Pages

Saturday, June 17, 2017

మానవజన్మ విలువ ఎంత.?

మానవజన్మ విలువ ఎంత.?

రాళ్ళు కొట్టుకుని జీవించే రమేశ్ ఒక
రోజున తన పని చేసుకుంటూ ఉండగా
కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా
కనిపించింది. దానికి మురిసి అతను ఆ రాయిని
గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి
భార్యకు ఇచ్చాడు.

ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల
తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి
రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది
తరువాత ఆ రాయిని అదే పనికి
చాలా సార్లు వాడుకున్నది.

ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రఘు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ
రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు.
కొద్ది సేపటికి
అటుగా మిఠాయిలు అమ్ముకునే ప్రసాద్
వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి
చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు
చేతిలో పట్టుకుని
వెళ్ళాడు.

ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను
బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ
(పల్లీపట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు
సంతోషంతో ఆ రాయి ప్రసాద్ కి  ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని
స్నేహితుడు గోపీ  చూసి ఆ రాయి గురించి అడిగితే
అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని
ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ
స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.

అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి
చెత్త వస్తువులు కొనే నారయణ వద్దకి పోయి
వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి
అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా
అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము
తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.
బాగుంది
కదా అని వ్యాపారి నారయణ దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా
వాడసాగాడు.

కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి పాండు ఇతని దుకాణానికి
వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ
రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి రాజు వద్దకి
తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు
విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.💦💥💦

💦💥నీతి :-💦
అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు
కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ
ఆటఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ
కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు.
ఒకళ్ళు దాన్ని
పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని
గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ
రాబట్టుకున్నాడు.

అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో
అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి
అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి
ఉంటుంది. మానవ జీవిత పరమార్థం
తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ
జీవన్ముక్తి పొంద గలుగుతారు.
లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.
జీవిత లక్ష్మాన్ని గుర్తిద్దాం - జీవన గమనాన్ని
సాగిద్దాం.

అందరూ తప్పక,తప్పక చదవాల్సిన విషయం ఇది.
Everyone must read.....it inspires you most.

25 సంవత్సరాలకు ముందు గోవా దగ్గర ఒక పల్లెటూరు ఉండేది.ఆ వూరు అతిపెద్ద పుచ్చకాయలను పండించడంలో చాలా ప్రసిద్ధి పొందింది.ఆ ఊరిలో రైతులు పంట కోసే సమయంలో పిల్లలకు ఒక పోటీ పెట్టేవారు.పిల్లలు ఎవరికి ఎన్ని పూచ్చకాయలు కావాలంటే అన్ని తినవచ్చు.ఎవరు ఎక్కువ కాయలు తింటే వారికి గొప్ప బహుమతి ఉండేది.పిల్లలంతా ఆనందంగా ఆ పోటీలో పాల్గొనేవారు.ఆ పిల్లలలో ఒక్కడికి IIT లో సీటు వచ్చి పక్క రాష్ట్రానికి చదువుకు వెళ్ళిపోయాడు.ఆ అబ్బాయి 6 సంవత్సరాలు తర్వాత తన సొంత ఊరికి వెళ్ళాడు.ఆ అబ్బాయికి చిన్ననాటి పుచ్చకాయలు తినే పోటీ గుర్తొచ్చి ఊరి బయటే ఉన్న కూరగాయల మార్కెట్టుకెళ్లి....మొట్ట మొదట పెద్ద పుచ్చకాయను తృప్తిగా తినేసి వెళ్లాలని అనుకున్నాడు.

మార్కెట్లోకి వెళ్ళగానే ఒక చోట ఒక యువ రైతు పుచ్చకాయల పోటీ జరుపుతుండటం చూసి ఆనందంగా అక్కడికి వెళ్ళాడు.
కానీ ...ఆ పోటీలో అన్నీ చిన్న చిన్న కాయలే ఉన్నాయి....ఎక్కడ వేదికినా పెద్ద సైజు కాయలే కనబడలేదు.
ఆ అబ్బాయికి చాలా నిరాశ కల్గింది.దేశంలోనే పెద్ద పుచ్చకాయలు పండించే ఊరిలో .....చివరికి పెద్ద కాయలే పండ లేదు.

దీనికి కారణం ఏమై ఉంటుంది? అని ఆ అబ్బాయి ఆలోచించాడు.
చివరికి దానికి కారణం కనుక్కొన్నాడు.
తాను చిన్నగా ఉన్నప్పుడు...రైతులు కాయలపోటీల్లో...పెద్ద పెద్ద కాయలను ఇచ్చి వాటి గింజల్ని మాత్రం ఒక గిన్నెలోకి ఉంచమని... పిల్లల్ని కోరేవారు.తర్వాతా ఆ గింజల్ని సేకరించి మళ్ళీ నాటుకొని పెద్ద పెద్ద కాయలని పండించేవారు.
కానీ తర్వాత ....ఆ రైతుల కొడుకులు ....వారసత్వం తీసుకొని
ఈ పోటీలు నిర్వహించసాగారు. వారు ....పుచ్చకాయల పోటీల్లో పెద్ద కాయలకు బదులు ....చిన్న చిన్న నాసి రకం కాయల్ని ఇచ్చి పోటీలు జరిపారు. ఆ చిన్న కాయల గింజల్ని సేకరించారు.
పెద్ద కాయలను మాత్రం లాభాలకు అమ్మేవారు.
అలా ప్రతి సంవత్సరం చేశారు.సరిగ్గా...4 సం. ల కే పెద్ద కాయలు కాయడమే నశించిపోయింది.

మనం కూడా ....మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో చాలా ఘోరంగా విఫలం అవుతున్నాము. మన భారతీయ సంస్కృతిలో మహిమాన్విత గాధలైన రామాయణ, భగ్వద్గీతలను,మన సంస్కృతీ లోని మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో మనం గత 25 సంవత్సరాలుగా విఫలమై...వారికి పనికిమాలిన పుచ్చు గింజల్లాంటి పద్దతులను నేర్పించి......మార్కులు వస్తే చాలు....ఇక మనుషులు ఏమైపోయినా ఫర్వాలేదు....పెద్ద ఉద్యోగం వస్తే చాలు...తల్లి దండ్రులను తన్ని తరిమేసినా ఫర్లేదు......
ఆడపిల్లలను ....ఆకలిగా చూసినా ఫర్లేదు....బాగా డబ్బు సంపాదిస్తే చాలు......పేదవాడికి కాస్త సాయం చేయక పోయినా ఫర్లేదు......ఆస్తులు కూడబెడితే చాలు.....అన్న చందంలో.... పెద్దలు జీవించడం వలనే...... ఈ నాడు ఇంట్లోని ఆడబిడ్డను బయటికి పంపాలంటే ....భయపడే దౌర్భాగ్యం దాపురించింది.

పెద్దలారా.....మేలుకోండి
పిల్లలకు ...మంచిని నేర్పండి,సంస్కారాన్ని ఇవ్వండి
రాముడి గురించి చెప్పండి......వచ్చే కాలమంతా బాగుంటుంది.
లేకపోతే...ఇలాగేIIT ఫౌండేషన్ లు, ఒలంపియడ్ లు అంటూ పిల్లలను నాశనం చేసి... పనికిమాలిన దద్దమ్మల్లా తీర్చి దిద్దకండి.

మన జాతికి కావాల్సింది...మార్కులు కాదు...మంచి పౌరులు.

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment

.