Pages

Wednesday, June 7, 2017

మన కర్తవ్యం - ఆత్మ పరిశీలన

మన కర్తవ్యం - ఆత్మ పరిశీలన


ఇంటా బయట  పాఠశాల లో కూడా  మానవ సంభాందాలు  దెబ్బ తినకుండా  ఉండాలంటే  మన ఆలోచనధోరణి ,  మన బావోద్వాగాలు మొండి  పట్టుదలకు వీడ్కోలు  పలకాలి.

విమర్శలు అనేవి   ఎదుట  వారికి  ఆత్మీయ  సలహాలు గా వుండాలి.
ఎదుట వారు  సరిగా చేసుకోనే విధంగా  వుండాలి.  నలుగురు లో విమర్శలు   చేయడం అనేవి  పరోక్షంగా  అది  కసి తో కూడిన  విమర్శే
విమర్శ అనేది ఒక  రకమైన అసంతృప్తి. అయిష్టత ను అసూయ ను తెలుపుతుంది.

ఇంటా బయట  పాఠశాల లో కూడా  మానవ సంభాందాలు  దెబ్బ తినకుండా  ఉండాలంటే  మన ఆలోచనధోరణి ,  మన బావోద్వాగాలు మొండి  పట్టుదలకు వీడ్కోలు  పలకాలి.

పిల్లలు తప్పు  చేస్తే  సరిదిధ్ద వచ్చు కానీ  ఆ తప్పు ను  అదే  పనిగా  గుర్తు  చేయకండి తప్పులు అందరూ చేస్తారు.

ఆత్మ విశ్వాసము  కలిగేలా  డ్రస్ లు  ధరించనివ్వండి. ఏ చిన్న  విజయం  సాధించిన  కుటుంబంలోని  అందరూ  మెచ్చుకోండి . ఫ్రతిభను గుర్తుంచండి.  ఏ నైపుణ్యం కలిగి  వున్నారో  గుర్తించండి.

తల్లి దండ్రులు,  ఉపాధ్యాయులు:-
కొంత మంది  తమ పిల్లలను  వారి  సామర్థ్యాలను తక్కువ  అంచనా  వేస్తూ  వారిని  హేళన  చేస్తూ  ఇతరులు  ముందు  మాట్లాడుతూ వుంటారు,  వీరికి  పిల్లల్లో  ఉన్న  బలహీనతలు  మాత్రమే  కనిసిస్తాయి. పిల్లల లోని పాజిటివ్  అంశాలు  వీరికి  గుర్తుకు  రావు.  ఇలా  మాట్లాడితే వారి  ఆత్మ విశ్వాసము  దెబ్బ తినును.

ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకే భోధనా మాధ్యమం ఉండాలి. మేథావులు , ప్రజాప్రతినిధులు ఉద్యోగులు ఆంగ్లం మాధ్యమం నకు ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల ఆ అవకాశం ప్రభుత్వపాఠశాలల్లో లేకపోవడం వల్ల అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని పట్టణాలకు పోయి ప్రవేటు పాఠశాలల్లో చదివించడం ,పుట్టిన 3years కే మానసిక శారీరిక ఎదుగుదల చూడకుండా prepraimary పేరు తో ప్రవేటు పాఠశాలల్లో చదివించడం వంటి కారణాలు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలలు తగ్గుతున్నాయి.ఈ సంవత్సరం పాఠశాలల హేతుబద్ధీకరణ వల్ల  9000 పాఠశాలాలు రాష్ట్రంలో మూత పడుతున్నాయి. ఒకే సిలబస్ ,ఒకే పరిక్షా విధానం ,ఒకే మూల్యాంకనం  ప్రభుత్వ ప్రవేటు పాఠశాలల్లో ఉన్నపుడు ఒకే బోధనామాథయమం ఎందుకు లేదు?

మనం  అందరం  ప్రభుత్వ  పాఠశాలల్లో చదివిన వారమే  మనకు  English, knowledge  వుంది. కొంచెంసేపు practice  చేస్తే  దారాళంగా, మనము English లో   మాట్లాడగలం, ఇది తెలిసి కూడా   ఇంగ్లీషు  మీడియం  లో   ప్రైవేటు  పాఠశాలలకు  మన  పిల్లలు ను  పంపటంలో ఔచిత్యం ఏమిటో,

స్మార్ట్‌ఫోన్‌ వాడటంతో మానసిక రుగ్మతలు;-

మెల్‌బోర్న్‌: అర్ధరాత్రి దాటినా కూడా మీరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా!  అయితే మీరు మానసిక రుగ్మతలకు లోను కాబోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే యువత నాణ్యమైన నిద్రను పొందలేకపోవడం, స్వీయ నియంత్రణను కోల్పోవడం వంటి సమస్యలతోపాటు మానసిక రుగ్మతలతో బాధపడతారని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 1,100 మంది 8 నుంచి 11 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులపై అధ్యయనం నిర్వహించి వెల్లడించారు.

అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎనిమిదేళ్ల వయసు కలిగిన విద్యార్థుల్లో దాదాపు 85q శాతం మంది స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారని, వీరిలో 1/3 వంతు మంది అర్ధరాత్రి దాటిన తర్వాత తాము ఫోన్‌ వినియోగించబోమని చెప్పారని వెర్నన్‌ తెలిపారు. మూడేళ్ల తర్వాత వీరిలో 93 శాతం మంది సొంత స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్నారని, కేవలం 22 శాతం మంది మాత్రమే అర్ధరాత్రి అనంతరం స్మార్ట్‌ఫోన్‌ వినియోగించబోమని చెప్పినట్లు తెలిపారు. అయితే వీరి వయసు పెరిగే కొద్దీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌ను వాడటం పెరిగిందని, వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించడంతోపాటు, నిద్రలేమి సమస్యలు తీవ్రం అయ్యాయని వెర్నన్‌ వివరించారు.

పిల్లలు  వయస్సు . గురించి కొన్ని విషయాలు.;-

8,9,10 చదివే విద్యార్థులు బాల్యం నుంచి యవ్వనం లోకి వెళుతున్నారు. వారికి అందవలసిన విషయాలు రోజూ చదివే విద్యా వ్యవస్థ లో కంఠస్తం‌, పరీక్షల లో మార్కులు తప్ప వారికి కావలసిన నైతిక విలువలు, వయస్సు లోమార్పు, కుటుంబ విలువలు, సంస్కారం చెప్పే అవకాశం , మాట్లాడే అవకాశాన్ని ఉపాధ్యాయులు తల్లి దండ్రులు  , కల్పించాలి.,

లేకుంటే  పిల్లలు ,  భ్యవిషత్తులో,  నన్ను  అర్థం  చేసుకునే  జ్ఞానం  నా ఉపాధ్యాయులకు గానీ,  తలిదండ్రులు, గానీ లేదని భావించి     ఆత్మహత్య ఆలోచన లోకి పిల్లలు వస్తారు.

 ప్లేట్ లో భోజనాన్ని చేతితో  ,  తింటే  కలిగే తృప్తి  , తెలుగుమీడియం అంటారు.
అదే భోజనాన్ని  , స్పూను తో  తింటే  కలిగే తృప్తి  , ఇంగ్లీషు మీడియం అంటారు.





No comments:

Post a Comment

.