done the mediatation around the hill. if you can for a while into the hill you can catch the power.         

సబీర్ భాటియా (పంజాబీ: ਸਬੀਰ ਭਾਟਿਯਾ, హిందీ: सबीर भाटिया)

సబీర్ భాటియా (పంజాబీ: ਸਬੀਰ ਭਾਟਿਯਾ, హిందీ: सबीर भाटिया) (జననం డిసెంబర్ 30, 1968) ఒక భారతీయ అమెరికన్ . ఇతను హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు యొక్క సహ-వ్యవస్థాపకుడు. భాటియా ఆస్తుల విలువ 200 మిలియన్ల USD.


🌷జీవిత చరిత్ర🌷

🍀సబీర్ భాటియా భారతదేశంలోని చండీఘర్ లో ఒక హిందూ పంజాబీ కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి, బలదేవ్ భాటియా భారత సైన్యంలో అధికారిగా పనిచేసారు, తరువాత ఆయన భారత రక్షణ మంత్రిత్వశాఖలో చేరారు, అతని తల్లి దమన్ భాటియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక సీనియర్ అధికారిణి. భాటియా బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్స్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్య నభ్యసించాడు. 1986లో అతను పిలాని లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) లో తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను ప్రారంభించి BITS లో రెండు సంవత్సరములు గడిచిన తర్వాత కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్ టెక్) కు బదిలీ చేయబడ్డాడు. కాల్ టెక్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న తర్వాత సబీర్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో M.S. చేయటానికి 1989లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయమునకు వెళ్ళాడు. స్టాన్ఫోర్డ్ లో, అతను అల్ట్రాలో పవర్ VLSI డిజైన్ పై పనిచేసాడు.

🍀స్టాన్ఫోర్డ్ లో, అతను స్టీవ్ జాబ్స్ మరియు స్కాట్ మాక్ నీలీ వంటి వ్యవస్థాపకులను చూసి ప్రభావితుడయ్యాడు మరియు చిట్టచివరకు తను కూడా అలా అవాలని నిశ్చయించుకున్నాడు. మాస్టర్స్ తరువాత Ph.D. చేయటానికి బదులు, అతను ఆపిల్ లో చేరాలని నిర్ణయించుకున్నాడు.

🌷హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు🌷

🍀సబీర్ భాటియా ఫైర్ పవర్ సిస్టమ్స్ ఇన్కార్పోరేషన్ అనే కొత్తగా ప్రారంభించిన ఒక సంస్థలో చేరి అక్కడ రెండు సంవత్సరములు పనిచేసాడు. 1994లో, సబీర్ ఇంటర్నెట్ కు సంబంధించిన నూతన ఆలోచనల పై పని చేయటం ప్రారంభించాడు మరియు ఆపిల్ కంప్యూటర్, ఇన్కార్పోరేషన్ లో తన సహోద్యోగి అయిన జాక్ స్మిత్ తో జతకట్టాడు.

🍀ఆ ఇద్దరికీ జావా సాఫ్ట్ అనే పేరుతో ఒక వెబ్ - ఆధారిత డేటా బేస్ గురించిన ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను అమలులో పెడుతూ ఉండగా, తత్ఫలితంగా వారు వెబ్-ఆధారిత ఈ-మెయిల్ వ్యవస్థ యొక్క శక్తిని గ్రహించారు. ఆ విధంగా HoTMaiL (మొదటి బడి అక్షరములు HTML లోని వర్ణక్రమాన్ని సూచిస్తాయి— HTML అనేది వెబ్ పేజి యొక్క మూలాన్ని రాయటానికి ఉపయోగించే భాషను రూపొందించాలని నిర్ణయించారు. అందరి దృష్టిని ఆకర్షించటానికి, ఆ ఈ-మెయిల్ సర్వీసు ఉచితంగా అందజేయబడింది మరియు ఆ వెబ్ సైట్ లో ఉన్న ప్రకటనల ద్వారా దానికి రాబడి వచ్చింది. డ్రేపర్ ఫిషర్ వెంచర్స్ ఆ ప్రాజెక్ట్ లో $300,000 పెట్టుబడి పెట్టింది మరియు జూలై 4, 1996న ఆ సర్వీసు ప్రారంభమైంది.

🍀ఆరు నెలల లోపే, ఆ వెబ్ సైట్ ఒక మిలియన్ పైగా చందాదారులను ఆకర్షించింది. వెబ్-ఆధారిత ఈమెయిల్ సౌకర్యము పై ఆసక్తి పెరగటంతో, మైక్రోసాఫ్ట్ చిట్టచివరకు దానిని పరిగణలోకి తీసుకుంది. డిసెంబర్ 30, 1997 (భాటియా యొక్క 29వ పుట్టినరోజు) న $400 మిలియన్లకు హాట్ మెయిల్ మైక్రోసాఫ్ట్ సంస్థకు అమ్మబడింది. ప్రోత్సాహ పారిశ్రామికత్వానికి యునైటెడ్ స్టేట్స్ లో అనుకూలంగా ఉన్న పరిస్థితులకు అతను ఈ ఘనతను ఆపాదించాడు. ఒక ముఖాముఖీలో, అతను "తను భారతదేశంలో ఇప్పటికీ హాట్ మెయిల్ ను సృష్టించలేనని" పేర్కొంటూ భారత ప్రభుత్వాన్ని ఆక్షేపించాడు.

🌷ఇతర కార్యక్రమాలు🌷

🍀హాట్ మెయిల్ ను అమ్మివేసిన తర్వాత, భాటియా ఒక సంవత్సరం పాటు మైక్రోసాఫ్ట్ లో పనిచేసాడు మరియు ఏప్రిల్ 1999లో వేరొక వెబ్ సైట్, ఆర్జూ ఇంక్, ను ప్రారంభించటానికి సంస్థను విడిచిపెట్టాడు. డాట్-కామ్ పొంగు చల్లారినప్పుడు ఆ సంస్థ మూతపడింది. 2010లో, అతను ఆర్జూను ఒక రవాణా పోర్టల్ (ప్రవేశము) గా పునః ప్రారంభించాడు.

🍀అతను (సహ-వ్యవస్థాపకులు షిరాజ్ కంగా మరియు విరాఫ్ జాక్ లతో పాటు) బ్లాగ్ ఎవ్రీవేర్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించాడు. ఈ వెబ్ సైట్ వృద్ది చెందుతున్న బ్లాగోస్పియర్ నుండి లాభాలు ఆర్జించాలని ప్రయత్నిస్తోంది.

🍀2006లో, అతను ఒక నెట్వర్క్ సెక్యూరిటీ విక్రేత మరియు SSL VPN-ప్లస్ యొక్క సృష్టికర్త అయిన నియోయాక్సెల్ కు ప్రధాన ముదుపుదారుడు అయ్యాడు.

🍀నవంబర్ 2007లో, అతను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కు ప్రత్యామ్నాయంగా లైవ్ డాక్యుమెంట్స్ అనే ఆన్లైన్ ఆఫీస్ ను విడుదల చేసాడు. ఈ అప్లికేషను వాడుకదారులు వారి డాక్యుమెంట్లను ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ రెండిటిలోనూ ఉపయోగించుకోవటానికి, రియల్-టైం (ఒక పని జరగటానికి పట్టే వాస్తవ సమయం) లో ఆ డాక్యుమెంట్లను దిద్దుబాటు చేయటానికి, ఇతరులతో కలిసి పనిచేయటానికి, పంచుకోవటానికి మరియు డాక్యుమెంట్లను వివిధ కంప్యూటర్లు మరియు వాడుకదారుల మధ్య సంతులనం చేయటానికి వీలు కల్పిస్తుంది. వాడుకదారులు వారి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్లగ్-ఇన్ కు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫీసు డాక్యుమెంట్ నమూనాలు అన్నింటికి పూర్తి పొందికతో పాటు, ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ సమూహములలో ఉత్తమమైన దానిని పొందటానికి వీలు కల్పిస్తుంది.

🍀భారతదేశ గృహములలోని కేబుల్ టెలివిజన్ ద్వారా అంతర్జాలంలోకి ప్రవేశించే అవకాశం కూడా అతను ప్రయత్నించాడు.

🍀జనవరి 2008లో, సబీర్ తన సరికొత్త వ్యాపార సంస్థ SabSeBolo.com ప్రారంభాన్ని గురించి ప్రకటించాడు, ఇది ఒక ఉచిత వెబ్-ఆధారిత టెలీ కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ ("సబ్ సే బోలో" అనగా హిందీలో " ప్రతి ఒక్కరితో మాట్లాడదాం" అని అర్ధం). 14 జూన్ 2009న, సబీర్ భాటియా యొక్క సబ్సేబోలో, బయట పెట్టబడని మొత్తానికి ఇంటర్నెట్ టెలీఫోన్ సర్వీసు స్టార్ట్అప్ Jaxtr ను సొంతం చేసుకుంది. Jaxtr అదే వ్యాపార సంస్థ పేరుతో పనిచేస్తుంది మరియు తన అతిపెద్ద వాడుకదారుల జాబితాతో సబ్సేబోలోకి సహాయం చేస్తుంది.

🍀అతని భవిష్యత్తు ఆలోచనలలో భారతదేశంలో నానోసిటీ అనే పేరుతో ఒక కొత్త నగరాన్ని వృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. నానో సిటీ యొక్క లక్ష్యం సిలికాన్ వ్యాలీలో కనిపించే స్పందన మరియు నవకల్పనల ఆవరణ-వ్యవస్థను ప్రతిబింబించటం.

🌷వ్యక్తిగత జీవితం🌷

🍀అతను 2008లో బైద్యనాథ్ సంస్థ వారసురాలైన నాగపూరుకు చెందిన, తానియా శర్మను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒకరితో ఒకరికి ఎనిమిది సంవత్సరముల స్నేహం ఉంది. వారు మలేషియాలోని లాంగ్ కావిలో ఒక వ్యక్తిగత వేడుకలో వివాహం చేసుకున్నారు.

🌷పురస్కారాలు🌷

🍀వెంచర్ కాపిటల్ సంస్థ (సాహస మూలధన సంస్థ) డ్రేపర్ ఫిషర్ జుర్వెట్సన్ నుండి "ఆ సంవత్సరపు అవస్థాపకుడు," పురస్కారం అందుకున్నాడు (1998)

🍀నూతన ఆర్థిక వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టించిన ఉత్తమమైన పదిమంది వ్యక్తుల యొక్క అప్ సైడ్ పత్రిక జాబితా "ఎలైట్ 100, "లో చేరాడు

🍀రాబోయే కొద్ది సంవత్సరములలో సాంకేతికత పై గొప్ప ప్రభావం చూపుతారని భావిస్తున్న 100 మంది యువ ఆవిష్కర్తలకు MIT ఇచ్చే TR100 పురస్కార గ్రహీత

🍀శాన్ జోస్ మెర్క్యురీ న్యూస్ మరియు POV పత్రికలచే అత్యంత విజయవంతమైన పదిమందిలో ఒకడుగా ఎన్నికయ్యాడు (1998)

🍀TIME చేత అంతర్జాతీయ వ్యాపారములో "గమనించదగిన వ్యక్తు"లలో ఒకడుగా పేరుపొందాడు (2002)                       
[8:12 AM, 12/30/2016] +91 94415 65994: 🌻🌹డిసెంబర్ 30 "రుడ్యార్డ్ కిప్లింగ్" జయంతి సందర్భంగా..... 🌹🌻

🍀రుడ్యార్డ్ కిప్లింగ్ (డిసెంబర్ 30, 1865 – జనవరి 18, 1936) ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి. బొంబాయిలో జన్మించాడు. ఈయన రాసిన చాలా కథలను ఆంగ్ల చందమామ పుస్తకంలో ప్రచురితమైనాయి.

🍀 1894 లో ఆయన రాసిన ది జంగిల్ బుక్ అనే కథా సంకలనంతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యాడు. కథా సాహిత్యంలో ఆయన ఒక దార్శనికుడుగా కొనియాడబడ్దాడు. పిల్లల సాహిత్యంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది.

🍀సాహిత్యంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1907 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆంగ్ల రచయిత ఆయనే కావడం విశేషం. అంతే కాకుండా నోబెల్ బహుమతి నందుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు.                      
.