Pages

Saturday, July 9, 2016

మనం మన జీవితం లో ఇంకో కలాం ను చూడలేము ... పి ఎం నాయర్

మనం మన జీవితం లో ఇంకో కలాం ను చూడలేము ... పి ఎం నాయర్

.
కలాం గారి సెక్రెటరీ గ పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ పోదిగై వారు చేసిన ఇంటర్వ్యూ లో కొన్ని బాగాలు యొక్క తెలుగు అనువాదం నా తెలుగు మిత్రుల కోసం :
.
.
1 . డాక్టర్ కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయన కు ఆ యా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారు అని అది మన దేశాన్ని ఇరకాటం లో పెడుతుంది అని వాటిని తీసుకునే వారు . ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి కేటలాగు తయారు చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు . ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలోనుండి తనతో తీసుకు వెళ్ళలేదు
.
.
2. 2002 లో రంజాన్ జూలై ఆగస్ట్ నెలలో కాబోసు వచ్చింది . రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం మన దేశం లో . ఒక రోజు కలాం గారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు . దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాను . “ బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవుసరం . ఆ సొమ్మును పేదవారికి బ్లాంకెట్లు , బట్టలు , ఆహారం ఇవ్వడం కోసం కేటాయించండి అని అనాదాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు . అనాదాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు . అందులో ఆయన ఎటువంటి జోక్యమూ చేసుకోలేదు . ఎంపిక అయ్యాక నన్నుతన రూమ్ లోకి పిలిచి “ ఈ లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన , నేను ఇచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి “ అన్నారు . నేను ఈ విషయం అందరికీ చెబుతాను అంటే ఆయన వద్దు అన్నారు . తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరు లేరు . ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి అబ్దుల్ కలాం !
.
.
3. ఆయనకీ తన మాటలకు అందరూ “ ఎస్ సర్ “ అనాలి అనే నైజం లేదు .
ఒక రోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగారు .
“ నో సర్ ! “ అన్నాను . ఆయన మౌనంగా ఉండిపోయారు . మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయ మూర్తి గారు నన్ను పిలిచి అలా అన్నారేమిటండి అన్నారు . ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సర్ ! విని అవుసరం అయితే తన అభిప్రాయం మార్చుకుంటారు సర్ “ అన్నాను . ఆయన ఆశ్చర్య పోయారు .
.
.
.
4. కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు . వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు . దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు . ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు . వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టించారు . అది సుమారు రెండు లక్షలు అయ్యింది . ఆ రెండు లక్షలూ ఆయన చెల్లించారు . ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు . ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు . ఆ రోజులకి ఆయన అద్దె చేల్లిస్తాను అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు . ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు అట్టేపెట్టుకున్నందుకు తన నివాసానికి తానే అద్దె చెల్లించాలి అనే నిజాయతీ ని మేము భరించలేము అని మేము ఒప్పుకోలేదు
.
.
.
5. ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్లేముందు అందరమూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్లి కలిశాము . అందరినీ పేరు పేరునా పలకరించారు . నా భార్య కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది . ఆయన అడిగారు నా భార్య ఎందుకు రాలేదు అని .
.
చెప్పాను .
.
మర్నాడు మా ఇంటి ముందు పోలీస్ లు . ఏమిటి హడావుడి అని అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారు అని చెప్పారు .
.
ఇంత వరకూ ప్రపంచం లో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని అతడి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించడం చరిత్రలో ఎక్కడా జరగలేదు .
.
చివరిగా ఒక టి వి వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు :
.
.
1) 3 పేంట్లు
2) 6 షర్టులు
3) 3 సూట్లు
4) 1 వాచ్
5) 2500 పుస్తకాలు
6) Bangalore Flat handed over to scientists community long time ago
7) ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్
.
8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు . ఈ విషయాలు తెలియని వారికి అందరికీ తెలియచెప్పడం కోసం మీరు షేర్ చేసిన సరే , కాపీ పేస్టూ చేసుకున్నా సరే ! నా పేరుతో ఉండడం కన్నా ఒక గొప్ప మహానుభావుడిని మనం కళ్ళతో చూశాము అనీ ఆయన నివసించిన కాలం లో మనమూ నివసించామనీ అందరికీ తెలియచేయ్యడం ప్రధానం . ...

No comments:

Post a Comment

.