Pages

Wednesday, May 24, 2017

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు


ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు

 రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కోవాలి.
 ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
 మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
 నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
 వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
 పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
 భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
 గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
 శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
 ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .
 రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
 అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
 కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
 అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
 ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
 విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
 పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
 మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .
 ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
 రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
 అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
 వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
 నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
 పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
 ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
 దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
 ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
 ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
 చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
 మినుములు అతిగా వాడరాదు.
 వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
 చవిటి ఉప్పు మంచిది కాదు.
 గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
 పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
 దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
 మలమూత్ర వేగములను ఆపరాదు .
 ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
 హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .
 స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
 విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
 గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
 ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
 నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
 నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
 తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
 కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
 ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .
 ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
 మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
 అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
 నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
 పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
 స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
 ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
 బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
 నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
 గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .
 మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .
 పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .
 సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .
 రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.
 మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .
 స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .
 బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .
 నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .
 భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.
 మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .
 అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .
 ముక్కుతో శబ్దం చేయకూడదు .
 పళ్ళు కొరకకూడదు .
     పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది.  రక్తం నందు మర్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును.  ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి .⁠⁠⁠⁠
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

















No comments:

Post a Comment

.